Let's talk: editor@tmv.in
ఉడిపి మూకాంబికకు ఇళయరాజా కానుక

ఉడిపి మూకాంబికకు ఇళయరాజా కానుక

FL - SIMHCLM
13 సెప్టెంబర్, 2025

తన సంగీత ప్రజ్ఞ, అంతర్జాతీయ ఖ్యాతి..ఈ డబ్బు..హోదా.. గౌరవం ఇవన్నీ ఉడిపి లోని మూకాంబిక అమ్మవారి కృపతోనే దక్కాయి అని మాస్ట్రో ఇళయరాజా అన్నారు. ఈమేరకు ఆయన కుమారుడు యువన్ శంకర్ రాజా.. మనుమడితో కలిసి ఇళయరాజా ఉడుపిలోని కొల్లూరు మూకాంబిక అమ్మవారి ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా,రూ.4కోట్ల విలువ గల వజ్రాలు పొదిగిన వెండి కిరీటాన్ని అమ్మవారికి సమర్పించారు.

ఇదే తరుణంలో వీరభద్ర స్వామికి వెండి కత్తిని కూడా కానుకగా అందజేశారు. పూజా కార్యక్రమాలు పూర్తయ్యాక,ఆలయ అర్చకులు ఇళయరాజాకు తీర్థ ప్రసాదాలు అందించడంతో పాటు,అమ్మవారి ఫొటోను కూడా అందజేశారు.ఇళయరాజా వెంట ఆయన తండ్రి కార్తిక్‌,మనవడు యతీశ్‌,ఇతర కుటుంబ సభ్యులు ఉన్నారు.ఈ సందర్భంగా ఇళయరాజా మాట్లాడుతూ,"జగన్మాత మూకాంబిక అమ్మవారి ఆశీస్సులే వల్లే ప్రతిదీ సాధ్యమైంది. నా చేతిలో ఏదీ లేదు"అని తెలిపారు.

ఇళయరాజా ఈ ఆలయానికి సాధారణ భక్తుడిగా వస్తారు.2006లో కూడా ఆయన అమ్మవారికి ఒక కిరీటాన్ని సమర్పించారు"అని మూకాంబిక ఆలయం మేనేజ్‌మెంట్ కమిటీ ఛైర్మన్ బాబుశెట్టి చెప్పారు. ఇళయరాజా దాతృత్వానికి ఆయన అభిమానులు ఫిదా అయ్యారు.

ఉడిపి మూకాంబికకు ఇళయరాజా కానుక - Tholi Paluku