Let's talk: editor@tmv.in
శ్రీలంకలో ఆపరేషన్ సాగర్ బంధు: ఐఎన్ఎస్ విక్రాంత్

శ్రీలంకలో ఆపరేషన్ సాగర్ బంధు: ఐఎన్ఎస్ విక్రాంత్

Dantu Vijaya Lakshmi Prasanna
29 నవంబర్, 2025

భారత నౌకాదళ నౌక ఐఎన్ఎస్ విక్రాంత్, సైక్లోన్ దిత్వా కారణంగా శ్రీలంకలో సంభవించిన తీవ్ర వరదలు, కొండచరియల సహాయక చర్యలకు మద్దతుగా ‘ఆపరేషన్ సాగర్ బంధు’ను ప్రారంభించింది.

శ్రీలంకలో సంభవించిన తీవ్ర వరదలు, కొండచరియల విపత్తుల నేపథ్యంలో కొనసాగుతున్న సహాయక చర్యలకు మద్దతుగా భారతదేశపు స్వదేశీ విమాన వాహక నౌక ఐఎన్ఎస్ విక్రాంత్ ను మోహరించనున్నట్లు అధికారులు శుక్రవారం ధృవీకరించారు.

శ్రీలంక నౌకాదళం తెలిపిన వివరాల ప్రకారం, నవంబర్ 30న జరగనున్న అంతర్జాతీయ ఫ్లీట్ రివ్యూ 2025కు ముందు, ఈ విమాన వాహక నౌక నవంబర్ 25, 26 తేదీల్లో పోర్ట్ కాల్స్ కోసం కొలంబోలో లంగరు వేశాయి. అయితే వాతావరణ అత్యవసర పరిస్థితి కారణంగా భారత్ ఈ మానవతా సహాయ మిషన్ చేపట్టబడింది.

సైక్లోనిక్ తుఫాను దిత్వా కారణంగా తూర్పున ఉన్న ట్రింకోమలీ ప్రాంతం, చుట్టుపక్కల జిల్లాల్లో భారీ నష్టం వాటిల్లగా, సహాయక చర్యలకు ఐఎన్ఎస్ విక్రాంత్ విమానాలు మద్దతు ఇస్తాయని రక్షణ మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈ సమయంలో ఐఎన్ఎస్ విక్రాంత్ ,ఐఎన్ఎస్ ఉదయగిరి నౌకలు కొలంబోలో శ్రీలంక అధికారులకు అత్యవసర సహాయ సామాగ్రిని అందజేశాయి.

శ్రీలంక ప్రభుత్వం చేసిన అభ్యర్థన మేరకు, ఐఎన్ఎస్ విక్రాంత్ నుండి హెలికాప్టర్లను సహాయక రెస్క్యూ కార్యకలాపాల కోసం ప్రభావిత ప్రాంతాలకు పంపనున్నారు.ఈ సహాయక మిషన్‌కు 'ఆపరేషన్ సాగర్ బంధు' అని పేరు పెట్టారు. ఈ ఆపరేషన్ కింద భారతదేశం మరింత సహాయం అందించడానికి సిద్ధంగా ఉందని భారత్ పేర్కొంది.

ఈ వరదలు, కొండచరియల విపత్తు కారణంగా ఇప్పటివరకు 56 మంది మరణించారు, ఇంకా 21 మంది గల్లంతయ్యారు. నిత్యావసర సేవల్లో పనిచేసే వారిని మినహాయించి, మిగతా అందరికీ ప్రభుత్వం శుక్రవారం ప్రభుత్వ సెలవుదినంగా ప్రకటించింది. గత 72 గంటల్లోనే 46 మరణాలు సంభవించినట్లు విపత్తు నిర్వహణ కేంద్రం అధికారులు తెలిపారు. మధ్య ప్రాంతంలోని మాతలే జిల్లాలో 24 గంటల్లోనే అత్యధికంగా 540 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది కెలానీ నదికి దగ్గరగా ఉన్న కొలంబోలోని దిగువ ప్రాంతాల్లో భారీగా వరదలు వచ్చే ప్రమాదం ఉందని అక్కడి వాతావరణ శాఖ తెలిపింది. 12,313 కుటుంబాలకు చెందిన 43,991 మంది ఈ విపత్తుతో ప్రభావితమయ్యారు.

"ఈ పరిస్థితి మారే అవకాశం లేదు. 2016 వరదల్లో నమోదైన దాని కంటే కెలానీ నది నీటిమట్టాలు పెరుగుతాయని మేము ఆశిస్తున్నాము" అని డైరెక్టర్ జనరల్ అజిత్ గుణశేఖర హెచ్చరించారు. ప్రమాదకర ప్రాంతాల్లోని నివాసితులు తొలగించడానికి, సురక్షిత ప్రాంతాలకు వెళ్లే ముందు ముఖ్యమైన పత్రాలు (విద్యార్హత పత్రాలు, వాహన పత్రాలు) విలువైన వస్తువులను భద్రపరచాలని కోరారు.

ఈ విపత్తులో ప్రాణాలు కోల్పోయిన వారికి భారత ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం వ్యక్తం చేశారు. ఈ క్లిష్ట సమయంలో భారతదేశం శ్రీలంకకు అండగా నిలుస్తుందని హామీ ఇచ్చారు.