Let's talk: editor@tmv.in
రాహుల్ గాంధీపై చిరాగ్ పాశ్వాన్ విమర్శలు

రాహుల్ గాంధీపై చిరాగ్ పాశ్వాన్ విమర్శలు

Pinjari Chand
26 సెప్టెంబర్, 2025

ఎన్నికల ప్రక్రియలో వస్తున్న అవకతవకలను తొలగించడానికే ఎలక్షన్​ కమిషన్​ స్పెషల్​ ఇంటెన్సివ్ రివిజన్(సర్)​ తీసుకువచ్చిందని కేంద్రమంత్రి చిరాగ్​ పాశ్వాన్​ అన్నారు. ఈ సమస్యను పరిష్కరించడానికే ఈసీ పని చేస్తుందని, రాజ్యాంగబద్ధమైన సంస్థపై పదేపదే విమర్శలు చేయడం సరికాదన్నారు. గురువారం విలేకరులతో మాట్లాడుతూ రాహుల్​ గాంధీ మాట్లాడిన ప్రతిసారి ‘సర్​’ గురించి మాట్లాడుతారు. పదే,పదే ఓటరు జాబితాలోని అక్రమాలను గురించి చెబుతుంటారు. వాటిని సరి చేయడానికే సర్ ను తీసుకొచ్చారని, మీరే అక్రమాలు జరిగాయని ఫిర్యాదు చేస్తారు. మళ్లీ సవరణ చేస్తున్నారని ఆరోపిస్తారు. సమస్యను పరిష్కరిస్తే మీకు ఏదో సమస్య వస్తుందనే ఈ విధంగా ఆరోపణలు చేస్తున్నారని అనుమానం వ్యక్తం చేశారు. ఏదైనా సమస్య ఉంటే దానిని పరిష్కరించడానికి చట్టాలు ఉన్నాయి. కానీ కేవలం ఆరోపణలు చేయడం ఎంతమాత్రం సరికాదన్నారు.

అణుబాంబా? హైడ్రోజన్​ బాంబా?

ఇటీవల రాహుల్​ గాంధీ ఢిల్లీలో విలేకరుల సమావేశం నిర్వహించి ప్రధాన ఎన్నికల కమిషనర్ అయిన జ్ఙానేశ్​ కుమార్ పై లేనిపోని ఆరోపణలు చేశారు. ఓటు దొంగలను రక్షిస్తున్నారని మాట్లాడారు. అలాగే మహదేవ్​ పుర నియోజకవర్గంలో ఓట్ల చోరీ జరిగిందని చూపించి ఇది అణుబాంబు అని, ప్రస్తుతం హైడ్రోజన్​ బాంబు ప్రయోగిస్తానని లేనిపోని కబుర్లు చెబుతున్నారని అన్నారు. అలాగే రాహుల్ గాంధీ వేసే బాంబు పేలినప్పుడే ఆది అణుబాంబా? హైడ్రోజన్​ బాంబా అని తెలిసేది అని చురకలంటించారు.

రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలు

ఓటర్ జాబితాలో ఏ విధంగా నకిలీ ఓటర్లను చేర్చారో, ఉన్న ఓటర్లను ఏ విధంగా తొలగించారన్నది రాహుల్​ గాంధీ ఇంతకుముందే వివరించారు. ఇందుకు ప్రధానంగా ఈసీనే సహకరిస్తుందని విమర్శలు చేశారు. ఓట్​ చోరీకి పాల్పడుతున్న వారిని కమిషనర్​ జ్ఙానేశ్​ కుమార్ రక్షిస్తున్నారని ఆరోపించారు. తన వద్ద రుజువులున్నాయని రాహుల్​ తెలిపారు. అలాగే కర్ణాటకలోని అలంద్​ నియోజకవర్గంలో 6 వేల ఓటర్లను తొలగించారని వివరించారు.

రాహుల్ గాంధీపై చిరాగ్ పాశ్వాన్ విమర్శలు - Tholi Paluku