
'సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్స్' కాలేజీ ప్రారంభం
రాష్ట్రంలోని మైనారిటీ విద్యార్థుల భవిష్యత్ను మెరుగుపరచే దిశగా, తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కార్యాచరణలో భాగంగా ఎర్రగడ్డ మైనారిటీ రెసిడెన్షియల్ జూనియర్ గర్ల్స్ కాలేజీని తాజాగా సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్స్ (సీవోఈ) గా అప్గ్రేడ్ చేసింది. ఈ సంస్థను మంత్రులు వివేక్ వెంకటస్వామి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సోమవారం ప్రారంభించారు. విద్య అనేది ఏ వర్గానికి చెందిన వారినైనా సామాజికంగా ఎదగడానికి, ఆర్థికంగా స్వతంత్రంగా ఉండేందుకు తోడ్పడే శక్తివంతమైన సాధనమని మంత్రులు పేర్కొన్నారు. ఈ ‘సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్స్’ మాదిరిగా ఏర్పడే కేంద్రాల ద్వారా మైనారిటీ విద్యార్థులు హై లెవెల్ విద్యను పొందగలుగుతారని చెప్పారు. ప్రభుత్వ రంగం సహాయంతో పేదవారు కూడా టాప్ కోచింగ్ను పొందగలుగుతారని.. అలాగే విద్యార్థులు వారి జీవితాల్లో స్ధిరత, గౌరవం, అవకాశాలు పెరుగుతాయని మంత్రులు వివేక్, అడ్డూరి పేర్కొన్నారు.
