
రాబోయే రోజుల్లో విద్యుత్ రంగంలో ఏఐది కీలకపాత్ర: మంత్రి మనోహర్ లాల్
కృత్రిమ మేధస్సు (ఏఐ), మెషీన్ లెర్నింగ్ (ఎంఎల్) ఆధారిత సాధనాలు భారత విద్యుత్ పంపిణీ వ్యవస్థను తెలివైన, వినియోగదారుడు కేంద్రంగా , అటోమేటిక్ గా ఆప్టిమైజ్ అయ్యే దిశగా మార్చనున్నాయని కేంద్ర విద్యుత్శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ అన్నారు.ఆదివారం భారత్ మండపం వేదికగా న్యూఢిల్లీ లో విద్యుత్ పంపిణీ రంగంలో ఏఐ/ఎంఎల్ వినియోగంపై జరుగుతున్న 2 రోజుల జాతీయ సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్మార్ట్ మీటర్ అనలిటిక్స్, డిజిటల్ ట్విన్స్, ప్రిడిక్టివ్ మెయింటెనెన్స్, విద్యుత్ చౌర్యం గుర్తింపు, అప్లయెన్సుల స్థాయి వినియోగ విశ్లేషణ, ఆటోమేటెడ్ అవుటేజ్ అంచనా, జెన్ ఏఐ ఆధారిత నిర్ణయ సహకారం ఇవన్నీ వినియోగదారుల అనుభవం, ఆపరేషనల్ సామర్థ్యాలలో విప్లవాత్మక మార్పులు తీసుకురాగలవు” అని మంత్రి తెలిపారు.
డిస్కంలపై ప్రశంస
మంత్రిత్వ శాఖ ప్రకటించిన వివరణ ప్రకారం, దేశవ్యాప్తంగా ఉన్న డిస్కంలు, పరిశ్రమలు, ఇన్నోవేటర్లు, విద్యా సంస్థల భాగస్వామ్యాన్ని ఆయన ప్రశంసించారు. ఆయా డిస్కంలు ప్రదర్శించిన ఏఐ/ఎంఎల్ పరిష్కారాలను అభినందించారు. డిస్కంలు అన్ని భాగస్వామ్య సంస్థలతో కలిసి నమ్మదగిన, వినియోగదారుడికి ప్రాధాన్యమిచ్చే విద్యుత్ పంపిణీ వ్యవస్థలను చేపట్టాలని ఆయన కోరారు. వినియోగదారులతో నమ్మకం పెంచుకోవడం, కొత్త టెక్నాలజీలపై ఉండే అపోహలను తొలగించడం కీలకమని చెప్పారు.
ఏఐ/ఎంఎల్ పరిష్కారాలు నమ్మకాన్ని పునరుద్ధరించడం, గృహాలకు తమ వినియోగాన్ని మెరుగ్గా నిర్వహించే అవకాశం కల్పించడం, విద్యుత్ అంతరాయాలను ముందుగానే నిరోధించడం, నిజాయితీ గల వినియోగదారులను చౌర్యం భారం నుంచి కాపాడటం, డిస్కంలకు నష్టాలను తగ్గించడం, విద్యుత్ కొనుగోలు ఖర్చులను ఆప్టిమైజ్ చేయడం, మరింత బలమైన మౌలిక సదుపాయాల్లో పునర్నివేశం చేయడం ద్వారా భారత్ను డిజిటల్ విద్యుత్ సంస్కరణలు, భవిష్యత్తు-సిద్ధమైన గ్రిడ్ పాలనలో ప్రపంచ నాయకుడిగా నిలపడానికి సహాయపడతాయని ఆయన అన్నారు.
సదస్సులో విద్యుత్ శాఖ కార్యదర్శి పంకజ్ అగర్వాల్ మాట్లాడుతూ డిస్కంలలో డిజిటలైజేషన్ను బలోపేతం చేయడం, కొలిచిన కార్యాచరణ ఆర్థిక మెరుగుదలలను అందించే ఏఐ/ఎంఎల్ పరిష్కారాలను అమలు చేయడం పట్ల మంత్రిత్వ శాఖ నిబద్ధతను కొనియాడారు.
సామర్థ్య నిర్మాణం, సురక్షిత డేటా భాగస్వామ్య ఫ్రేమ్వర్క్లు, ఇంటర్ ఆపరబిలిటీ దేశవ్యాప్తంగా ఈ ఆవిష్కరణలను స్కేల్ చేయడానికి అవసరమని ఆయన నొక్కి చెప్పారు.
జాతీయ ఇన్నోవేషన్ కాల్ — విజేతల ఎంపిక
సదస్సులో జాతీయ స్థాయి ఆవిష్కరణకు పిలుపు ఇవ్వగా డిస్కంలు, ఏఎంఐఎస్పీలు, టెక్నాలజీ ప్రొవైడర్లు, హోమ్ ఆటోమేషన్ ప్రొవైడర్ల నుంచి 195 దరఖాస్తులు వచ్చాయి. ప్రాథమిక స్క్రీనింగ్ తర్వాత 51 పరిష్కారాలను డిసెంబర్ 6న జ్యూరీ మూల్యాంకనం కోసం ఎంపిక చేశారు. వివరణాత్మక మూల్యాంకనం తర్వాత, డిస్కం విభాగంలో తమిళనాడు (టీఎన్పీడీసీఎల్), మధ్యప్రదేశ్ ఈస్ట్ , ఏఎంఐఎస్ విభాగంలో టాటా పవర్, అప్రావా, సొల్యూషన్ ప్రొవైడర్ విభాగంలో ప్రవాహ్, ఫ్లాక్ ఎనర్జీ, హోమ్ ఆటోమేషన్ విభాగంలో టాటా పవర్ ను విజేతలుగా ప్రకటించారు.
ఈ రోజు విజేతలు తమ ప్రెజెంటేషన్లు ఇచ్చారు. తమిళనాడు ఆదాయ రక్షణ కోసం అధునాతన స్మార్ట్ మీటర్ విశ్లేషణ, ఎంపీ ఈస్ట్ నష్టాలను తగ్గించేందుకు ఖచ్చితమైన వినియోగదారు ఇండెక్సింగ్, టాటా పవర్ ప్లస్, అప్రావా ఎనర్జీ వంటి ఏఎంఐఎస్ లు ప్రవర్తనా ఆధారిత డిమాండ్ రెస్పాన్స్ ఏఐ ఆధారిత కార్యాచరణ ఆటోమేషన్ వినియోగదారు-స్నేహపూర్వక శక్తి వినియోగ నియంత్రణ పరిష్కారాలను ప్రదర్శించారు.
విజేతలను విద్యుత్ మంత్రి సత్కరించి ఈ పరిష్కారాలను రాష్ట్రాల్లో స్కేల్ చేయాలని ప్రోత్సహించారు. మంత్రి మనోహర్ లాల్ ఈ సందర్భంగా స్టెల్లర్ (సీఈఏ అభివృద్ధి చేసిన) డిస్కంలకు దీర్ఘకాల సామర్థ్య ప్రణాళికలో సహాయం చేసే టూల్ను ప్రారంభించారు. భారత విద్యుత్ రంగం డిజిటల్ పునరుద్ధరణ దశలో ఉందని, దీన్ని వేగవంతం చేసేందుకు కేంద్రం కట్టుబడి ఉందని ఈ సమావేశం స్పష్టం చేసింది.
