క్వాంటం శిక్షణలో ఏపీ యువత అద్భుత స్పందన
ఎమర్జింగ్ టెక్నాలజీ రంగంలో ఆంధ్రప్రదేశ్ యువత మరో చారిత్రాత్మక మైలురాయిని అధిగమించింది. ఐఐటీ మద్రాస్, ఐబీఎం రీసెర్చ్ సంయుక్తంగా ఎన్పీటీఈఎల్ వేదికగా నిర్వహిస్తున్న 'అడ్వాన్స్డ్ క్వాంటమ్ స్కిల్లింగ్' కోర్సులో రాష్ట్రం నుంచి ఏకంగా 50 వేల మందికి పైగా విద్యార్థులు రిజిస్టర్ చేసుకోవడం విశేషంగా నిలిచింది. దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. యువతలో పెరుగుతున్న ఈ సాంకేతిక ఆసక్తిపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు.
