Let's talk: editor@tmv.in

Bold! Concerned! Unfiltered! Responsible!

Sudhir Pidugu
Sudhir Pidugu
Founder & Editorial Director
editor@tmv.in
క్వాంటం శిక్షణలో ఏపీ యువత అద్భుత స్పందన

క్వాంటం శిక్షణలో ఏపీ యువత అద్భుత స్పందన

ఎమర్జింగ్ టెక్నాలజీ రంగంలో ఆంధ్రప్రదేశ్ యువత మరో చారిత్రాత్మక మైలురాయిని అధిగమించింది. ఐఐటీ మద్రాస్, ఐబీఎం రీసెర్చ్ సంయుక్తంగా ఎన్‌పీటీఈఎల్ వేదికగా నిర్వహిస్తున్న 'అడ్వాన్స్‌డ్ క్వాంటమ్ స్కిల్లింగ్' కోర్సులో రాష్ట్రం నుంచి ఏకంగా 50 వేల మందికి పైగా విద్యార్థులు రిజిస్టర్ చేసుకోవడం విశేషంగా నిలిచింది. దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. యువతలో పెరుగుతున్న ఈ సాంకేతిక ఆసక్తిపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు.

కుంభమేళా తరహాలో మేడారం జాతర: సీఎం రేవంత్ రెడ్డి

కుంభమేళా తరహాలో మేడారం జాతర: సీఎం రేవంత్ రెడ్డి

ఆసియాలోనే అతిపెద్ద గిరిజన పండుగగా పేరుగాంచిన 'మేడారం సమ్మక్క–సారలమ్మ' జాతరను ఉత్తరాదిలో జరిగే కుంభమేళా తరహాలో అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. ములుగు జిల్లాలో జరిగిన ఒక సాంస్కృతిక కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, గిరిజన ఆరాధ్య దైవాలైన సమ్మక్క-సారలమ్మల పట్ల తన భక్తిని చాటుకున్నారు.

తగ్గుతున్న జనాభా.. ఆందోళనలో చైనా

తగ్గుతున్న జనాభా.. ఆందోళనలో చైనా

చైనా జాతీయ గణాంక బ్యూరో సోమవారం విడుదల చేసిన నివేదిక ప్రకారం.. చైనా జనాభా వరుసగా నాలుగో ఏడాది కూడా క్షీణించింది. 2025 నాటికి చైనా మొత్తం జనాభా 140.4 కోట్లుగా నమోదైంది. ఇది అంతకుముందు ఏడాదితో పోలిస్తే 30 లక్షలు తక్కువ.

ఏపీ లిక్కర్ స్కాం…వైసీపీ నేతలకు ఈడీ నోటీసులు

ఏపీ లిక్కర్ స్కాం…వైసీపీ నేతలకు ఈడీ నోటీసులు

రాష్ట్రంలో గత వైకాపా ప్రభుత్వ హయాంలో జరిగినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న రూ.3,500 కోట్ల భారీ మద్యం కుంభకోణం కేసు అత్యంత కీలక దశకు చేరుకుంది. రాష్ట్ర ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) దాఖలు చేసిన చార్జిషీట్ల ఆధారంగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) రంగంలోకి దిగింది. మనీలాండరింగ్ కోణంలో విచారణను ముమ్మరం చేసిన ఈడీ, ఈ కేసులో ప్రధాన పాత్రధారులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వైకాపా అగ్రనేతలు, ఎంపీలు విజయసాయిరెడ్డి, పీవీ మిధున్‌రెడ్డిలకు సమన్లు జారీ చేయడం రాజకీయ వర్గాల్లో తీవ్ర సంచలనం రేపింది.

కవిత కొత్త పార్టీపై కసరత్తు… ప్రశాంత్ కిషోర్‌‌‌తో చర్చలు

కవిత కొత్త పార్టీపై కసరత్తు… ప్రశాంత్ కిషోర్‌‌‌తో చర్చలు

తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె, మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెలంగాణలో కొత్త రాజకీయ పార్టీ ప్రారంభంపై అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్‌‌తో ఆమె చర్చలు జరిపినట్లు తెలంగాణ జాగృతి వర్గాలు సోమవారం వెల్లడించాయి.

బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబిన్

బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబిన్

26 ఏళ్లకే ఎమ్మెల్యే, 45 ఏళ్లకే భారతీయ జనతా పార్టీ (బీజేపీ) జాతీయ అధ్యక్షుడు—ఇది నితిన్ నబిన్ రాజకీయ ప్రస్థానంలోని అసాధారణ ఎదుగుదల. సోమవారం ఆయన బీజేపీ అతి పిన్న వయసు అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

పెట్టుబడులే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి దావోస్ పర్యటన

పెట్టుబడులే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి దావోస్ పర్యటన

తెలంగాణ రాష్ట్రాన్ని గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ డెస్టినేషన్‌గా తీర్చిదిద్దే లక్ష్యంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం ఉదయం స్విట్జర్లాండ్‌లోని దావోస్‌కు పయనమయ్యారు. అక్కడ జరగనున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ వార్షిక సదస్సులో పాల్గొనేందుకు ఆయన నేతృత్వంలో ఒక ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం శంషాబాద్ విమానాశ్రయం నుంచి దావాస్‌కు బయలుదేరింది.

పండిట్లను ఇక్కడికి రావడాన్ని ఎవరు అడ్డుకుంటున్నారు?: ఫరూఖ్ అబ్దుల్లా

పండిట్లను ఇక్కడికి రావడాన్ని ఎవరు అడ్డుకుంటున్నారు?: ఫరూఖ్ అబ్దుల్లా

కాశ్మీరీ పండితులు ‘ఎగ్జోడస్ డే’ (వలస దినం)ను పాటిస్తూ నిరసనలు చేపట్టిన నేపథ్యంలో, జమ్మూ–కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూఖ్ అబ్దుల్లా సోమవారం స్పందించారు. కాశ్మీరీ పండితులు లోయకు తిరిగి రావడాన్ని ఎవరూ అడ్డుకోవడం లేదని, వారి సమాజానికి చెందిన పలువురు ఇప్పటికీ కాశ్మీర్‌లో సౌకర్యంగా జీవిస్తున్నారని ఆయన వివరించారు.

కార్పొరేటర్లను హోటళ్లకు తరలించాల్సిన అవసరం ఏమొచ్చింది?: సంజయ్ రౌత్

కార్పొరేటర్లను హోటళ్లకు తరలించాల్సిన అవసరం ఏమొచ్చింది?: సంజయ్ రౌత్

ఇటీవల జరిగిన బృహన్‌ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) ఎన్నికల ఫలితాల అనంతరం, అధికార కూటమి భాగస్వామి అయిన శివసేన (ఏకనాథ్ శిండే వర్గం) తమ కార్పొరేటర్లను హోటళ్లకు తరలించడంపై శివసేన (యూబీటీ) ఎంపీ సంజయ్ రౌత్ తీవ్రంగా ప్రశ్నించారు.

న్యాయ సంస్కరణలపై ‘పిల్’ ను తోసిపుచ్చిన సుప్రీంకోర్టు

న్యాయ సంస్కరణలపై ‘పిల్’ ను తోసిపుచ్చిన సుప్రీంకోర్టు

న్యాయ వ్యవస్థలో విస్తృత సంస్కరణలు కోరుతూ దాఖలైన ఒక ప్రజాహిత వ్యాజ్యంపై (పీఐఎల్, పిల్) సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ దాన్ని సోమవారం తోసిపుచ్చింది. ఈ పిల్ ను కోర్టు ‘పబ్లిసిటీ ఇంటరెస్ట్ లిటిగేషన్’గా అభివర్ణించింది.

మేడారం జాతర: గిరిజన వారసత్వానికి ప్రతీక

మేడారం జాతర: గిరిజన వారసత్వానికి ప్రతీక

సమ్మక్క-సారలమ్మ మహా జాతర కేవలం ఒక ధార్మిక వేడుక మాత్రమే కాదు, తెలంగాణ గిరిజన సంస్కృతి, విశ్వాసం, ఐక్యతకు ప్రతీక. ఈ జాతరను సక్రమంగా నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన శాశ్వత గద్దెల నిర్మాణం, మౌలిక సదుపాయాల అభివృద్ధి, భక్తుల కోసం వసతి-ఆహారం-భద్రత వంటి ఏర్పాట్లు జాతరను కొత్త స్థాయికి తీసుకెళ్లాయి. సంప్రదాయాలను కాపాడుతూ ఆధునిక సౌకర్యాలను సమన్వయం చేసిన ఈ చర్యలు భక్తుల అనుభూతిని మరింత పవిత్రంగా మార్చాయి

రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైన ఉచిత పశు ఆరోగ్య శిబిరాలు

రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైన ఉచిత పశు ఆరోగ్య శిబిరాలు

రాష్ట్రవ్యాప్తంగా పశువుల ఆరోగ్యం, పశుపోషకుల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం చేపట్టిన ఉచిత పశు ఆరోగ్య శిబిరాలు విజయవాడ రూరల్ మండలం నిడమానూరు గ్రామంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. గన్నవరం శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ యార్లగడ్డ వెంకట్రావు, మంత్రి అచ్చెన్నాయుడు కలిసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి పశువులకు అందిస్తున్న వైద్య సేవలను పరిశీలించారు. ఈ సందర్భంగా యార్లగడ్డ వెంకట్రావు మాట్లాడుతూ నేటి నుంచి జనవరి 31 వరకు రాష్ట్రంలోని ప్రతి గ్రామంలోనూ ఈ శిబిరాలు కొనసాగుతాయని రైతులు తమ పశువుల ఆరోగ్య పరిరక్షణ కోసం ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.

ఏఐ హబ్‌గా ఏపీ… దావోస్‌లో చంద్రబాబు కీలక సమావేశాలు

ఏఐ హబ్‌గా ఏపీ… దావోస్‌లో చంద్రబాబు కీలక సమావేశాలు

ఆంధ్రప్రదేశ్‌ను అంతర్జాతీయ సాంకేతిక చిత్రపటంపై అగ్రగామిగా నిలబెట్టే లక్ష్యంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన స్విట్జర్లాండ్ పర్యటనను అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రారంభించారు. వరల్డ్ ఎకనమిక్ ఫోరం (డబ్ల్యూఈఎఫ్) 56వ వార్షిక సదస్సులో పాల్గొనేందుకు సోమవారం జ్యూరిచ్ చేరుకున్న ఆయన తొలిరోజే వరుస భేటీలతో బిజీగా గడిపారు. ఈ సందర్భంగా ఈరోస్ ఇన్నోవేషన్స్ సంస్థ చైర్మన్ కిషోర్ లుల్లా, కో-ప్రెసిడెంట్లు రిధిమా లుల్లా, స్వనీత్ సింగ్‌లతో భేటీ అయి రాష్ట్రంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఆధారిత ప్రాజెక్టుల అమలుపై కీలక చర్చలు జరిపారు.

రాష్ట్రంలో శాంతిభద్రతలు కుప్పకూలాయి: లేళ్ల అప్పిరెడ్డి

రాష్ట్రంలో శాంతిభద్రతలు కుప్పకూలాయి: లేళ్ల అప్పిరెడ్డి

పాల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గంలోని పిన్నెల్లి గ్రామంలో వైఎస్సార్‌సీపీ కార్యకర్త మండ సల్మాన్ దారుణ హత్యకు గురికావడంపై ఆ పార్టీ తీవ్రంగా స్పందించింది. ఈ ఘటనపై రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్‌ (డీజీపీ)ను కలిసి వినతిపత్రం సమర్పించేందుకు అపాయింట్‌మెంట్ ఇవ్వాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కోరింది. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని, దళితులపై దాడులు పెరిగిపోతున్నాయని పార్టీ నేతలు ఆందోళన వ్యక్తం చేశారు.

పండగ పూట ప్రజలకు నిరుత్సాహమే: బొత్స సత్యనారాయణ

పండగ పూట ప్రజలకు నిరుత్సాహమే: బొత్స సత్యనారాయణ

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాల వల్ల రైతులు, విద్యార్థులు, ఉద్యోగులు సహా అన్ని వర్గాల ప్రజల్లో సంక్రాంతి సందడి లేకుండా పోయిందని శాసనమండలి విపక్ష నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. పండగ పూట ప్రజలకు నిరుత్సాహమే మిగిలిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. విశాఖలోని తన క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు.

మున్సిపల్ ఎన్నికలను త్వరగా నిర్వహించాలన్న కేబినెట్

మున్సిపల్ ఎన్నికలను త్వరగా నిర్వహించాలన్న కేబినెట్

తెలంగాణ చరిత్రలో తొలిసారిగా హైదరాబాద్ వెలుపల, ములుగు జిల్లా మేడారం సమ్మక్క–సారలమ్మ సన్నిధిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర మంత్రిమండలి సమావేశం జరిగింది. ఈ చారిత్రక సమావేశంలో మున్సిపల్ ఎన్నికలు, సాగునీటి ప్రాజెక్టులు, హైదరాబాద్ మెట్రో విస్తరణపై ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది.

గిరిజన గుండెల్లో వెలుగుతున్న ప్రజా పాలన: మంత్రి సీత‌క్క‌

గిరిజన గుండెల్లో వెలుగుతున్న ప్రజా పాలన: మంత్రి సీత‌క్క‌

ప్రజల ప్రభుత్వం సాధించిన అరుదైన ఘనత ఇది. ఆదివాసీ గుండెల్లో ప్రజాపాలన వెలుగులు చిందిస్తూ, ఆదివాసీ గర్వానికి ప్రతీకగా జెండా ఎగురుతోందని మంత్రి సీతక్క త‌న ఎక్స్ వేదిక ద్వారా పేర్కొన్నారు. చరిత్రలో మరో మైలురాయిగా నిలిచే ఈ ఘట్టం, ఎన్నడూ చూడని సంబరాలకు నాంది పలుకుతోంది అని తెలిపారు.

ఎన్‌ఎఫ్‌సీ రైల్వే ఓవర్ బ్రిడ్జి వెడల్పు పెంపునకు ఎంపీకి వినతిపత్రం ఇచ్చిన‌ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి

ఎన్‌ఎఫ్‌సీ రైల్వే ఓవర్ బ్రిడ్జి వెడల్పు పెంపునకు ఎంపీకి వినతిపత్రం ఇచ్చిన‌ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి

ఉప్పల్ నియోజకవర్గ పరిధిలోని ఎన్‌ఎఫ్‌సీ, రైల్వే ఓవర్ బ్రిడ్జి వెడల్పు పెంపు అవసరాన్ని దృష్టిలో ఉంచుకుని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, స్థానిక కార్పొరేటర్ దేవేందర్ రెడ్డితో కలిసి మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్ ని శామీర్‌పేటలోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వంతెన విస్తరణకు అనుమతి ఇవ్వాలని కోరుతూ వినతి పత్రాన్ని అందజేశారు.

చెన్నూరులో 'ఏటీసీ' భవనానికి భూమిపూజ చేసిన మంత్రులు జూపల్లి, వివేక్

చెన్నూరులో 'ఏటీసీ' భవనానికి భూమిపూజ చేసిన మంత్రులు జూపల్లి, వివేక్

చెన్నూరు పట్టణ కేంద్రంలో రూ.47.11 లక్షల వ్యయంతో నిర్మించనున్న అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్ (ఏటీసీ) భవన నిర్మాణానికి మంత్రి జూపల్లి కృష్ణారావు సహచర మంత్రి వివేక్ వెంకటస్వామితో కలిసి భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా మంత్రి జూపల్లి మాట్లాడుతూ, యువతకు చదువుతో పాటు తక్షణ ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్లను ఏర్పాటు చేస్తోందని తెలిపారు.

సింగరేణి వివాదం.. కాంగ్రెస్ అంతర్గత విభేదాలే కారణం: బీజేపీ నేత ప్రకాష్ రెడ్డి

సింగరేణి వివాదం.. కాంగ్రెస్ అంతర్గత విభేదాలే కారణం: బీజేపీ నేత ప్రకాష్ రెడ్డి

సింగరేణి కాలరీస్ టెండర్లలో అవకతవకలు జరిగాయంటూ మీడియాలో వచ్చిన కథనాలపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు బీజేపీ నేత ప్రకాష్ రెడ్డి స్పందించారు. ఈ సందర్భంగా ఆయన తీవ్రంగా స్పందిస్తూ, మహిళా ఐఏఎస్ అధికారిని వ్యక్తిగతంగా లక్ష్యంగా చేసుకుని ఆరోపణలు చేయడాన్ని ఖండించారు. ఇలాంటి ఆరోపణలను ఎవరూ సమర్థించరని ఆయన పేర్కొన్నారు.

నాగర్ కర్నూల్‌‌లో రూ. 39 కోట్ల అభివృద్ధి పనులకు మంత్రి దామోదర్ శంకుస్థాపన

నాగర్ కర్నూల్‌‌లో రూ. 39 కోట్ల అభివృద్ధి పనులకు మంత్రి దామోదర్ శంకుస్థాపన

రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ నాగర్ కర్నూల్ జిల్లా పర్యటనలో పలు కీలక అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. జిల్లా ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ, మౌలిక సదుపాయాల అభివృద్ధి పనులకు ఈ పర్యటన మరింత ఊపునిచ్చింది.

గ్వాటెమాలా జైళ్లలో అల్లర్లు.. 30 రోజుల అత్యవసర పరిస్థితి ప్రకటించిన అధ్యక్షుడు

గ్వాటెమాలా జైళ్లలో అల్లర్లు.. 30 రోజుల అత్యవసర పరిస్థితి ప్రకటించిన అధ్యక్షుడు

గ్వాటెమాలాలో జైళ్లలో చెలరేగిన తీవ్ర అల్లర్లు, గ్యాంగ్ హింస నేపథ్యంలో దేశవ్యాప్తంగా 30 రోజులపాటు అత్యవసర పరిస్థితిని అధ్యక్షుడు బెర్నార్డో అరేవాలో ప్రకటించారు. జైళ్లలో ఖైదీలు చేపట్టిన తిరుగుబాటు, ఆ తర్వాత జరిగిన ప్రతీకార దాడులు దేశాన్ని భయాందోళనకు గురి చేయడంతో ప్రభుత్వం ఈ కఠిన నిర్ణయం తీసుకుంది.

కరాచీలోని 'గుల్ ప్లాజా' మాల్‌లో అగ్నిప్రమాదం.. 26కు చేరిన మృతుల సంఖ్య

కరాచీలోని 'గుల్ ప్లాజా' మాల్‌లో అగ్నిప్రమాదం.. 26కు చేరిన మృతుల సంఖ్య

కరాచీలోని గుల్ ప్లాజా షాపింగ్ మాల్‌లో సంభవించిన భారీ అగ్నిప్రమాదంలో 26 మంది మరణించారు. షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు ఐదంతస్తులకు వ్యాపించాయి. శిథిలాల కింద మరిన్ని మృతదేహాలు ఉండే అవకాశం ఉండటంతో మృతుల సంఖ్య 50 దాటవచ్చని అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

నోబెల్ అసంతృప్తి నుంచి గ్రీన్‌ల్యాండ్ డిమాండ్ వరకు.. ట్రంప్ లేఖతో యూరప్‌లో కలకలం

నోబెల్ అసంతృప్తి నుంచి గ్రీన్‌ల్యాండ్ డిమాండ్ వరకు.. ట్రంప్ లేఖతో యూరప్‌లో కలకలం

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నార్వే ప్రధానికి రాసిన ఒక లేఖ అంతర్జాతీయ స్థాయిలో తీవ్ర దుమారం రేపుతోంది. సాధారణంగా దేశాధినేతల మధ్య జరిగే ఉత్తర ప్రత్యుత్తరాలు అత్యంత రహస్యంగా ఉంటాయి, కానీ పీబీఎస్ న్యూస్‌హౌర్ ప్రతినిధి నిక్ షిఫ్రిన్ ఈ లేఖను బహిర్గతం చేయడంతో అగ్రరాజ్య వ్యూహాలు బయటపడ్డాయి.

భారత్-యూఏఈ మధ్య వ్యూహాత్మక రక్షణ ఒప్పందం

భారత్-యూఏఈ మధ్య వ్యూహాత్మక రక్షణ ఒప్పందం

భారత్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) మధ్య బంధం మరింత బలోపేతమైంది. సోమవారం దేశ రాజధానిలో ప్రధాని నరేంద్ర మోడీ, యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ మధ్య జరిగిన చర్చలు ఇరు దేశాల రక్షణ, ఇంధన, ఆర్థిక రంగాల్లో సరికొత్త దిశానిర్దేశం చేశాయి

డిజిటల్ క్రెడిట్‌తో ‘ఎంఎస్ఎంఈ’లకు భారీ ఊతం

డిజిటల్ క్రెడిట్‌తో ‘ఎంఎస్ఎంఈ’లకు భారీ ఊతం

దేశ ఆర్థిక వ్యవస్థకు ఊపిరిపోస్తున్న సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు (ఎంఎస్ఎంఈ) బ్యాంకులు భారీ ఊరటనిస్తున్నాయి. 2025లో ప్రారంభమైన కొత్త డిజిటల్ క్రెడిట్ అసెస్‌మెంట్ మోడల్ (సీఏఎం) అద్భుత ఫలితాలను ఇస్తోంది. కేవలం తొమ్మిది నెలల వ్యవధిలోనే (ఏప్రిల్ 1 నుండి డిసెంబర్ 31 వరకు) ప్రభుత్వ రంగ బ్యాంకులు 3.96 లక్షల దరఖాస్తులను ఆమోదించి, రూ.52,300 కోట్లకు పైగా రుణాలను మంజూరు చేశాయి.

2030 నాటికి ఎగువ మధ్యతరగతి దేశంగా భారత్

2030 నాటికి ఎగువ మధ్యతరగతి దేశంగా భారత్

భారత ఆర్థిక వ్యవస్థ అద్భుతమైన వేగంతో పురోగమిస్తోంది. మరో నాలుగేళ్లలో, అంటే 2030 నాటికి భారత్ 'ఎగువ మధ్యతరగతి ఆదాయ' దేశంగా అవతరించనుందని ఎస్‌బీఐ రీసెర్చ్ సోమవారం తన నివేదికలో వెల్లడించింది.

2025-26లో భారత వృద్ధి రేటు 7.3 శాతం.. అంచనాలను పెంచిన ఐఎంఎఫ్

2025-26లో భారత వృద్ధి రేటు 7.3 శాతం.. అంచనాలను పెంచిన ఐఎంఎఫ్

భారత ఆర్థిక వ్యవస్థ దూసుకుపోతోంది. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు ఆర్థిక ఒడిదుడుకులను ఎదుర్కొంటున్నప్పటికీ, భారత్ మాత్రం పటిష్టమైన వృద్ధిని నమోదు చేస్తోంది. తాజాగా అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) సంస్థ భారతదేశ ఆర్థిక వృద్ధి అంచనాలను సవరించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2025-26)లో భారత్ 7.3 శాతం వృద్ధి రేటును సాధిస్తుందని ఐఎంఎఫ్ సోమవారం వెల్లడించింది.

సిరియాలో ముగిసిన అంతర్యుద్ధం.. ప్రభుత్వంతో కుర్దిష్ దళాలు రాజీ

సిరియాలో ముగిసిన అంతర్యుద్ధం.. ప్రభుత్వంతో కుర్దిష్ దళాలు రాజీ

సిరియా దేశంలో గత పదేళ్లకు పైగా సాగుతున్న విభజన రాజకీయాలకు తెరపడింది. ఈశాన్య సిరియాను తమ గుప్పిట్లో ఉంచుకున్న కుర్దిష్ దళాలు (ఎస్‌డీఎఫ్), ఇప్పుడు ప్రభుత్వంతో రాజీ పడ్డాయి. దేశాధ్యక్షుడు అహ్మద్ అల్-షారా ప్రకటించిన ఈ కాల్పుల విరమణ ఒప్పందంతో, సిరియా మళ్లీ ఒకే తాటిపైకి వచ్చింది.

కర్ణాటక సీనియర్ పోలీసు అధికారి వీడియో వైరల్

కర్ణాటక సీనియర్ పోలీసు అధికారి వీడియో వైరల్

కర్ణాటక డీజీపీ (సివిల్ రైట్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్) కే. రామచంద్రరావు మహిళలతో అనుచిత స్థితిలో ఉన్నట్లు చూపిస్తున్న వీడియో సోషల్ మీడియాలో సోమవారం వైరల్ అయింది. ఈ వీడియోలు పూర్తిగా తప్పుడు, కల్పితమైనవని రామచంద్రరావు స్పష్టం చేశారు. ఈ వివాదంపై స్పందించిన ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఆరోపణలు నిజమని తేలితే తప్పకుండా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

జపాన్‌ దిగువ సభ రద్దు.. మధ్యంతర ఎన్నికలకు ప్రధాని తకైచి పిలుపు

జపాన్‌ దిగువ సభ రద్దు.. మధ్యంతర ఎన్నికలకు ప్రధాని తకైచి పిలుపు

జపాన్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆ దేశ తొలి మహిళా ప్రధానమంత్రి సనాయే తకైచి కీలక నిర్ణయం తీసుకున్నారు. పార్లమెంటు దిగువ సభ (హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్)ను రద్దు చేస్తున్నట్లు సోమవారం ఆమె అధికారికంగా ప్రకటించారు.

‘లాజికల్ డిస్క్రెపెన్సీలు’కేటగిరీలోని ఓటర్ల పేర్లు బహిరంగంగా ప్రదర్శించాలి: సుప్రీంకోర్టు

‘లాజికల్ డిస్క్రెపెన్సీలు’కేటగిరీలోని ఓటర్ల పేర్లు బహిరంగంగా ప్రదర్శించాలి: సుప్రీంకోర్టు

పశ్చిమ బెంగాల్‌లో కొనసాగుతున్న ఓటర్ల జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) ప్రక్రియలో ‘లాజికల్ డిస్క్రెపెన్సీలు’ కేటగిరీలోకి వచ్చిన ఓటర్ల పేర్లను బహిరంగంగా ప్రదర్శించాలని భారత ఎన్నికల కమిషన్ (ఈసీఐ)‌కు సుప్రీంకోర్టు సోమవారం కీలక ఆదేశాలు జారీ చేసింది.

అధికారాన్ని కేంద్రీకరించేందుకు బీజేపీ ప్రయత్నం: రాహుల్ గాంధీ

అధికారాన్ని కేంద్రీకరించేందుకు బీజేపీ ప్రయత్నం: రాహుల్ గాంధీ

ఆర్‌ఎస్‌ఎస్‌, బీజేపీలు అధికారాన్ని కేంద్రీకరించేందుకు ప్రయత్నిస్తున్నాయని, అయితే కాంగ్రెస్ పార్టీ వికేంద్రీకరణకు, పునాది స్థాయి ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి కట్టుబడి ఉందని సీనియర్ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సోమవారం అన్నారు.

రాజస్థాన్‌లో ఓటర్ల తొలగింపునకు బీజేపీ కుట్ర

రాజస్థాన్‌లో ఓటర్ల తొలగింపునకు బీజేపీ కుట్ర

రాజస్థాన్‌లో ప్రతిపక్షాలకు మద్దతిచ్చే ఓటర్ల పేర్లను ఓటర్ల జాబితా నుంచి మోసపూరితంగా తొలగించేందుకు బీజేపీ కుట్ర చేస్తోందని కాంగ్రెస్ సోమవారం ఆరోపించింది. రాష్ట్రంలో ప్రజాస్వామ్య హత్యను తాము అనుమతించబోమని స్పష్టం చేసింది.

ఇండోర్‌లో భిక్షాటన చేస్తూ..కోట్ల ఆస్తులకు అధిపతి

ఇండోర్‌లో భిక్షాటన చేస్తూ..కోట్ల ఆస్తులకు అధిపతి

మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో భిక్షాటన నిర్మూలన కార్యక్రమం సందర్భంగా అధికారులు ఆశ్చర్యానికి గురయ్యారు. కుష్టు వ్యాధితో బాధపడుతున్న ఓ వ్యక్తి భిక్షాటన చేస్తూ, లక్షల రూపాయల విలువైన ఆస్తులను కూడబెట్టాడు. చక్రాలున్న బోర్డుపై తిరుగుతూ భిక్ష అడిగే ఈ వ్యక్తి వద్ద మూడు ఇళ్లు, ఒక కారు, మూడు ఆటోరిక్షాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు.

రెండోసారి సీబీఐ విచారణకు టీవీకే చీఫ్ విజయ్

రెండోసారి సీబీఐ విచారణకు టీవీకే చీఫ్ విజయ్

తమిళనాడు కరూర్‌లో జరిగిన తొక్కిసలాట కేసులో టీవీకే (టీవీకే) పార్టీ చీఫ్‌, నటుడు విజయ్‌ను సీబీఐ సోమవారం రెండోసారి విచారించింది. న్యూఢిల్లీలోని లోధీ రోడ్‌లో ఉన్న సీబీఐ ప్రధాన కార్యాలయంలో ఆయనను సుమారు ఆరు గంటల పాటు ప్రశ్నించినట్లు అధికారులు తెలిపారు.

పోలాండ్ ఉప ప్రధానితో జైశంకర్ కీలక చర్చలు

పోలాండ్ ఉప ప్రధానితో జైశంకర్ కీలక చర్చలు

ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న అనిశ్చితి పరిస్థితుల మధ్య భారత్, పోలాండ్ దేశాలు తమ ద్వైపాక్షిక సంబంధాలను కొత్త పుంతలు తొక్కించే దిశగా అడుగులు వేస్తున్నాయి. భారత విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్. జైశంకర్ సోమవారం న్యూఢిల్లీలో పోలాండ్ ఉప ప్రధాని, విదేశాంగ మంత్రి రాడోస్లావ్ సికోర్స్కీతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆర్థిక, సాంకేతిక, రక్షణ, మైనింగ్ రంగాల్లో సహకారాన్ని మరింత పటిష్టం చేసుకోవాలని ఇరు దేశాలు నిర్ణయించాయి.

కీరవాణి రాగంలో.. రిపబ్లిక్ డే వేడుకలు

కీరవాణి రాగంలో.. రిపబ్లిక్ డే వేడుకలు

ఈ ఏడాది రిపబ్లిక్ వేడుకల్లో కీరవాణి స్వరాలు వినిపించనున్నాయి. అలాగే భారతదేశంలోని వివిధ నృత్య రూపాలను ప్రతిబింబించేలా సుమారు 2,500 మంది కళాకారులు ఈ ఏడాది 77వ గణతంత్ర దినోత్సవ పరేడ్ సందర్భంగా ఢిల్లీలోని కర్తవ్య పథ్ పై భారీ సాంస్కృతిక ప్రదర్శన ఇవ్వనున్నారు.

తీర ప్రాంతాల్లోనూ ‘వైబ్రెంట్‌ విలేజ్‌’ పథకం

తీర ప్రాంతాల్లోనూ ‘వైబ్రెంట్‌ విలేజ్‌’ పథకం

దేశ సరిహద్దు గ్రామాల్లో అమలవుతున్న 'వైబ్రెంట్‌ విలేజెస్ ప్రోగ్రాం’ (వీవీపీ) తరహాలోనే, త్వరలో 'కోస్టల్ వైబ్రెంట్‌ విలేజెస్' పథకాన్ని ప్రారంభించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. భారత్‌కున్న సుమారు 6,500 కిలోమీటర్ల పొడవైన సముద్ర తీర ప్రాంతాల్లో నివసించే ప్రజలతో మమేకమవ్వడం, తీర రక్షణలో వారిని భాగస్వామ్యం చేయడం ఈ పథకం ప్రధాన ఉద్దేశమని సీఐఎస్‌ఎఫ్ డైరెక్టర్ జనరల్ (డీజీ) ప్రవీణ్ రంజన్ సోమవారం వెల్లడించారు.

సైబర్ నేర బాధితులకు భరోసా ఇస్తున్న ‘సీ-మిత్ర’

సైబర్ నేర బాధితులకు భరోసా ఇస్తున్న ‘సీ-మిత్ర’

సైబర్ నేర బాధితులకు వేగవంతమైన న్యాయం అందించాలనే లక్ష్యంతో హైదరాబాద్ పోలీసులు ప్రారంభించిన వినూత్న కార్యక్రమం ‘సీ-మిత్ర’ ఆశించినదానికంటే మెరుగైన ఫలితాలను ఇస్తోంది. దేశంలోనే తొలిసారిగా హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో అమలు చేసిన ఈ విధానం, ప్రారంభమైన కేవలం 10 రోజుల్లోనే వందలాది మంది సైబర్ బాధితులకు ఊరట కలిగించింది.

సిరిసిల్ల మెగా క్లస్టర్‌పై కేంద్రం వివక్ష: కేంద్ర‌మంత్రి గిరిరాజ్ సింగ్‌కు కేటీఆర్ లేఖ

సిరిసిల్ల మెగా క్లస్టర్‌పై కేంద్రం వివక్ష: కేంద్ర‌మంత్రి గిరిరాజ్ సింగ్‌కు కేటీఆర్ లేఖ

సిరిసిల్ల మెగా పవర్ లూమ్ క్లస్టర్ మంజూరు విషయంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా జాప్యం చేస్తూ తెలంగాణపై వివక్ష చూపుతోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ తీవ్రంగా విమర్శించారు. ఈ మేరకు కేంద్ర టెక్స్‌టైల్స్ శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్‌కు ఆయన లేఖ రాశారు. తెలంగాణ నేతన్నలపై కేంద్రం రాజకీయ కక్షతో వ్యవహరిస్తోందని ఆరోపించారు.

హైదరాబాద్‌లో అక్రమ వలసదారులపై న్యాయవాదుల ఆందోళన: హైకోర్టును ఆశ్రయించేందుకు సిద్ధం

హైదరాబాద్‌లో అక్రమ వలసదారులపై న్యాయవాదుల ఆందోళన: హైకోర్టును ఆశ్రయించేందుకు సిద్ధం

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో అక్రమంగా నివసిస్తున్న బంగ్లాదేశ్, రోహింగ్యా వలసదారులపై న్యాయవాదులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హైకోర్టు న్యాయవాది కె. కరుణా సాగర్ నేతృత్వంలో పలువురు న్యాయవాదులు ఈ అంశాన్ని వెలుగులోకి తీసుకువచ్చి, ప్రభుత్వ నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా తెలంగాణ హైకోర్టును ఆశ్రయించేందుకు సిద్ధమవుతున్నారు.

‘ఆకాశంలో ఒక తార’ హీరోయిన్‌ను పరిచయం చేసిన టీమ్‌

‘ఆకాశంలో ఒక తార’ హీరోయిన్‌ను పరిచయం చేసిన టీమ్‌

దుల్కర్ సల్మాన్ కథానాయకుడిగా పవన్ సాధినేని దర్శకత్వంలో రూపొందుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘ఆకాశంలో ఒక తార’ ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతుండగా, తాజాగా చిత్ర బృందం హీరోయిన్ ఎవరనే సస్పెన్స్‌కు తెరదించింది. ఆకాశాన్ని మించిన కలతో ముందుకు సాగుతున్న ఓ యువతీ కథ ఇప్పుడు అందరి మనసులను తాకుతోంది.

ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘కాన్ సిటీ’ టైటిల్ & ఫస్ట్ లుక్ పోస్టర్ విడుద‌ల‌

ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘కాన్ సిటీ’ టైటిల్ & ఫస్ట్ లుక్ పోస్టర్ విడుద‌ల‌

ప్రముఖ దర్శకుడు లోకేష్ కనగరాజ్ తాజాగా తమిళ–తెలుగు ద్విభాషా చిత్రం “కాన్ సిటీ” ఫస్ట్ లుక్‌ను విడుదల చేసి చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలిపారు. పవర్ హౌస్ పిక్చర్స్ నిర్మాణంలో, దర్శకుడిగా అరంగేట్రం చేస్తున్న హరీష్ దురైరాజ్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా మొదటి చూపుతోనే ప్రేక్షకుల్లో ఆసక్తిని రేపుతోంది. ఫస్ట్ లుక్ పోస్టర్‌లోని గాఢమైన భావోద్వేగాలు, కథా నేపథ్యం సినిమాపై అంచనాలను పెంచాయి.

ఇండోనేషియా టోర్నీ పై పీవీ సింధు దృష్టి

ఇండోనేషియా టోర్నీ పై పీవీ సింధు దృష్టి

భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు ఇండోనేషియా మాస్టర్స్ 2026 టోర్నీలో బలంగా రీటర్న్ ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. మంగళవారం నుంచి ప్రారంభం కానున్న ఈ టోర్నీలో భారత జట్టుకు ఆమె నాయకత్వం వహించనున్నారు.

దశాబ్దానికి పైగా అత్యుత్తమ ఆటగాడు కోహ్లీయే: ఇర్ఫాన్ పఠాన్

దశాబ్దానికి పైగా అత్యుత్తమ ఆటగాడు కోహ్లీయే: ఇర్ఫాన్ పఠాన్

స్టార్ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లీపై భారత మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ ప్రశంసలు కురిపించారు. న్యూజిలాండ్‌తో జరిగిన మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఇండోర్‌లోని హోల్కర్ స్టేడియంలో ఆదివారం జరిగిన మూడో, తుది వన్డేలో విరాట్ కోహ్లీ తన 54వ వన్డే సెంచరీ సాధించిన తర్వాత, ఆయనను భారత్‌కు గత దశాబ్దానికి పైగా అత్యుత్తమ వన్డే బ్యాటర్ గా అభివర్ణించారు.

సంపాదకీయం మరియు ప్రత్యేక కథనం

మేడారం జాతర: గిరిజన వారసత్వానికి ప్రతీక

మేడారం జాతర: గిరిజన వారసత్వానికి ప్రతీక

సమ్మక్క-సారలమ్మ మహా జాతర కేవలం ఒక ధార్మిక వేడుక మాత్రమే కాదు, తెలంగాణ గిరిజన సంస్కృతి, విశ్వాసం, ఐక్యతకు ప్రతీక. ఈ జాతరను సక్రమంగా నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన శాశ్వత గద్దెల నిర్మాణం, మౌలిక సదుపాయాల అభివృద్ధి, భక్తుల కోసం వసతి-ఆహారం-భద్రత వంటి ఏర్పాట్లు జాతరను కొత్త స్థాయికి తీసుకెళ్లాయి. సంప్రదాయాలను కాపాడుతూ ఆధునిక సౌకర్యాలను సమన్వయం చేసిన ఈ చర్యలు భక్తుల అనుభూతిని మరింత పవిత్రంగా మార్చాయి

క్రీడలు

ఇండోనేషియా టోర్నీ పై పీవీ సింధు దృష్టి

ఇండోనేషియా టోర్నీ పై పీవీ సింధు దృష్టి

భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు ఇండోనేషియా మాస్టర్స్ 2026 టోర్నీలో బలంగా రీటర్న్ ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. మంగళవారం నుంచి ప్రారంభం కానున్న ఈ టోర్నీలో భారత జట్టుకు ఆమె నాయకత్వం వహించనున్నారు.

దశాబ్దానికి పైగా అత్యుత్తమ ఆటగాడు కోహ్లీయే: ఇర్ఫాన్ పఠాన్

దశాబ్దానికి పైగా అత్యుత్తమ ఆటగాడు కోహ్లీయే: ఇర్ఫాన్ పఠాన్

స్టార్ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లీపై భారత మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ ప్రశంసలు కురిపించారు. న్యూజిలాండ్‌తో జరిగిన మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఇండోర్‌లోని హోల్కర్ స్టేడియంలో ఆదివారం జరిగిన మూడో, తుది వన్డేలో విరాట్ కోహ్లీ తన 54వ వన్డే సెంచరీ సాధించిన తర్వాత, ఆయనను భారత్‌కు గత దశాబ్దానికి పైగా అత్యుత్తమ వన్డే బ్యాటర్ గా అభివర్ణించారు.

సినిమాలు

‘ఆకాశంలో ఒక తార’ హీరోయిన్‌ను పరిచయం చేసిన టీమ్‌

‘ఆకాశంలో ఒక తార’ హీరోయిన్‌ను పరిచయం చేసిన టీమ్‌

దుల్కర్ సల్మాన్ కథానాయకుడిగా పవన్ సాధినేని దర్శకత్వంలో రూపొందుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘ఆకాశంలో ఒక తార’ ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతుండగా, తాజాగా చిత్ర బృందం హీరోయిన్ ఎవరనే సస్పెన్స్‌కు తెరదించింది. ఆకాశాన్ని మించిన కలతో ముందుకు సాగుతున్న ఓ యువతీ కథ ఇప్పుడు అందరి మనసులను తాకుతోంది.

ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘కాన్ సిటీ’ టైటిల్ & ఫస్ట్ లుక్ పోస్టర్ విడుద‌ల‌

ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘కాన్ సిటీ’ టైటిల్ & ఫస్ట్ లుక్ పోస్టర్ విడుద‌ల‌

ప్రముఖ దర్శకుడు లోకేష్ కనగరాజ్ తాజాగా తమిళ–తెలుగు ద్విభాషా చిత్రం “కాన్ సిటీ” ఫస్ట్ లుక్‌ను విడుదల చేసి చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలిపారు. పవర్ హౌస్ పిక్చర్స్ నిర్మాణంలో, దర్శకుడిగా అరంగేట్రం చేస్తున్న హరీష్ దురైరాజ్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా మొదటి చూపుతోనే ప్రేక్షకుల్లో ఆసక్తిని రేపుతోంది. ఫస్ట్ లుక్ పోస్టర్‌లోని గాఢమైన భావోద్వేగాలు, కథా నేపథ్యం సినిమాపై అంచనాలను పెంచాయి.

తొలి పలుకు - తెలుగు వార్తలు & కథలు