
విజయ్ బస్సుయాత్ర ప్రారంభం
Pinjari Chand
14 సెప్టెంబర్, 2025
తమిళ వెట్రి కళగం వ్యవస్థాపకుడు దళపతి విజయ్ శనివారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా బస్సుయాత్రను ప్రారంభించారు. తమిళనాడులో 2026లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఈ యాత్ర ఉండనుంది. ఇందుకోసం ఇప్పటి నుంచే ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. పార్టీ ప్రారంభం తరువాత మొదటిసారిగా ప్రచారంలోకి దూకారు.
తిరుచ్చిలో ఘనస్వాగతం
ఈరోజు ఉదయం విజయ్ చెన్నై నుంచి నేరుగా తిరుచ్చి విమానాశ్రయానికి చేరుకున్నారు. అప్పటికే పార్టీ అభిమానులు, కార్యకర్తలు, శ్రేణులతో పరిసరాలు సందడిగా మారాయి. విజయ్ రావడంతో ఆయనకు ఘనస్వాగతం పలికారు. పార్టీ జెండాలను ఊపుతూ, డప్పులు మోగిస్తూ కళాకారులు జోష్ నింపారు. అందిరికి అభివాదం చేస్తూ ప్రచార వాహనం ఎక్కారు. వచ్చినవారికి అభివాదం చేస్తూ, విజయ చిహ్నం చూపిస్తూ ముందుకు కదిలారు.
