Let's talk: editor@tmv.in

Bold! Concerned! Unfiltered! Responsible!

Sudhir Pidugu
Sudhir Pidugu
Founder & Editorial Director
editor@tmv.in
కుత్బుల్లాపూర్ పారిశ్రామిక వాడలో కేటీఆర్ నిరసన

కుత్బుల్లాపూర్ పారిశ్రామిక వాడలో కేటీఆర్ నిరసన

Dantu Vijaya Lakshmi Prasanna
4 డిసెంబర్, 2025

రాష్ట్రంలోని రూ.5 లక్షల కోట్ల విలువైన భూములు కాజేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ముఠా కుట్ర చేస్తున్నదని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కే తారక రామారావు సంచలన ఆరోపణలు చేశారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం నూతనంగా తీసుకొచ్చిన ‘హైదరాబాద్‌ ఇండస్ట్రియల్‌ ల్యాండ్స్‌ ట్రాన్స్‌ఫర్మేషన్‌ పాలసీ’ (HILTP) అనేది ఒక పాలసీ కాదని, రూ.లక్షల కోట్ల భూ కుంభకోణం కోసం రూపొందించిన బ్లూప్రింట్‌ అని విమర్శించారు. ఈరోజు కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో పారిశ్రామిక వాడలో బిఆర్ఎస్ పార్టీ చేసిన నిరసన కార్యక్రమంలో పాల్గొన్న కేటీఆర్ ఈ వ్యకియాలు చేశారు. అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేస్తాము. నగరంలో ప్రజలకు ఈ స్కాం ను వివరిస్తాము. రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహిస్తాము. అవసరమైతే ప్రజాలతరపున న్యాయపోరాటం చేస్తామన్నారు.

కేటీఆర్ మాట్లాడుతూ, దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభకోణానికి తెరలేపిన రేవంత్‌ ముఠా, అన్నదమ్ములు, అనుచరుల కోసమే పాలసీ తెచ్చారన్నారు. ఈ పాలసీ క్యాబినెట్‌ ఆమోదం పొందకముందే భూముల డీల్స్‌ జరిగాయని, లక్షల కోట్ల భూమిని అప్పనంగా అప్పగించేందుకు ప్లాన్‌చేశారని, ప్రజల నుంచి సేకరించిన భూమి ప్రైవేటుకు సంతర్పణ అవుతుందని కేటీఆర్ అన్నారు. 30% ఎస్‌ఆర్వో రేట్లకు రెగ్యులరైజ్‌ రేవంత్ అవినీతికి పరాకాష్ట అన్నారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వచ్చాక పాలసీ, కేటాయింపులు రద్దు చేస్తుందని, మెగా భూ కుంభకోణంపై కేంద్రంలోని బీజేపీ స్పందించాలని ఎద్దేవా చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే పాలసీని ఉపసంహరించుకోవాలి. లేకపోతే ప్రజల పక్షాన బీఆర్‌ఎస్‌ న్యాయపోరాటం చేస్తుందని, బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ తీవ్ర హెచ్చరిక చేశారు.

ముస్లింల కబ్రస్థాన్‌కు జాగ లేదట. హైదరాబాద్‌లో ఇందిరమ్మ ఇండ్లు కట్టడానికి భూమి లేదట. కానీ, భూదందాలు చేయడానికి మాత్రం 9292 ఎకరాలు ఉన్నయా? అందులో 7వేల ఎకరాలు స్వాధీనం చేసుకుని దందాల కోసం కాకుండా ప్రభుత్వ, ప్రజా అవసరాల కోసం వెచ్చించాలి. లేదంటే వేలం వేసి, వచ్చిన ఆదాయాన్ని ప్రజాసంక్షేమానికి వినియోగించాలి. అంతేకానీ కొందరికి అప్పనంగా దోచిపెడుతా, రియల్‌ ఎస్టేట్‌ దందా చేసుకుంటా అంటే మాత్రం చూస్తూ ఊరుకోమన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.

9,292 ఎకరాలు కాజేసేందుకు కుట్ర

రాష్ట్రంలో ప్రభుత్వ భూములు ఎక్కడ ఉన్నా రేవంత్‌రెడ్డి ముఠా గద్దల్లా వాలిపోతున్నదని కేటీఆర్‌ విమర్శించారు. ఇప్పుడు ఎంతో విలువైన ప్రభుత్వ భూములపై రేవంత్‌ కుటుంబసభ్యుల కన్నుపడిందని తెలిపారు. బాలానగర్‌, జీడిమెట్ల, సనత్‌నగర్‌, అజామాబాద్‌తో సహా హైదరాబాద్‌లోని కీలకమైన పారిశ్రామిక క్లస్టర్లలో ఉన్న సుమారు 9,292 ఎకరాల భూమిని హెచ్‌ఐఎల్‌టీపీ పేరిట తమ వాళ్లకు కట్టబెట్టాలని చూస్తున్నారని ఆరోపించారు. ఈ భూముల మారెట్‌ విలువ ప్రస్తుతం ఎకరాకు రూ.40 కోట్ల నుంచి 50 కోట్ల వరకు ఉన్నదని, వీటి మొత్తం విలువ రూ.4.5 లక్షల కోట్ల నుంచి రూ.5 లక్షల కోట్ల వరకు ఉంటుందని చెప్పారు. కానీ, సబ్‌ రిజిస్ట్రార్‌ ఆఫీస్‌ (ఎస్‌ఆర్వో) నిర్ధారించే ప్రభుత్వ విలువలో కేవలం 30% నగదుకే అప్పగించాలని చూస్తున్నారని విమర్శించారు. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి అయిన రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రి కావడంతో ఆయన మనసు ఎప్పుడూ భూముల చూట్టూనే తిరుగుతుందని ఎద్దేవా చేశారు. మంచిరేవుల భూమిపై రేవంత్‌రెడ్డి అన్న కన్నుపడిందని, అందుకే భూమి కేటాయింపులు ఆగిపోయాయని, మంత్రి కొండా సురేఖ కూతురు మీడియా ముఖంగా ఈ ఆరోపణలు చేశారని గుర్తుచేశారు.

కేసీఆర్‌ సర్కారు తెచ్చిన చట్టం బుట్టదాఖలు

కేసీఆర్‌ ప్రభుత్వ హయాం లో అజామాబాద్‌ పారిశ్రామిక భూములను క్రమబద్ధీకరించినప్పుడు ఎస్‌ఆర్వో రేట్ల కంటే 100% నుంచి 200% అధికంగా వసూలు చేయాలని ఒక చట్టం చేశామని కేటీఆర్‌ గుర్తుచేశారు. ప్రభుత్వ భూమిని పారిశ్రామిక అవసరాలకు కేటాయించినప్పుడు ఎస్‌ఆర్వో రేట్ల కంటే 100% అధికంగా చెల్లించాలని నాడు తాము ఆ చట్టం తీసుకొచ్చామని చెప్పారు. ఒక పరిశ్రమకు కేటాయించిన భూమిని సదరు వ్యక్తి మరొకరికి బదలాయిస్తే ఎస్‌ఆర్వో రేట్ల 200% అధికంగా చెల్లించాలని చట్టం చేశామని వివరించారు. ఆ చట్టం ప్రతిని ఈ సందర్భంగా కేటీఆర్‌ మీడియా ఎదుట ప్రదర్శించారు. కానీ, కాంగ్రెస్‌ సర్కారు ఎస్‌ఆర్వో రేటులో కేవలం 30% చెల్లించాలని భూ కేటాయింపులు చేయాలని చూస్తున్నదని మండిపడ్డారు. ఎందుకు? ఎవరికి లాభం చేకూర్చడానికి? ఇంతలా తగ్గించారని ప్రశ్నించారు. ఎస్‌ఆర్వో విలువ కంటే భూముల మారెట్‌ ధరలు నాలుగైదు రెట్లు ఎకువగా ఉన్నాయని చెప్పారు. ఎస్‌ఆర్వో విలువలో 30% నగదు ప్రభుత్వ ఖజానాకు వెళ్తుండగా, మిగతా రూ.లక్షలాది కోట్లు నేరుగా ప్రైవేట్‌ వ్యక్తుల జేబుల్లోకి వెళ్తాయని ఆరోపించారు.

ప్రైవేట్‌ వ్యక్తుల లాభాల కోసమే

రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రిగా సుమారు పదేండ్లు పనిచేసినందున పరిశ్రమలకు భూముల కేటాయింపులపై తనకు సంపూర్ణ అవగాహన ఉన్నదని కేటీఆర్‌ గుర్తుచేశారు. ఉద్యోగ, ఉపాధి కల్పన, ఆర్థిక కార్యకలాపాలను ప్రోత్సహించడానికి ప్రభుత్వాలు పరిశ్రమలకు రాయితీతో భూములు కేటాయిస్తుంటాయని చెప్పారు. ‘ఉత్పత్తిని పెంచడానికి, ఉద్యోగాలు సృష్టించడానికి ప్రభుత్వాలు రాయితీ ధరలకే పారిశ్రామిక అవసరాల కోసం భూమిని కేటాయిస్తాయి. కానీ, ఇప్పుడు అవే భూములను ప్రైవేట్‌ వ్యక్తుల లాభాల కోసం క్రమబద్ధీకరిస్తున్నారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో కూడా అనేక మంది భూ యజమానులు, బ్రోకర్లు అత్యంత తకువ ధరలకు క్రమబద్ధీకరణ కోసం నన్ను సంప్రదించారు. కానీ, మేము ఆ ప్రతిపాదనలను తిరసరించాం. ప్రభుత్వ భూమిని ప్రైవేటు ప్రయోజనాల కోసం కేటాయించలేమని స్పష్టంగా చెప్పాం. కానీ, మేము ఆపిన పనినే ఇప్పుడు రేవంత్‌ చేస్తున్నారు. ప్రజల నుంచి పారిశ్రామిక అవసరాల కోసం భూములను సేకరించి, ఈ రోజు ప్రైవేట్‌ వ్యక్తుల కోసం రెగ్యులరైజ్‌ చేస్తామంటే కుదరదు’ అని కేటీఆర్‌ ధ్వజమెత్తారు.

పాలసీ ఆమోదం.. అనుమానాస్పదం

హెచ్‌ఐఎల్‌టీపీ పాలసీని ప్రభుత్వం ఆమోదించే వేగం అత్యంత అనుమానాస్పదంగా ఉన్నదని కేటీఆర్‌ పేర్కొన్నారు. పరిశ్రమకు భూమి కేటాయించాలని 7 రోజుల్లో దరఖాస్తులు రావడం, 7 రోజుల్లో ఆమోదాలు పొందడం, 45 రోజుల్లో పూర్తి క్రమబద్ధీకరణ చేయాలని చెప్పడంపై అనుమానాలు ఉన్నాయని తెలిపారు. రూ.లక్షలాది కోట్ల విలువైన భూముల అంశంలో ఎందుకీ తొందర? ఎందుకీ వేగవంతమైన ప్రక్రియ? అని ప్రశ్నించారు. రేవంత్‌రెడ్డి సోదరులు, అనుచరులు, మధ్యవర్తులు ఇప్పటికే ఆయా భూముల కోసం ముందస్తు ఒప్పందాలు చేసుకున్నారని ఆరోపించారు. పాలసీ ఆమోదం పొందడానికి ముందే డీల్స్‌ కుదిరాయని తెలిపారు. హెచ్‌ఐఎల్‌టీపీ పాలసీని కాంగ్రెస్‌ పార్టీకి ఏటీఎంగా మార్చుకున్నదని మండిపడ్డారు. దీని వెనుక అసలు ఉద్దేశం పట్టణాభివృద్ధి కాదని, ఎంపిక చేసిన కొద్దిమందిని పెద్ద ఎత్తున ధనవంతులుగా మార్చడమేనని ఆరోపించారు.

ఎవరినీ వదిలిపెట్టం

హెచ్‌ఐఎల్‌టీపీ పాలసీ కింద భూమి కొనుగోలు చేసే పారిశ్రామికవేత్తలు, డెవలపర్లు భవిష్యత్తులో తీవ్రమైన న్యాయపరమైన చికులను ఎదురొంటారని కేటీఆర్‌ హెచ్చరించారు. ‘ఈ లావాదేవీలు నిలబడవు. ఆ భూమిని తిరిగి తీసుకుంటాం. బీఆర్‌ఎస్‌ తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత క్రమబద్ధీకరణను రద్దుచేసి, తగిన చర్యలు ప్రారంభిస్తాం. మేము పూర్తిస్థాయి విచారణ జరుపుతాం. ఈ కుంభకోణంలో పాల్గొన్న ప్రతి ఒకరిపై చర్యలు తీసుకుంటాం. ఈ సామ్‌లో పాల్గొనే ఎవరినీ వదిలిపెట్టం’ అని హెచ్చరించారు. పెద్దలకు మాత్రమే లబ్ధి చేకూర్చే హెచ్‌ఐఎల్‌టీపీ పాలసీని వెంటనే ఉపసంహరించుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ‘దీనిపై బీజేపీకి నిజంగా చిత్తశుద్ధి ఉంటే హెచ్‌ఐఎల్‌టీపీ పాలసీని వ్యతిరేకించాలి. మౌనంగా ఉంటే కాంగ్రెస్‌, బీజేపీ కలిసిపోయాయని అర్థం’ అని అన్నారు.

కుత్బుల్లాపూర్ పారిశ్రామిక వాడలో కేటీఆర్ నిరసన - Tholi Paluku