
బీసీ వర్గాలకు ఇచ్చిన హామీకి ప్రభుత్వం కట్టుబడి ఉంది : మంత్రి వాకిటి శ్రీహరి
మంత్రి వాకిటి శ్రీహరి బీసీ రిజర్వేషన్లకు ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ఆయన మాట్లాడుతూ బీసీ రిజర్వేషన్ల పెంపు విషయంలో ఏ పరిస్థితిలోనైనా ప్రభుత్వం వెనక్కి తగ్గదు అని పేర్కొన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించడం ప్రభుత్వ లక్ష్యం అంటూ తెలిపారు. అలాగే, బీసీల నోటికాడి ముద్దను కొన్ని పార్టీలు, ముఖ్యంగా బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు అడ్డుకుంటున్నాయని, వారు బీసీ ద్రోహులుగా చరిత్రలో నిలబడతారని మంత్రి వాకిటి శ్రీహరి హెచ్చరించారు.
నోటిఫికేషన్ ఇవ్వడం లేదంటే బీసీ సమాజం దీన్ని అంగీకరించదని కూడా ఆయన స్పష్టం చేశారని తెలిపారు. అలాగే బీసీ రిజర్వేషన్ల కోసం ప్రభుత్వం అన్ని స్థాయిల్లో పోరాడుతోందని, ఇరు కోర్టులలో కూడా ఈ కేసులో బలంగా వాదనలు చేస్తున్నారని బీసీలకు ఇచ్చిన మాటను ప్రభుత్వం నిలబెట్టుకోవాలని, చట్టపరంగా, రాజకీయంగా ఈ హామీపై కట్టుబడి ఉందని చెప్పారు. ముఖ్యంగా ఈ విషయంలో బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు భాగముగా ఉంటూ బీసీ రిజర్వేషన్లకు అనుకూలంగా ఉండాలని, లేకపోతే చరిత్రలో బీసీ ద్రోహులుగా మిగిలిపోతారని మంత్రి స్పష్టంగా పేర్కొన్నారు.
గతంలో భారత సుప్రీంకోర్టు ఇంద్ర శావినే (1992) వంటి కేసుల్లో బీసీ రిజర్వేషన్లపై కొన్ని తీర్పులు వెలువరించింది. సాధారణంగా వర్గీయ రిజర్వేషన్ల మొత్తం 50 శాతం మించి హక్కుగా, చట్టబద్ధంగా ఉండకూడదని తెలిపింది. ఎన్నికల సంబంధంగా, స్థానిక సంస్థల రిజర్వేషన్లను నియంత్రించే రాజ్య చట్టాలు (ఉదా: తెలంగాణ పంచాయతి రాజ్ చట్టం, స్థానిక షెడ్యూల్ గణనలు) ఉన్నాయి. అలాగే, ప్రారంభంగా రాష్ట్ర చట్టాల పరిధిలో ఉండే సెక్షన్ 285A తెలంగాణ పంచాయితీ రాజ్ చట్టం 2018లో సర్వ్ రిజర్వేషన్ పరిమితుల పరిమాణం పేర్కొంది. ప్రస్తుతం 42 శాతం రిజర్వేషన్ అమలులో లేదు, హైకోర్టు స్టే ఉన్నది. తెలంగాణ ప్రభుత్వం బీసీలకై 42 శాతం రిజర్వేషన్ల కేటయించాలని చూస్తుంది. ఇది ఎంతమైరకు అమలు అవుతుందా? నాయ్యస్థానం ఈ నెల 12న ఏ తీర్పు ఇస్తుందనేది వేచి చుడాలి.
