మక్తల్, నారాయణపేట, కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ తో లక్ష ఎకరాలకు సాగునీరు: సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మక్తల్-నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల పథకం పనులను పరిశీలించి, లక్ష ఎకరాలకు సాగునీరు అందించేలా ఈ ప్రాజెక్టును త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. జూన్ 4, 5 తేదీల్లో మహబూబ్నగర్, నారాయణపేట జిల్లాల్లో పర్యటించనున్న సీఎం, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుతో పాటు కరివేన, ఉద్దండపూర్ రిజర్వాయర్ పనులను సమీక్షించి, ఉద్దండపూర్ బహిరంగ సభలో ప్రసంగించనున్నారు.
