
రెపో రేటును 0.25 శాతం తగ్గించిన ఆర్బీఐ
ఆర్థిక వృద్ధికి మరింత బలం చేకూర్చే ప్రయత్నంలో ఆర్బిఐ వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన తర్వాత, స్టాక్ మార్కెట్ సూచీలు సెన్సెక్స్, నిఫ్టీ శుక్రవారం ఉదయం ట్రేడింగ్లో ర్యాలీ చేశాయి.
ప్రారంభ ట్రేడింగ్లో అస్థిరత తర్వాత, 30 షేర్ల బిఎస్ఇ సెన్సెక్స్ పుంజుకుని 318.71 పాయింట్లు పెరిగి 85,584.03 వద్దకు చేరుకుంది. 50 షేర్ల ఎన్ఎస్ఇ నిఫ్టీ కూడా 95 పాయింట్లు పెరిగి 26,128.75 వద్దకు ఎగబాకింది.
రూపాయి విలువ తగ్గుతున్న ఆందోళనలను పక్కనపెట్టి, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండవ త్రైమాసికంలో ఆరు త్రైమాసికాల గరిష్ట స్థాయి అయిన 8.2 శాతానికి పెరిగిన ఆర్థిక వృద్ధికి మరింత బలం చేకూర్చేందుకు ఆర్బిఐ వడ్డీ రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గించి 5.25 శాతానికి చేర్చింది.
ఈ పరిణామం వల్ల గృహ, ఆటో, వాణిజ్య రుణాలతో సహా అడ్వాన్స్లు చౌకగా మారే అవకాశం ఉంది.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఐదవ ద్వై-మాసిక ద్రవ్య విధానాన్ని ప్రకటిస్తూ, ఆర్బిఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా, ద్రవ్య విధాన కమిటీ (ఎమ్పిసి) ఏకగ్రీవంగా స్వల్పకాలిక రుణ రేటు లేదా రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గించి 5.25 శాతానికి చేర్చాలని, దీనిని తటస్థ వైఖరి తో కొనసాగించాలని నిర్ణయించినట్లు తెలిపారు.
ఆర్బిఐ ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి తన వృద్ధి అంచనాను మునుపటి 6.8 శాతం నుండి 7.3 శాతానికి పెంచింది.
"ఆర్థిక వ్యవస్థలో కొనసాగుతున్న బలమైన వృద్ధి ఉన్నప్పటికీ, ఎమ్పిసి వృద్ధికి అనుకూలంగా ఓటు వేయాలని నిర్ణయించింది. 25 బిపిఎస్ రేటు కోతకు సంబంధించిన ఏకగ్రీవ స్వభావం, రూపాయి విలువ తగ్గుతున్న సందర్భంలో కూడా వృద్ధికి మరింత ఊతమివ్వడం అనేది తీసుకోవలసిన రిస్క్ అనే ఏకాభిప్రాయాన్ని ఎమ్పిసిలో ప్రతిబింబిస్తుంది" అని జియోజిత్ ఇన్వెస్ట్మెంట్స్ లిమిటెడ్ చీఫ్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజిస్ట్ వికె విజయకుమార్ అన్నారు. ఎఫ్వై 26కి 7.3 శాతం జిడిపి వృద్ధి అంచనా మార్కెట్కు ఆశాజనకంగా ఉందని ఆయన తెలిపారు.
సెన్సెక్స్ సంస్థలలో, బజాజ్ ఫైనాన్స్, ఇన్ఫోసిస్, హెచ్సిఎల్ టెక్, బజాజ్ ఫిన్సర్వ్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ ప్రధాన లాభపడిన వాటిలో ఉన్నాయి.
అయితే, హిందుస్థాన్ యూనిలివర్, యాక్సిస్ బ్యాంక్, సన్ ఫార్మా మరియు టాటా స్టీల్ వెనుకబడిన వాటిలో ఉన్నాయి.
ఆటో, రియల్ ఎస్టేట్ వంటి రేటు,సెన్సిటివ్ స్టాక్స్ అధికంగా ట్రేడ్ అయ్యాయి.
ఎక్స్ఛేంజ్ డేటా ప్రకారం, గురువారం ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ (ఎఫ్ఐఐలు) రూ. 1,944.19 కోట్ల విలువైన ఈక్విటీలను విక్రయించగా, డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ (డిఐఐలు) రూ. 3,661.05 కోట్ల విలువైన స్టాక్స్ను కొనుగోలు చేశారు.
ఆసియా మార్కెట్లలో, దక్షిణ కొరియా కోస్పి, షాంఘై ఎస్ఎస్ఇ కాంపోజిట్ సూచీలు సానుకూల జోన్లో ట్రేడ్ అయ్యాయి. అయితే జపాన్ నిక్కీ 225 సూచీ, హాంగ్ కాంగ్ హ్యాంగ్ సెంగ్ సూచీ తక్కువగా కోట్ చేయబడ్డాయి.కాగా గురువారం యుఎస్ మార్కెట్లు ఫ్లాట్గా ముగిశాయి. ప్రపంచ చమురు ప్రమాణం అయిన బ్రెంట్ క్రూడ్ 0.16 శాతం తగ్గి బ్యారెల్కు 63.16 డాలర్లకు చేరుకుంది. అయితే గురువారం, సెన్సెక్స్ 158.51 పాయింట్లు లేదా 0.19 శాతం పెరిగి 85,265.32 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 47.75 పాయింట్లు లేదా 0.18 శాతం పెరిగి 26,033.75 వద్దకు చేరుకుంది. శుక్రవారం మార్కెట్ మరింత లాభాల జోరు అందుకుంది.
