
హోంమంత్రి అనిత శాంతిభద్రతలపై దృష్టి సారించాలి: వైసీపీ నేత ఆరే శ్యామల
రాష్ట్రంలో శాంతిభద్రతలను కాపాడాల్సిన బాధ్యత గల స్థానంలో ఉన్న హోంమంత్రి వంగలపూడి అనిత.. ప్రజల రక్షణను విస్మరించి రాజకీయ ప్రత్యర్థులపై వ్యక్తిగత దాడులు, దూషణలకు దిగుతున్నారని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి ఆరే శ్యామల తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఒక కీలకమైన రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి కూడా, అనిత రాజకీయ మర్యాదల పరిధులను పదేపదే దాటుతున్నారని ఆమె విమర్శించారు. రాష్ట్రంలో తీవ్రమవుతున్న శాంతిభద్రతల సంక్షేమం నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికే హోంమంత్రి ఇటువంటి ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు.
ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం భయాందోళనలు, మధ్య జీవిస్తున్న పరిస్థితి నెలకొందని శ్యామల పేర్కొన్నారు. ఇందుకు ఉదాహరణలుగా రాష్ట్రంలో జరిగిన కొన్ని కీలక సంఘటనలను ఆమె ప్రస్తావించారు. విజయవాడకు చెందిన గాడే సాయికృష్ణ అదృశ్యం, కాకినాడలో ఓ బాలిక అదృశ్యమైన ఘటనలో ఆలస్యం, దెందులూరులో టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్కు సంబంధించిన వివాదాస్పద ఘటనలు రాష్ట్రంలో క్షీణిస్తున్న శాంతిభద్రతలను ఆమె పేర్కొన్నారు.
రాష్ట్రంలో నేరాలు, అదృశ్యం కేసులు, ప్రజల భద్రతకు సంబంధించిన ఆందోళనలు రోజురోజుకూ పెరుగుతున్నా.. హోంమంత్రి మాత్రం కేవలం రాజకీయ విమర్శలు, ప్రచారానికే పరిమితమయ్యారని శ్యామల మండిపడ్డారు. ఇప్పటికైనా అనిత మళ్లింపు రాజకీయాలను పక్కనబెట్టి, రాష్ట్రంలో శాంతిభద్రతలను పునరుద్ధరించడంపై దృష్టి పెట్టాలని డిమాండ్ చేశారు. బాధితులకు త్వరితగతిన న్యాయం జరిగేలా చూడాలని, ఆంధ్రప్రదేశ్ ప్రజల ప్రాణాలకు, ఆస్తులకు పూర్తి భద్రత కల్పించడమే ధ్యేయంగా హోంమంత్రి పనిచేయాలని ఆరే శ్యామల స్పష్టం చేశారు.
