Let's talk: editor@tmv.in
సోషల్ మీడియాలో తప్పుదోవ పట్టించారు​: సీజేఐ

సోషల్ మీడియాలో తప్పుదోవ పట్టించారు​: సీజేఐ

Pinjari Chand
19 సెప్టెంబర్, 2025

సోషల్​ మీడియాలో తాను ఖజురహో ఆలయంపై చేసిన వ్యాఖ్యలను కొంతమంది తప్పుదోవ పట్టించారని, నేను అన్ని మతాలను గౌరవిస్తానని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి బీఆర్​ గవాయ్​ తెలిపారు. విగ్రహ పున:ప్రతిష్టాపనకు యూనెస్కో, ఇండియన్​ పురావస్తు శాఖ నుంచి అనుమతులు అవసరమని తెలిపారు.

అసలు వివాదమేమిటంటే

మధ్యప్రదేశ్​ రాష్ట్రంలో అత్యంత ప్రసిద్ది చెందిన ఖజురహోని జవారీ ఆలయంలో విష్ణువు విగ్రహం డ్యామేజీ అయిందని దాని స్థానంలో మరొకటి ప్రతిష్టించేలా ఆదేశాలు ఇవ్వాలని రాకేశ్ దలాల్ అనే వ్యక్తి కోర్టులో పిటిషన్​ వేశారు. అయితే ఈ సందర్బంగా జస్టిస్​ బీఆర్ గవాయ్​, జస్టిస్​ వినోద్​ చంద్రతో కూడిన బెంచ్​ విచారించింది. ఈ సందర్భంగా జస్టిస్​ బీఆర్​ గవాయ్ మాట్లాడుతూ ‘ఏదైనా చేయమని ఆ దేవుడినే అడగండి.ప్రార్థనలు, పూజలు చేయండి అని వ్యాఖ్యానించినట్లు ​​పిటిషనర్ పేర్కొన్నారు. దీంతో మమ్మల్ని అవమానించారని ఆయన ఆరోపణలు చేశారు. అయితే సీజేఐ స్పందిస్తూ కొత్త విగ్రహ ప్రతిష్టాపనకు పరావస్తు శాఖ అనుమతి అవసరమని చెప్పానని, చాలా సమస్యలు ఉన్నాయని తెలిపానని అన్నారు. అయితే ఈ విషయంపై సోషల్​ మీడియాలో పెద్ద ఎత్తున దుమారం రేగిందని వాపోయారు.

సోషల్ మీడియాలో తప్పుదోవ పట్టించారు​: సీజేఐ - Tholi Paluku