Let's talk: editor@tmv.in
బీజాపూర్‌లో ఎన్‌కౌంటర్‌:ఆరుగురు మావోయిస్టులు హతం

బీజాపూర్‌లో ఎన్‌కౌంటర్‌:ఆరుగురు మావోయిస్టులు హతం

Pinjari Chand
12 నవంబర్, 2025

దండకారణ్యం కాల్పులతో దద్దరిల్లింది. భద్రతా దళాలు చేపట్టిన ఆపరేషన్ కగార్ ముమ్మరంగా సాగుతోంది. మంగళవారం చత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలోని బీజాపూర్‌ జిల్లాలో భద్రతా దళాలు చేపట్టిన మావోయిస్టలకు వ్యతిరేకంగా చేపట్టిన ఆపరేషన్‌లో ఆరుగురు మావోయిస్టులు మరణించారు. ఈ రోజు ఉదయం మొదలైన ఈ ఆపరేషన్‌ ఇంకా కొనసాగుతోందని అధికారులు తెలిపారు. బీజాపూర్‌ జిల్లా మోడక్‌పాల్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని కందుల్నార్‌ గ్రామానికి పశ్చిమాన సుమారు ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్న అడవిలో భద్రతా దళాలు మావోయిస్టులతో ఎదురుకాల్పులు జరిపాయి. ఈ ఘటనలో ఆరుగురు మరణించారు. మావోయిస్టుల మృతదేహాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

మృతుల గుర్తింపు ప్రక్రియ కొనసాగుతుండగా సంఘటన స్థలంలో దొరికిన ఆయుధాలను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ప్రాంతంలో ఇంకా మావోయిస్టులు దాగి ఉన్నారనే అనుమానంతో సెర్చ్‌, కూంబింగ్‌ ఆపరేషన్లు కొనసాగుతున్నాయని అధికారులు వెల్లడించారు.

బీజాపూర్‌ పోలీసుల ప్రకారం జిల్లాలో పలు సెక్యూరిటీ ఫోర్సుల బృందాలు ప్రస్తుతం యాక్టివ్‌గా యాంటీ-నక్సల్‌ ఆపరేషన్లలో పాల్గొంటున్నాయని తెలిపారు. ఇక్కడ మావోయిస్టులందరినీ పూర్తిగా నిర్మూలించే వరకు ఆపరేషన్‌ కొనసాగుతుందని సెక్యూరిటీ వర్గాలు పేర్కొన్నాయి.

బీజాపూర్‌లో ఎన్‌కౌంటర్‌:ఆరుగురు మావోయిస్టులు హతం - Tholi Paluku