Let's talk: editor@tmv.in
తాజ్​ప్యాలెస్​కు బాంబు బెదిరింపు

తాజ్​ప్యాలెస్​కు బాంబు బెదిరింపు

Pinjari Chand
14 సెప్టెంబర్, 2025

దేశ వ్యాప్తంగా వరుస బాంబు బెదిరింపులతో ఆయా రాష్ట్రాలు ఆందోళన చెందుతున్నాయి. బాంబులు పెట్టామని, కాసేపట్లో పేల్చేస్తామని వరుసగా ఈ మెయిల్స్​ పెడుతూ అధికారులను ఆకతాయిలు బెంబేలెత్తిస్తున్నారు. ఢిల్లీ, ముంబయి, కేరళ, బెంగళూరు ప్రాంతాల్లో ఈ బెదిరింపుల ఘటనలు అధికమయ్యాయి. ఇటీవల ఢిల్లీ సీఎం రేఖగుప్తాకు, అలాగే దాదాపు 50 పాఠశాలలకు పైగా, జామియా మిలియా యూనివర్సిటీకి, కేరళ సీఎం పినరయి విజయన్​ కు, అలాగే తిరువనంతపురంలోని కోర్టుకు, శుక్రవారం ఢిల్లీ హైకోర్టుకు, ముంబై హైకోర్టుకు కూడా బాంబులతో పేల్చేస్తామనే మెయిల్​ వచ్చింది. ఇలా రోజూ ఎక్కడో ఒకచోట బాంబు బెదిరింపుల మెయిల్స్ పెడుతూ గుర్తు తెలియని వ్యక్తులు​ కలకలం రేపుతూనే ఉన్నారు.

తాజాగా శనివారం ఢిల్లీలోని తాజ్​ ప్యాలెస్​ హోటల్​ కు కూడా బాంబు బెదిరింపు మెయిల్స్​ వచ్చింది. దీంతో హోటల్​ సిబ్బంది పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు వెంటనే బాంబ్​, డాగ్​ స్వ్కాడ్​ తో పాటు హోటల్​ ను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఎలాంటి బాంబులు దోరకకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఇది కూడా ఆకతాయిలే చేసి ఉంటారని పోలీసులు నిర్థారణకు వచ్చారు. అయితే ఇటువంటి మెయిల్స్​ పెట్టడం కూడా చట్ట విరుద్ధమేనని, ఇటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

తాజ్​ప్యాలెస్​కు బాంబు బెదిరింపు - Tholi Paluku