Let's talk: editor@tmv.in
ఆర్జేడీ నేత దారుణ హత్య

ఆర్జేడీ నేత దారుణ హత్య

Pinjari Chand
12 సెప్టెంబర్, 2025

త్వరలో బీహర్​ లో శాసనసభ ఎన్నికలు జరగనున్నాయి. ఈ సమయంలో బుధవారం రాత్రి జరిగిన హత్య ఒక్కసారిగా రాష్ర్టంలో, రాజకీయ వర్గాల్లో కలకలం రేపింది. ఆర్జేడీకి చెందిన ముఖ్యనేత, తేజస్వీ యాదవ్​ పోటీచేసే రాఘోపూర్ నియోజకవర్గం నాయకుడి హత్యతో ఆర్జేడీ కూడా ఉలిక్కిపడింది. ఓ రాజకీయ నేతను చంపడం తీవ్ర చర్చలకు దారి తీస్తోంది. రాజ్​ కుమార్​ అలియాస్, అల్లారాయ్​ ని దుండగులు కాల్చిచంపారు.

ఆర్జేడీ పంచాయతీ సెల్​ జిల్లా అధ్యక్షుడిగా

రాజ్​ కుమార్​ రాయ్​ వైశాలీ జిల్లాకు చెందిన వాడు. ఆ ప్రాంతంలో రాజకీయాల్లో చాలా చురుకుగా ఉంటాడు. ముఖ్​యంగా ఆర్జేడీ అంటే చాలా అభిమానం రానున్న ఎన్నికలకు ఇప్పటినుంచే ప్రచారం నిర్వహిస్తున్నారు. గతంలో రాఘోపూర్​ నియోజకవర్గం నుంచి స్వతంత్ర్య అభ్యర్థిగా పోటీ చేశారు. అయితే చిత్రగుప్త్​ నగర్ పోలీస్​ స్టేషన్​ పరిధిలో ఉన్న మున్నాచక్​ ప్రాంతంలో ఆయన పై గుర్తు తెలియని దుండగులు కాల్పులు జరిపి, అక్కడి నుంచి బైక్​ పై పారిపోయారు. స్థానికుల సమాచారంతో ఘటన స్థలానికి పోలీసులు చేరుకుని రాజ్​ కుమార్​ రాయ్​ ని ఆసుపత్రి కి తరలించారు.

అయితే అప్పటికే ప్రాణాలు పోయాయని వైద్యులు చెప్పారు. అయితే భూ వివాదంలోనే ఈ హత్య జరిగి ఉండవచ్చుననే ఎస్పీ పరిచయ్ కుమార్ భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఘటన స్థలానికి చేరుకున్న ఫోరెన్సిక్​ టీం హత్య జరిగిన ప్రదేశంలో ఆరు బుల్లెట్లను స్వాధీనం చేసుకుంది. దగ్గరలోని సీసీటీవీ ఫుటేజ్​ లో దుండగులు పారిపోతున్న దృశ్యాలు కనిపించాయని అన్నారు. అలాగే రాయ్​ డ్రైవర్ను, ఇతర సాక్షులను విచారిస్తున్నామని, ఈ కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తామని పోలీసులు తెలిపారు. రానున్న ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఈ హత్యతో పోలీసులు రాష్ట్రంలో మరింత భద్రత పెంచే అవకాశాలు ఉన్నాయి.

ఆర్జేడీ నేత దారుణ హత్య - Tholi Paluku