Let's talk: editor@tmv.in
హైడ్రాకు మద్దతుగా నగరవాసుల ర్యాలీలు

హైడ్రాకు మద్దతుగా నగరవాసుల ర్యాలీలు

Gaddamidi Naveen
10 ఆగస్టు, 2026

నగరంలో చెరువులు, పార్కులు, నాలాల ఆక్రమణలను అరికడుతున్న హైడ్రా వ్యవస్థకు మద్దతుగా నగరం వ్యాప్తంగా పలు కాలనీ సంక్షేమ సంఘాలు, ప్రజలు ఆదివారం పెద్ద ఎత్తున ర్యాలీలు నిర్వహించారు. దేశంలోనే తొలిసారిగా ఇలాంటి ప్రజానుకూల వ్యవస్థను ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రాష్ట్ర ప్రభుత్వానికి వారు పూర్తయిన సంఘీభావం ప్రకటించారు.

పుప్పాలగూడ - నార్సింగి సరిహద్దుల్లోని 52.20 ఎకరాల ముష్కిన్ చెరువులో దాదాపు 35 ఎకరాల మేర జరిగిన ఆక్రమణలను హైడ్రా తొలగించి, చెరువును కబ్జా కాకుండా కాపాడింది. దీనికి నిదర్శనంగా స్థానిక గేటెడ్ కమ్యూనిటీలు, అపార్ట్‌మెంట్ నివాసితులు భారీ మద్దతు ర్యాలీలు నిర్వహించారు. అలాగే, గచ్చిబౌలిలోని జనార్దన హిల్స్ కాలనీలో ఆక్రమణకు గురైన వరద కాలువను, దానికి ఆనుకుని ఉన్న పార్కును పరిరక్షించినందుకు సీనియర్ సిటిజన్లు, మహిళలు, చిన్నారులు కలిసి సంఘీభావ ప్రదర్శన చేపట్టారు. నగరంలో వరదలు లేని సురక్షిత భవిష్యత్తు కావాలంటే చెరువులను కాపాడుకోవడం అత్యంత ఆవశ్యకమని, అందుకే హైడ్రా వ్యవస్థను నిరంతరం కొనసాగించాలని స్థానికులు డిమాండ్ చేశారు.

హైడ్రాకు మద్దతుగా నగరవాసుల ర్యాలీలు - Tholi Paluku