
మలేషియా టూర్కు హాకీ జట్టు ఇదే!
తొలిపలుకు, క్రీడా వార్తలు, సెప్టెంబర్ 24:* మలేషియాలో జరగనున్న సుల్తాన్ ఆఫ్ జోహార్ కప్ 2025 కోసం హాకీ ఇండియా 18 మంది సభ్యులతో కూడిన భారత జూనియర్ పురుషుల హాకీ జట్టును ప్రకటించింది. హాకీ ఇండియా వెబ్సైట్ ప్రకారం, డిఫెండర్ రోహిత్ను కెప్టెన్గా నియమించారు.
ఈ జట్టులో గోల్కీపర్లు బిక్రమ్జిత్ సింగ్, ప్రిన్స్దీప్ సింగ్ ఉన్నారు. డిఫెండర్లుగా రోహిత్, తలెమ్ ప్రియోబర్త, అన్మోల్ ఎక్క, అమీర్ అలీ, సునీల్ పిబి, రవ్నీత్ సింగ్ ఉన్నారు. మిడ్ఫీల్డర్లుగా అంకిత్ పాల్, థౌనావోజం ఇంగలేంబా లువాంగ్, అద్రోహిత్ ఎక్క, అరాజీత్ సింగ్ హుండల్, రోసన్ కుజూర్, మన్మీత్ సింగ్ ఉన్నారు. అలాగే, ఫార్వర్డ్లుగా అర్ష్దీప్ సింగ్, సౌరభ్ ఆనంద్ కుష్వాహా, అజీత్ యాదవ్, గుర్జోత్ సింగ్ ఉన్నారు.
భారత జూనియర్ మెన్స్ హాకీ జట్టు కోచ్ పి.ఆర్.శ్రీజేష్ మాట్లాడుతూ, "సుల్తాన్ ఆఫ్ జోహార్ కప్ కోసం జట్టు బాగా సిద్ధమైంది. జూనియర్ వరల్డ్ కప్ కూడా రాబోతున్నందున, ఈ టోర్నమెంట్ ఆటగాళ్లకు బలమైన ప్రత్యర్థులతో పోటీపడటానికి, అంతర్జాతీయ అనుభవాన్ని పొందేందుకు ఒక మంచి వేదికగా ఉంటుంది. మలేషియాలో మంచి ప్రదర్శన ఇవ్వడానికి మేము ఎదురుచూస్తున్నాం' అని అన్నారు.
గత టోర్నమెంట్లో భారత్ కాంస్య పతకం గెలుచుకుంది. ఈ సంవత్సరం ఆ ప్రదర్శనను మెరుగుపరచాలని లక్ష్యంగా పెట్టుకుంది. అక్టోబర్ 11న గ్రేట్ బ్రిటన్తో భారత్ తమ టోర్నీని ప్రారంభిస్తుంది. ఆ తర్వాత అక్టోబర్ 12న న్యూజిలాండ్తో తలపడనుంది. అనంతరం అక్టోబర్ 14న పాకిస్థాన్తో, అక్టోబర్ 15న ఆస్ట్రేలియాతో తలపడి, అక్టోబర్ 17న ఆతిథ్య మలేషియాతో తమ రౌండ్-రాబిన్ దశను ముగిస్తుంది. పట్టికలో మొదటి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు అక్టోబర్ 18న ఫైనల్ పోరులో తలపడతాయి.
జట్టు వివరాలు
గోల్కీపర్లు: బిక్రమ్జిత్ సింగ్, ప్రిన్స్దీప్ సింగ్; డిఫెండర్లు: రోహిత్ (కెప్టెన్), తలెమ్ ప్రియోబర్త, అన్మోల్ ఎక్క, అమీర్ అలీ, సునీల్ పి బి, రవ్నీత్ సింగ్; మిడ్ఫీల్డర్లు: అంకిత్ పాల్, థౌనావోజం ఇంగలేంబా లువాంగ్, అద్రోహిత్ ఎక్క, అరాజీత్ సింగ్ హుండల్, రోసన్ కుజూర్, మన్మీత్ సింగ్; ఫార్వర్డ్లు: అర్ష్దీప్ సింగ్, సౌరభ్ ఆనంద్ కుష్వాహా, అజీత్ యాదవ్, గుర్జోత్ సింగ్; స్టాండ్బై: వివేక్ లక్రా, శర్దానంద్ తివారీ, థోక్చోమ్ కింగ్సన్ సింగ్, రోహిత్ కుల్లు, దిల్రాజ్ సింగ్
