Let's talk: editor@tmv.in
ఆదిత్య ఠాక్రేపై మంత్రి వివాదస్పద వ్యాఖ్యలు

ఆదిత్య ఠాక్రేపై మంత్రి వివాదస్పద వ్యాఖ్యలు

Pinjari Chand
14 సెప్టెంబర్, 2025

నిత్య వివాదస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తుంటాడు బీజేపీ నాయకుడు, మహారాష్ట్ర ఫిషరీస్​, ఫోర్ట్స్​ శాఖ మంత్రి నితిశ్ రాణే. తాజాగా శివసేన(యూబీటీ) యువ నాయకుడు ఆదిత్య ఠాక్రేను లక్ష్యంగా చేసుకుని మాట్లాడారు. ఆదివారం జరిగే ఇండియా–పాకిస్ఠాన్​ మ్యాచ్​ ను ఆదిత్య బురఖా ధరించి చూస్తారని పరిహసమాడారు. దాంతో పాటు పాకిస్థాన్​ జిందాబాద్​ అంటూ కూడా కేకలు వేస్తారని ఎగతాళి చేశారు. అలాగే సంజయ్ రౌతుపై కూడా ఆదే రేంజ్​ లో వ్యంగంగా మాట్లాడారు. ఆయన మెరైన్​ డ్రైవ్ లో బ్లాక్​ లో టికెట్లు అమ్ముతారని ఆరోపించారు. దీంతో శివసేన నాయకులు రాణే పై ఆగ్రహం వ్యక్తం చేశారు.

బీసీసీఐ నిర్ణయాన్ని వ్యతిరేకించిన ఆదిత్య ఠాక్రే

దుబాయ్​ లో జరుగుతున్న ఆసియాకప్​ లో భాగంగా ఇండియా, పాకిస్థాన్​ మధ్య ఆదివారం జరిగే మ్యాచ్ పై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున్న దుమారం రేగుతుంది. దీంతో శివసేన(యూబీటీ) నేత ఆదిత్య ఠాక్రే కూడా తీవ్ర ఆరోపణలు చేశారు.బీసీసీఐ దేశ వ్యతిరేకిగా వ్యవహరిస్తోందని, పాక్​ తో ఆడాలన్న నిర్ణయం కరెక్ట్​ కాదని అన్నారు. అలాగే ప్రధాని మోదీపై ఉద్దవ్​ ఠాక్రే ఆగ్రహం వ్యక్తం చేశారు. పహల్గాం దాడిలో 26 మంది మరణించిన మళ్లీ వారితో ఏ విధంగా ఆడిస్తారని ప్రశ్నించారు. ఈ మ్యాచ్​ ను వ్యతిరేకిస్తూ రాష్ట్రం అంతటా ‘సింధూర్​’ పేరుతో నిరసనలు చేపడతామని ఈ సందర్భంగా ప్రకటించారు.

ఆదిత్య ఠాక్రేపై మంత్రి వివాదస్పద వ్యాఖ్యలు - Tholi Paluku