
హరే కృష్ణ కేంద్రంలో గర్భాలయ యంత్ర స్థాపన
క్రొత్త నిర్మాణ ప్రాజెక్ట్లో ఒక ముఖ్యమైన దశను చేరుకున్న హరే కృష్ణ మూవ్మెంట్ – భారత్ ప్రాజెక్ట్, సంగారెడ్డి జిల్లా కంది ప్రాంతంలో నిర్మించబడుతున్న హరే కృష్ణ కల్చరల్ సెంటర్ లో మహా నరసింహ హోమం అలాగే గర్భాలయ యంత్ర స్థాపన పూజా అత్యంత వైభవంగా, భక్తిశ్రద్ధలతో శనివారం ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి హరే కృష్ణ మూవ్మెంట్ హైదరాబాద్ అధ్యక్షులు, అక్షయ పాత్ర ఫౌండేషన్ (తెలంగాణ & ఏపీ ప్రాంతీయ అధ్యక్షులు) శ్రీమాన్ సత్య గౌర చంద్ర దాస ప్రభుజి అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఇతర ప్రముఖులతో కలిసి పవిత్ర పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
సాంస్కృతిక వారసత్వానికి చిహ్నంగా నూతన కేంద్రం
రాబోయే ఈ హరే కృష్ణ సాంస్కృతిక కేంద్రం శ్రీ శ్రీ రాధా కృష్ణుల అత్యంత సుందరమైన విగ్రహాలకు ఆలయంగానే కాకుండా, సనాతన ధర్మం యొక్క గొప్ప వారసత్వం విలువలను ప్రోత్సహించే సాంస్కృతిక వేదికగా కూడా ఉపయోగపడనుంది. ఇది హరే కృష్ణ మూవ్మెంట్ ఇండియాకు ఒక ప్రతిష్టాత్మక ప్రాజెక్టు గా పేర్కొన్నారు. ఇది సంగారెడ్డిలో మొదటి, అతిపెద్ద హరే కృష్ణ మందిరం సాంస్కృతిక కేంద్రం ఇదే కావడం విశేషం.
ఈ కార్యక్రమం ప్రారంభంలో వందలాది మంది భక్తులు హరే కృష్ణ మహామంత్రాన్ని పఠిస్తూ జప యజ్ఞాన్ని నిర్వహించారు. ప్రాజెక్ట్ విజయవంతంగా పూర్తవడానికి దైవ ఆశీస్సులను కోరుతూ మహా నరసింహా హోమం జరిపారు.
అనంతరం ముఖ్య అతిథి మంత్రి దామోదర రాజనర్సింహ పూర్ణాహుతి వద్ద వేద శ్లోకాల మధ్య ఆ హోమం ఘనంగా ముగిసింది. తర్వాత గర్భగృహంలో విగ్రహ స్థానం కోసం వినాశక వ్యంజనం (విగ్రహ యంత్రం) స్థాపన పూజలో ప్రముఖులు పాల్గొన్నారు.ఈ కార్యక్రమం హారతి, భజనలు, పుష్పాంజలితో ముగిసింది.
ఈ సందర్భంగా, ప్రతిపాదిత హరే కృష్ణ సాంస్కృతిక కేంద్రం యొక్క నిర్మాణ నమూనా అలాగే ప్రణాళికా సౌకర్యాలను ప్రదర్శిస్తూ ఏర్పాటు చేసిన ఎక్స్పోను కూడా అతిథులు తిలకించారు. ఈ శుభ సందర్భాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన శిలా ఫలకాన్ని మంత్రి దామోదర రాజనర్సింహ ఇతర ప్రముఖులు శ్రీమాన్ సత్య గౌర చంద్ర దాస ప్రభుజీతో కలిసి ఆవిష్కరించారు.
సామాజిక కార్యక్రమాలకు పూర్తి సహకారం: మంత్రి దామోదర రాజనర్సింహ
ముఖ్య అతిథిగా విచ్చేసిన మంత్రి దామోదర రాజనర్సింహ హరే కృష్ణ మూవ్మెంట్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఆధ్యాత్మిక సామాజిక సంక్షేమ కార్యక్రమాలను అభినందించారు. ప్రతి మనిషి జీవితం మాతృదేవోభవ, పితృదేవోభవ, గురుదేవోభవ అనే మూడు మార్గదర్శక సూత్రాల చుట్టూ కేంద్రీకృతమై ఉండాలని ఆయన ఉద్ఘాటించారు. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక అవగాహన కోసం ప్రయత్నించాలని మంత్రి సూచించారు.
అక్షయ పాత్ర ఫౌండేషన్ గురించి మంత్రి మాట్లాడుతూ 2001లో ఆకలితో ఉన్న పాఠశాల పిల్లలకు ఆహారం అందించాలనే లక్ష్యంతో ప్రారంభమైన ఈ కార్యక్రమం ఇప్పుడు భారతదేశం అంతటా 25 లక్షల ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందిస్తోందని, ఇది అద్భుతమైన ఘనత అని మంత్రి కొనియాడారు. ఇటువంటి పెద్ద ఎత్తున మానవతా కార్యక్రమాలు సాధ్యం కావడానికి దోహదపడిన సేవ చేయాలనే దృక్పథం, సంకల్పం ఇది గొప్ప సామాజిక సేవా కార్యాచరణ అని ఆయన ప్రశంసించారు.
హరే కృష్ణ మూవ్మెంట్ అధ్యక్షులు
సత్య గౌర చంద్రదాసప్రభుజీ మాట్లాడుతూ, శ్రీల ప్రభుపాద మహారాజు ప్రసిద్ధ వాక్యాలను గుర్తు చేశారు."మీరు ఈ లోకంలో శ్రీకృష్ణ మందిరం నిర్మించడంలో సహాయం చేస్తే, కృష్ణ మీకు రాజ్యంలో, వైకుంఠంలో మీకు ఒక రాజభవనాన్ని నిర్మిస్తారు".అతను అందరినీ హరే కృష్ణ మహా మంత్రం జపం చేయమని, భక్తి సేవలో నిమగ్నమవ్వమని ప్రోత్సహించారు.
అక్షయ పాత్ర వంటగదిని సందర్శించిన ప్రముఖులు
కార్యక్రమంలో భాగంగా, ప్రముఖులకు అక్షయ పాత్ర ఫౌండేషన్ యొక్క వంటగదిని సందర్శించేందుకు ఏర్పాట్లు చేశారు. వారు ఆధునిక వంటసామగ్రి, ఆధునిక వంటగది పరికరాలను అలాగే ఆటోమేటిక్ కూరగాయలు కడగడం, కత్తిరించే యంత్రాలను ప్రారంభించారు. అలాగే, మిడ్-డే మీల్ కార్యక్రమం కింద పాఠశాల విద్యార్థులకు పోషక విలువలతో కూడిన భోజనాన్ని అందించడానికి ఉపయోగించే 3 కొత్త కస్టమ్-బిల్ట్ అక్షయ పాత్ర ఆహార పంపిణీ వాహనాలను జెండా ఊపి ప్రారంభించారు.
హరే కృష్ణ మూవ్మెంట్, హైదరాబాదు గురించి
హరే కృష్ణ మూవ్మెంట్ హైదరాబాదు భారతీయ ఆధ్యాత్మిక సంప్రదాయాన్ని ప్రాచుర్యం చేసేందుకు పనిచేసే లాభరహిత సంస్థ. ఇది తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో అనేక సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తోంది. భోజనమృత, ఇందిరమ్మ కాంటీన్స్, సద్ది మూట, స్వస్థ్యాహార వంటి ఫ్లాగ్షిప్ కార్యక్రమాల ద్వారా 15 కోట్లకు పైగా భోజనాలు అందించబడినవి.
