Let's talk: editor@tmv.in
ఏపీలో క్షీణించిన శాంతిభద్రతలపై లోక్‌సభలో వైఎస్సార్‌సీపీ ఎంపీ గురుమూర్తి వాయిదా తీర్మానం

ఏపీలో క్షీణించిన శాంతిభద్రతలపై లోక్‌సభలో వైఎస్సార్‌సీపీ ఎంపీ గురుమూర్తి వాయిదా తీర్మానం

జరిగిన ఘటనలపై సమగ్ర నివేదికను రాష్ట్ర ప్రభుత్వం నుంచి కోరాలని, అన్ని కేసులపై నిష్పాక్షికంగా, నిర్దిష్ట గడువులో విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, పౌరుల రాజ్యాంగ హక్కులకు రక్షణ కల్పించాలని కేంద్రాన్ని ఎంపీ కోరారు.

క్యూర్ పరిధిలో ఇందిరమ్మ ఇళ్లకు నేటి నుంచి దరఖాస్తుల స్వీకరణ: మంత్రి పొంగులేటి

క్యూర్ పరిధిలో ఇందిరమ్మ ఇళ్లకు నేటి నుంచి దరఖాస్తుల స్వీకరణ: మంత్రి పొంగులేటి

జూలై 21 నుంచి ఆగస్టు 10 వరకు మీ సేవ, వాట్సాప్, వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తారు. ఒక్కో ఇంటికి రూ.5 లక్షల ప్రభుత్వ సబ్సిడీ, మహిళ పేరిట స్థలం ఉచిత రిజిస్ట్రేషన్, మిగిలిన మొత్తాన్ని నాలుగు విడతల్లో చెల్లించే అవకాశం కల్పించారు.

ఆక్వా, పొగాకు రైతులను ఆదుకోండి: కేంద్ర మంత్రులకు సీఎం చంద్రబాబు లేఖలు

ఆక్వా, పొగాకు రైతులను ఆదుకోండి: కేంద్ర మంత్రులకు సీఎం చంద్రబాబు లేఖలు

ఆక్వా రంగంలో ఏరేటర్లపై జీఎస్‌టీనీ 5 శాతానికి, తయారు చేయని పొగాకుపై జీఎస్‌టీనీ 28 శాతానికి తగ్గించాలని విజ్ఞప్తి చేశారు. జీఎం సోయాబీన్ మీల్ దిగుమతులు, ఎన్‌ఎఫ్‌డీబీ ప్రాంతీయ కార్యాలయం, ఎగుమతులకు ప్రోత్సాహకాలు కల్పించాలని కేంద్రాన్ని కోరారు.

లైంగిక వేధింపుల ఆరోపణలు.. ట్రైనీ ఐపీఎస్ అధికారి ఆత్మహత్యాయత్నం!

లైంగిక వేధింపుల ఆరోపణలు.. ట్రైనీ ఐపీఎస్ అధికారి ఆత్మహత్యాయత్నం!

ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అధికారికి స్టమక్ వాష్ చేసినప్పటికీ అసాధారణ పదార్థాలు గుర్తించలేదని వైద్యులు తెలిపారు. పరీక్షల నివేదికలు వచ్చిన తర్వాతే పూర్తి వివరాలు వెల్లడవుతాయని చెప్పారు. ఇదిలా ఉండగా, నమోదైన కేసులో విచారణ కోసం పోలీసులు నోటీసులు జారీ చేయనున్నారు.

ఏపీలో త్వరలో 'తల్లి-బిడ్డ ఎక్స్‌ప్రెస్' వాహనాలు

ఏపీలో త్వరలో 'తల్లి-బిడ్డ ఎక్స్‌ప్రెస్' వాహనాలు

ప్రసవం అనంతరం బాలింతలు, నవజాత శిశువులు, ఒక సహాయకుడికి ప్రభుత్వ ఆసుపత్రి నుంచి ఇంటి వరకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించనున్నారు. అధిక ప్రమాద గర్భిణులు, తీవ్ర రక్తహీనత ఉన్న మహిళలను వైద్య పరీక్షల కోసం కూడా ఈ వాహనాల ద్వారా తరలించనున్నారు.

రాష్ట్రంలో మహిళలకు రక్షణ కరువైంది: మాజీ మంత్రి రజిని

రాష్ట్రంలో మహిళలకు రక్షణ కరువైంది: మాజీ మంత్రి రజిని

పోలీసులకు రెండుసార్లు ఫిర్యాదు చేసినా స్పందించలేదని, సీసీటీవీ దృశ్యాలు బయటకు వచ్చిన తర్వాతే చర్యలు ప్రారంభించారని వైఎస్సార్‌సీపీ నేతలు ఆరోపించారు. బాధిత కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని ప్రకటిస్తూ, 21న రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చారు.

ప్రధాని మోడీ పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన మంత్రులు

ప్రధాని మోడీ పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన మంత్రులు

ప్రధాని పర్యటన సందర్భంగా భద్రత, ట్రాఫిక్, పార్కింగ్, హెలిప్యాడ్, ప్రజా వేదిక తదితర ఏర్పాట్లను మంత్రులు క్షుణ్నంగా సమీక్షించారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి ప్రారంభోత్సవాన్ని విజయవంతం చేయాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

దెందులూరు రైతులకు సాగునీరు అందించాలి: మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి

దెందులూరు రైతులకు సాగునీరు అందించాలి: మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి

రైతులు ఇప్పటికే దున్నకం, విత్తనాలు, ఎరువుల కోసం భారీగా పెట్టుబడులు పెట్టినా నీటి లభ్యతపై స్పష్టత లేక ఆందోళన చెందుతున్నారని పేర్కొన్నారు. ప్రత్యామ్నాయంగా అదనపు పంపింగ్ మోటార్లు ఏర్పాటు చేసి నీటి సరఫరా పెంచాలని, సాధ్యం కాకపోతే రైతులకు తక్షణ నష్టపరిహారం అందించాలని కోరారు.

ప్రజలకు నాణ్యమైన ఇంధనం అందించడమే లక్ష్యం: మంత్రి పార్థసారథి

ప్రజలకు నాణ్యమైన ఇంధనం అందించడమే లక్ష్యం: మంత్రి పార్థసారథి

మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ప్రారంభమైన ఈ కేంద్రం ద్వారా ప్రజలకు ప్రమాణాలకు అనుగుణమైన సేవలు అందించడంతో పాటు స్థానిక సంస్థకు అదనపు ఆదాయం సమకూరుతుందని మంత్రి తెలిపారు. స్థానిక సంస్థల ఆర్థిక స్వావలంబన కోసం ప్రభుత్వం ఆదాయ వనరుల విస్తరణకు ప్రాధాన్యం ఇస్తోందన్నారు.

రైతులకు స్థిరమైన ఆదాయవనరు ఆయిల్ పామ్: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

రైతులకు స్థిరమైన ఆదాయవనరు ఆయిల్ పామ్: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

రైతులకు అధిక లాభాలు అందించే ఆయిల్‌ పామ్‌ సాగును విస్తరించాలని ప్రభుత్వం పిలుపునిచ్చింది. ఎకరాకు సబ్సిడీతో పాటు పరిశోధన, విత్తన ఉత్పత్తి, మిల్లింగ్‌, రిఫైనింగ్‌ సదుపాయాలతో ఖమ్మం వ్యవసాయ ఆధారిత పారిశ్రామిక కేంద్రంగా అభివృద్ధి చెందనున్నట్లు వెల్లడించింది.

పోలీసు సిబ్బంది సంక్షేమమే శాఖ ప్రాధాన్యం: డీజీపీ సి.వి. ఆనంద్

పోలీసు సిబ్బంది సంక్షేమమే శాఖ ప్రాధాన్యం: డీజీపీ సి.వి. ఆనంద్

పోలీసు సిబ్బంది, వారి కుటుంబాల కోసం విద్య, వైద్యం, గృహం, వివాహం, ఉన్నత విద్య రుణాలు, బీమా వంటి పథకాలను మరింత బలోపేతం చేయాలని ఆదేశించారు. సంక్షేమ నిధుల వినియోగంలో పారదర్శకత కోసం డిజిటలైజేషన్‌కు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు.

ప్రతికూల పరిస్థితుల్లో ప్రత్యామ్నాయ పంటలే మేలు: సుదర్శన్ రెడ్డి

ప్రతికూల పరిస్థితుల్లో ప్రత్యామ్నాయ పంటలే మేలు: సుదర్శన్ రెడ్డి

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో నీటి నిల్వలు, భూగర్భ జలాల పరిస్థితిపై సమీక్ష నిర్వహించిన అధికారులు రైతులకు పరిస్థితులకు అనుగుణంగా పంటల మార్పిడి, నీటి సంరక్షణపై అవగాహన కల్పించాలని నిర్ణయించారు. తాగునీటి అవసరాలకు తొలి ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు.

తొలి పలుకు - తెలుగు వార్తలు & కథలు