Let's talk: editor@tmv.in
50 లక్షలకు చేరువలో భారత్ సౌరశక్తి

50 లక్షలకు చేరువలో భారత్ సౌరశక్తి

Thaduri Lalitya
13 సెప్టెంబర్, 2025

భారతదేశంలో ఇంటి ఇంటికి సౌర శక్తి విప్లవం ఇప్పుడు కేవలం మాటల్లోనే కాదు, నిజంగా జరుగుతోంది. పీఎం ‘సూర్య గృహ ముఫ్త్ బిజ్లీ యోజన’ కింద ఇప్పటికే 20 లక్షలకు పైగా ఇళ్లలో రూఫ్‌టాప్ సౌర ప్యానెల్స్ ఇన్‌స్టాల్ అయ్యాయి. ప్రభుత్వం తెలిపినట్టు, త్వరలో మరిన్ని 30 లక్షల ఇళ్లలో కూడా ఈ వ్యవస్థలను అమలు చేయనున్నారు. ఒక కోటి ఇళ్ల రూఫ్‌టాప్ సౌర శక్తి సాధనలో మధ్యదశ మాత్రమే అయినా కూడా లక్ష్యసాధన దిశగా ముందడుగు వేస్తుంది.

రూఫ్‌టాప్ ప్యానెల్స్ ఉన్న కుటుంబాలు తమ విద్యుత్ బిల్లులు తగ్గుతుండడం చూస్తున్నాయి. ఈ యోజనలో భాగమైన కుటుంబాల్లో సగానికి పైగా ఇప్పటికే విద్యుత్ బిల్లులు పూర్తి రీతిలో రద్దు అయ్యాయి. ఇదే ప్రోగ్రామ్‌కు ప్రధాన ఆకర్షణ. కానీ ఒక చిన్న ప్రయోగం నుంచి పెద్ద స్థాయి ప్రోగ్రామ్‌కి మారడం వేగం, సమానత్వం, వ్యవస్థల విషయంలో కొత్త సవాళ్లను తెస్తుంది. దీని పరిష్కారంగా ప్రభుత్వం యుటిలిటీ లీడ్ మోడల్ ను ఆమోదించింది. దీనిలో డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు లేదా యుటిలిటీల ద్వారా ప్రజలకు సౌర శక్తిని సమీకరించి అందించవచ్చు రూఫ్ టాప్ ద్వారా అందిస్తారు. దీని ద్వారా మిలియన్ల ఇళ్లకు త్వరగా సౌర శక్తి చేరవచ్చు. ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాలు ఇప్పటికే ఈ ఐడియాను వేగంగా అమలు చేశాయి.

రూఫ్‌టాప్ ప్యానెల్స్ తయారీ వెనుక ఒక కథ ఉంది. ప్రభుత్వం దేశీయ సౌర విలువ శ్రేణిని పెంపొందిస్తున్నది. సుమారు 100 జిడబ్ల్యు (గిగావాట్లు) మాడ్యూల్ తయారీ సామర్థ్యం, రూ. 50,000 కోట్ల పెట్టుబడులు, 12,600 నేరుగా ఉద్యోగాలు ఈ ప్రోత్సాహాలతో కలిగాయి. దీని వల్ల దిగుమతులపై ఆధారాన్ని తగ్గించవచ్చు, ఉద్యోగాలు పెరుగుతాయి. అయితే, ఫ్యాక్టరీ అవుట్ ఫుట్ ఫైనాన్స్, ఇన్‌స్టాలేషన్ సామర్థ్యం, నాణ్యత నియంత్రణతో సరిపోల్చడం అవసరం.

పీఎం సూర్యా గృహ ముఫ్త్ బిజ్లీ యోజన కింద 20 లక్షలకు పైగా హౌస్‌హోల్డ్స్ రూఫ్‌టాప్ సౌర వ్యవస్థలను ఇన్‌స్టాల్ చేసుకున్నాయని, త్వరలో మరో 30 లక్షల గృహాలు ఇందులో చేరనుందని చెప్పారు. 2030 నాటికి భారతదేశం లక్ష్యంగా పెట్టుకున్న 550 జిడబ్ల్యు పునరుత్పాదక శక్తి లక్ష్యం వైపు కూడా పురోగతి సాధించిందని, ఇప్పటికే 251.5 జిడబ్ల్యు విజయవంతంగా చేరుకున్నట్లు కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. ఇది లక్ష్య సాధనలో మైలురాయి అనే చెప్పాలి. కానీ సామర్థ్యం పెరగడం సరిపోదు, గ్రిడ్ అప్‌గ్రేడ్‌లు, పవర్ కొనుగోలు ప్రణాళికలు, ఇన్‌స్టాల్డ్ సామర్థ్యం, ఉత్పత్తి నిజానికి మధ్య స్పష్టత ఉండాలి అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మన దగ్గర ప్యానెల్స్, ప్లాంట్స్ సిద్ధంగా ఉన్నాయి, ఇప్పుడు వాటిని సమగ్రంగా ఉపయోగించడం అవసరం.

ప్రభుత్వం కొన్ని పాలసీ మార్పులు చేసింది. పునరుత్పాదక పరికరాలపై జిఎస్టి 12% నుంచి 5%కి తగ్గించబడింది, దీని వల్ల ముందస్తు ఖర్చులు తగ్గుతాయి. అలాగే, పిఎం కుసుమ్(ప్రధాన మంత్రి కిసాన్ ఊర్జా సురక్షా ఏవం ఉత్థాన్ మహాభియాన్) 2.0 ప్రస్తుత దశ ముగిసిన తర్వాత మార్చ్ 2026లో అమలు కానుంది, కేబినెట్ ఆమోదం మిగిలింది. ఇవి సౌర శక్తి వినియోగాన్ని వేగవంతం చేస్తాయి. యుటిలిటీ మోడల్ రూఫ్‌టాప్ లేని ప్రజలకు కూడా సౌర శక్తి అందించగలదు. కానీ, గ్రిడ్ ప్రణాళిక, కఠిన నాణ్యత తనిఖీలు, స్పష్టమైన ఫైనాన్సింగ్, రాష్ట్ర స్థాయి అమలు లేకుండా వేగంగా విస్తరించడం, వంటివి లాభాలను తగ్గించే ప్రమాదం ఉంది. భారతదేశపు రూఫ్‌టాప్ సౌర విప్లవం సరిగ్గా అమలైతే లక్షల ఇళ్లకు తక్కువ ఖర్చులో విద్యుత్ గా మారగలదు.

50 లక్షలకు చేరువలో భారత్ సౌరశక్తి - Tholi Paluku