Let's talk: editor@tmv.in
రాజకీయాల కోసమే మోహన్ లాల్ కు సత్కారం : కెసి వేణుగోపాల్

రాజకీయాల కోసమే మోహన్ లాల్ కు సత్కారం : కెసి వేణుగోపాల్

Gaddamidi Naveen
6 అక్టోబర్, 2025

అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) జనరల్ సెక్రటరీ కెసి వేణుగోపాల్ కేరళ ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఇటీవల దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అందుకున్న ప్రముఖ నటుడు మోహన్‌లాల్‌ను సత్కరించేందుకు త్రివేండ్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని ఎన్నికల ముందస్తు పబ్లిక్ రిలేషన్స్ వ్యాయామంగా ఉపయోగించారని విమర్శించారు.

వేణుగోపాల్ మాట్లాడుతూ మోహన్‌లాల్ వంటి గొప్ప నటుడిని గుర్తించడం చాలా మంచి విషయమని, కాంగ్రెస్ కూడా ఇప్పటికే అభినందనలు తెలిపిందని అయినప్పటికీ ఈ కార్యక్రమాన్ని రాజకీయ ప్రయోజనాలకు ఉపయోగించడం అసహ్యకరమని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రజలు మోహన్‌లాల్‌ను ఎంతో ప్రేమించి గౌరవిస్తారు కానీ ఈ కార్యక్రమం వెనుక ఉన్న రాజకీయ ప్రేరణ వల్ల దీనికి నష్టమైతుందని ఆయన అభిప్రాయపడ్డారు.

కేరళ ప్రభుత్వం తప్పుడు నిర్ణయాలతో ప్రజల్లో అసంతృప్తిని సృష్టించిందని, ఇప్పుడు ఇలాంటి కార్యక్రమాల ద్వారా తన వైఫల్యాలను దాచాలని చూస్తోందని వేణుగోపాల్ పేర్కొన్నారు. కాంగ్రెస్ నాయకులు ఈ సత్కార కార్యక్రమంలో పాల్గొనకపోవడంపై “నేతలను ఆహ్వానించారా అని నాకు తెలియదు. ఎవరు ఆహ్వానించబడ్డారో తెలుసుకున్న తర్వాతనే మనం ఇలాంటి వాటికి దూరంగా ఉంటామా లేదో స్పష్టం అవుతుందని పేర్కొన్నారు.

ఇటీవల పాంపాలో జరిగిన గ్లోబల్ అయ్యప్ప సంగమానికి కేరళ ప్రభుత్వం ప్రజా నిధులు వినియోగించడం కేరళ హైకోర్టు ఆదేశాలను ఉల్లంఘించడమని ఈ కార్యక్రమానికి సుమారు రూ. 8.5 కోట్లు ప్రభుత్వం ఖర్చు చేసినట్లు విమర్శించారు. వేణుగోపాల్ ఆరోపణల ప్రకారం ప్రభుత్వ చర్యలు ఒక తప్పు నుంచి మరొక తప్పిదానికి మారిపోతున్నాయని శబరిమల వంటి పవిత్ర ప్రదేశాలను రాజకీయ వివాదాలకు వేదికగా మార్చడం ద్వారా ప్రభుత్వం అసలు ఉద్దేశాలు బయటపడుతున్నాయని చెప్పారు.

ఇలాంటి వివాదాలను పుట్టకుండా, ప్రజా ఆమోదం పొందే విధంగా కార్యక్రమాలు నిర్వహించాల్సిందిగా ఆయన సూచించారు. “కేరళ సమాజం ప్రభుత్వం నిజమైన ఉద్దేశాలను త్వరగా ప్రజలు గుర్తించేది ఖాయం” అని ఆయన అభిప్రాయపడ్డారు.

రాజకీయాల కోసమే మోహన్ లాల్ కు సత్కారం : కెసి వేణుగోపాల్ - Tholi Paluku