
హైదరాబాద్ దేశంలోనే ‘క్రియేటివిటీ హబ్’గా అవతరించనుంది: మంత్రి శ్రీధర్ బాబు
హైదరాబాద్ ఐటీ రాజధానిగా మాత్రమే కాకుండా, దేశంలోనే “క్రియేటివిటీ హబ్”గా ఎదగాలని ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్లో జరిగిన ఇండియా జాయ్ 2025 కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ విజువల్ ఎఫెక్ట్స్, యానిమేషన్ అండ్ గేమింగ్ అసోసియేషన్తో కలిసి నిర్వహించింది.
మంత్రి మాట్లాడుతూ, హైదరాబాద్ ఇప్పుడు సాంకేతికత, కథనం, డిజైన్ అనే మూడు విభాగాల కలయికగా అభివృద్ధి చెందుతుందని, ఈ సమ్మిళితం నగర అభివృద్ధిలో తదుపరి దశను నిర్ధారిస్తుందని పేర్కొన్నారు. ఐటీ ప్రాధాన్యతతో పాటు యానిమేషన్, గేమింగ్, డిజిటల్ మీడియా, డిజైన్, కథనరచన వంటి సృజనాత్మక రంగాలు హైదరాబాద్ భవిష్యత్తును మలుస్తాయని మంత్రి చెప్పారు.
పెట్టుబడులకు, భాగస్వామ్యానికి ఆహ్వానం
అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మిస్తున్న ఇమేజ్ టవర్, రాబోయే ఏఐ ఇన్నోవేషన్ హబ్, ప్రతిపాదిత ఏఐ సిటీ వంటి మౌలిక వసతుల ప్రాజెక్టులు హైదరాబాద్ స్థాయిని మరింత బలోపేతం చేస్తాయని శ్రీధర్ బాబు వివరించారు. వచ్చే ఏడాదిలో ఇమేజ్ టవర్ పూర్తిగా కార్యకలాపాలు ప్రారంభించనున్నదని ఆయన తెలిపారు.
సృజనాత్మక రంగాల్లో అభివృద్ధి కోసం ప్రభుత్వం నియంత్రణ సంస్థగా కాకుండా, సహకార భాగస్వామిగా వ్యవహరిస్తుందని మంత్రి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం, యానిమేషన్ స్టూడియోలు, గేమ్ డెవలపర్లు, క్రియేటివ్ ఆంత్రప్రెన్యూర్లను కలిసి ‘క్రియేటివ్ ఫ్యూచర్స్ ఫండ్’, ఇ-స్పోర్ట్స్ అకాడమీ, మహిళా సృష్టికర్తల కోసం ప్రత్యేక ప్రోత్సాహక కార్యక్రమాలు ప్రారంభించేందుకు ఆహ్వానించారు.
హైదరాబాద్ ఆధునిక సాఫ్ట్వేర్, గేమింగ్, విజువల్ ఎఫెక్ట్స్, డిజిటల్ ఆర్ట్, కథనరచనలో దేశానికి దారిదీపమయ్యే శక్తి కలిగి ఉందని మంత్రి తెలిపారు. యువ కళాకారులు, డెవలపర్లు భావన, వైవిధ్యం, భారతీయత అనే విలువలను ఆధారంగా చేసుకొని తమ సృజనాత్మకతను అభివృద్ధి చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
ఇండియా జాయ్ 2025 వేదికగా, హైదరాబాద్ సాంకేతికతతో పాటు సృజనాత్మకతకు కేంద్రంగా నిలుస్తుందనే సంకేతం ఇచ్చిందని పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి. ప్రారంభోత్సవ కార్యక్రమానికి సంజయ్ జాజు, కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ కార్యదర్శి, దిల్రాజు, తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్, నటుడు తేజ సజ్జా, తదితర ప్రముఖులు హాజరయ్యారు.
ప్రభుత్వం ‘క్రియేటివ్ ఫ్యూచర్స్ ఫండ్’ను ప్రధానంగా తెలంగాణలోని సృజనాత్మక రంగాల అభివృద్ధి కోసం ప్రోత్సాహక మూలధన నిధిగా ఉపయోగించాలనే ఉద్దేశంతో యోచిస్తోంది.
స్టార్టప్లు కొత్త సృష్టికర్తలకు ఆర్థిక మద్దతు యానిమేషన్, గేమింగ్, విజువల్ ఎఫెక్ట్స్, డిజిటల్ మీడియా రంగాల్లో కొత్తగా ప్రవేశిస్తున్న స్టార్టప్లు, యువ సృష్టికర్తలు తమ ఆలోచనలను మార్కెట్కి తీసుకెళ్లడానికి ప్రారంభ నిధులు రూపంలో ఈ ఫండ్ను వినియోగించుకునే అవకాశం ఉంటుంది.అలాగే ప్రభుత్వ లక్ష్యం “టాలెంట్ ఉన్నవారికి పెట్టుబడి లోటు అడ్డంకిగా మారకూడదు” అనే దిశగా ఉంది.మహిళలు డిజిటల్ కంటెంట్, గేమ్ డెవలప్మెంట్, డిజైన్ రంగాల్లో ఎక్కువగా భాగస్వామ్యం కావడానికి ప్రత్యేక సబ్సిడీలు, శిక్షణా గ్రాంట్లు ఇవ్వాలని ప్రణాళిక ఉంది.
