Let's talk: editor@tmv.in
మక్తల్, నారాయణపేట, కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ తో లక్ష ఎకరాలకు సాగునీరు: సీఎం రేవంత్ రెడ్డి

మక్తల్, నారాయణపేట, కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ తో లక్ష ఎకరాలకు సాగునీరు: సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మక్తల్-నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల పథకం పనులను పరిశీలించి, లక్ష ఎకరాలకు సాగునీరు అందించేలా ఈ ప్రాజెక్టును త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. జూన్ 4, 5 తేదీల్లో మహబూబ్‌నగర్, నారాయణపేట జిల్లాల్లో పర్యటించనున్న సీఎం, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుతో పాటు కరివేన, ఉద్దండపూర్ రిజర్వాయర్ పనులను సమీక్షించి, ఉద్దండపూర్ బహిరంగ సభలో ప్రసంగించనున్నారు.

కొత్త ఏవియేషన్ పాలసీ సహా 34 ప్రతిపాదనలకు ఏపీ కేబినెట్ ఆమోదం

కొత్త ఏవియేషన్ పాలసీ సహా 34 ప్రతిపాదనలకు ఏపీ కేబినెట్ ఆమోదం

ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఊతమిచ్చేలా 34 కీలక ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇందులో భాగంగా విమానయాన, సాగునీరు, పర్యాటక రంగాలతో పాటు అమరావతి అభివృద్ధికి పెద్దపీట వేసింది. అవయవ మార్పిడి చట్టం అమలు, కొత్త ఏవియేషన్ పాలసీ, గ్రామీణ ఉపాధి పెంపు వంటి నిర్ణయాలతో పాటు పారిశ్రామిక, మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది.

రూ. 200 కోట్ల గంజాయి స్మగ్లింగ్: థాయ్‌లాండ్ లింక్స్, అండర్‌వరల్డ్ కనెక్షన్స్ బట్టబయలు!

రూ. 200 కోట్ల గంజాయి స్మగ్లింగ్: థాయ్‌లాండ్ లింక్స్, అండర్‌వరల్డ్ కనెక్షన్స్ బట్టబయలు!

థాయ్‌లాండ్ నుంచి హైడ్రోపోనిక్ గంజాయిని భారత్‌కు అక్రమంగా తరలిస్తున్న అంతర్జాతీయ డ్రగ్స్ ముఠాను తెలంగాణ ఈగల్ ఫోర్స్ ఛేదించి, ప్రధాన సూత్రధారి సహా 17 మందిని అరెస్ట్ చేసింది. రూ.250 కోట్ల విలువైన డ్రగ్స్ వ్యాపారంలో 300 మంది క్యారియర్లు, హవాలా నెట్‌వర్క్, మాజీ అండర్‌వరల్డ్ సభ్యుల ప్రమేయం ఉన్నట్లు దర్యాప్తులో వెల్లడైంది.

తెలంగాణలో నేటి నుండి అమలులోకి రానున్న నూతన భూ విలువలు

తెలంగాణలో నేటి నుండి అమలులోకి రానున్న నూతన భూ విలువలు

తెలంగాణలో సవరించిన భూముల మార్కెట్ విలువలు జూన్ 5 (నేటి)నుంచి అమల్లోకి రానుండగా, రిజిస్ట్రేషన్ ఛార్జీలను పెంచే ప్రతిపాదన లేదని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.

తిరుపతి స్పేస్ సిటీకి రష్యా భాగస్వామ్యం కోరిన లోకేష్!

తిరుపతి స్పేస్ సిటీకి రష్యా భాగస్వామ్యం కోరిన లోకేష్!

ఆంధ్రప్రదేశ్‌లో రూ.4 బిలియన్ డాలర్ల స్పేస్ సెక్టార్ పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా, రష్యా పారిశ్రామికవేత్తలను రాష్ట్రంలో భాగస్వాములు కావాలని మంత్రి నారా లోకేష్ ఆహ్వానించారు. శ్రీహరికోట సమీపంలో 3,000 ఎకరాలలో నిర్మించనున్న తిరుపతి స్పేస్ సిటీతో పాటు ఏరోస్పేస్, సెమీకండక్టర్ రంగాలలో పెట్టుబడులకు ఉన్న విస్తృత అవకాశాలను ఆయన వివరించారు.

ఏపీ లో భారీగా గంజాయి పట్టివేత: అంతర్రాష్ట్ర ముఠా గుట్టురట్టు, ఇద్దరి అరెస్ట్

ఏపీ లో భారీగా గంజాయి పట్టివేత: అంతర్రాష్ట్ర ముఠా గుట్టురట్టు, ఇద్దరి అరెస్ట్

ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం జిల్లా నాథవలస వద్ద ఒడిశా నుండి కేరళకు తరలిస్తున్న 80 కిలోల గంజాయిని డిఆర్‌ఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ అక్రమ రవాణాకు పాల్పడుతున్న ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి, ఎన్‌డిపిఎస్ చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

“మోడీ జీ మీ సమయం ముగిసింది” : వై ఎస్ షర్మిల

“మోడీ జీ మీ సమయం ముగిసింది” : వై ఎస్ షర్మిల

ఏపీసీసీ అధ్యక్షురాలు వై ఎస్ షర్మిల, మోడీ ప్రభుత్వం గత పదేళ్లలో ఆర్థిక వ్యవస్థ, ప్రజాస్వామ్య సంస్థలను బలహీనపరిచిందని ఆరోపిస్తూ “మోడీ జీ.. మీ సమయం ముగిసింది” అంటూ విమర్శలు గుప్పించారు.

ఏపీలో ఇంధన రంగ విస్తరణకు ఓఎన్‌జీసీ కొత్త ప్రణాళికలు

ఏపీలో ఇంధన రంగ విస్తరణకు ఓఎన్‌జీసీ కొత్త ప్రణాళికలు

ఓఎన్‌జీసీ చైర్మన్ అరుణ్ కుమార్ సింగ్ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో భేటీ అయి, కేజీ బేసిన్‌లో సాగుతున్న చమురు, గ్యాస్ అన్వేషణ ప్రాజెక్టులు, భవిష్యత్తు విస్తరణ ప్రణాళికలపై చర్చించారు.

‘కాక్రోచ్ జనతా పార్టీ వెనుక అర్బన్ నక్సల్స్’: తెలంగాణ బీజేపీ చీఫ్ రాంచందర్ రావు

‘కాక్రోచ్ జనతా పార్టీ వెనుక అర్బన్ నక్సల్స్’: తెలంగాణ బీజేపీ చీఫ్ రాంచందర్ రావు

కాక్రోచ్ జనతా పార్టీ వెనుక అర్బన్ నక్సల్స్, ఆప్ అనుబంధ వ్యక్తులు ఉన్నారని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రాంచందర్ రావు ఆరోపించారు. సోషల్ మీడియా ద్వారా కథనాలు ప్రచారం చేస్తున్న ఈ వేదికకు క్షేత్రస్థాయిలో ప్రజా మద్దతు లేదని ఆయన పేర్కొన్నారు.

అమీర్‌పేట్‌లో భారీ అగ్నిప్రమాదం..

అమీర్‌పేట్‌లో భారీ అగ్నిప్రమాదం..

హైదరాబాద్ అమీర్‌పేట్‌లోని ఓ షాపింగ్ కాంప్లెక్స్‌లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకోగా, ఏడు ఫైర్ టెండర్లు మంటలను అదుపులోకి తెచ్చాయి. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు కానీ కొంతసేపు అమీర్‌పేట్ నుండి ఎస్‌ఆర్ నగర్ వైపు వెళ్లే మార్గంలో ట్రాఫిక్ తీవ్రంగా ప్రభావితమైంది.

తొలి పలుకు - తెలుగు వార్తలు & కథలు