
బీహార్ ఎన్నికల షెడ్యూల్ పై ఊహగానాలు
దేశం దృష్టంతా త్వరలో జరగబోయే బీహార్ ఎన్నికలపైనే ఉంది. ఎందుకంటే ఎవరైతే బీహార్, ఉత్తరప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో విజయం సాధిస్తారో,తరువాత జరిగే లోక్సభ ఎన్నికల్లో సత్తా చాటుతారని ఓ నమ్మకం ఉంది. దీంతో రాష్ట్రంపై పట్టు కోసం ఆయా కూటములు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ సందర్బంగా రాష్ట్రంలో జరిగే ఎన్నికల షెడ్యూల్పై రకరకాల ఊహగానాలు బయల్దేరాయి. ఎలక్షన్ కమిషన్ కంటే ముందుగానే మీడియా ప్రతినిధులు తారీఖులు, విడతలతో సహ చేప్పేస్తున్నారు. అయితే అక్టోబర్లో జరగుతాయని కొన్ని, నవంబర్లోపు జరుగుతాయని ఇంకొన్ని చెబుతున్నాయి. దీంతో ప్రజలు గందరగోళంలో పడిపోతున్నారు. ఎన్నికల నిర్వహణపై తేదీలపై అస్పష్టత కారణంగా ప్రజలు తమ వివాహా, తదితర శుభకార్యాలు వాయిదా వేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
అక్టోబర్, నవంబర్ నెలల్లో శుభకార్యాలు అధికం
వర్షాకాలం ముగిసి శీతాకాలం ప్రవేశిస్తున్న సమయంలో ఎక్కువగా అనందభరితమైన కార్యక్రమాలను నిర్వహించుకుంటారు. అత్యధికంగా ఈ కాలంలోనే బీహార్ తదితర ఉత్తరాది రాష్ట్రాల్లో ఎక్కువగా ప్రజలు అక్టోబర్, నవంబర్ నెలల్లోనే వివాహ తదితర శుభకార్యాలను నిర్ణయించుకుంటారు. ఇంటిల్లిపాది ఓ సంబురంలా నిర్వహించుకుంటారు. దాదాపు 5 రోజులకు పైగా పెళ్లి కార్యక్రమాలు నిర్వహించుకుంటారు. అయితే రానున్న ఎన్నికల వలన వాటిని వాయిదా వేసుకునే పరిస్థితి ఏర్పడింది. ప్రచారం పర్వం ఉదృతంగా ఉండడం, అలాగే నాయకుల తాకిడి, వారితోబాటే కార్యకర్తల రాక అలాగే ఉంటుంది. దీంతో ఆ సమయంలో వివాహాలు, తదితర కార్యక్రమాల ఖర్చు కూడా బాగా పెరిగిపోతుంది.
అలాగే రానున్న అక్టోబర్ మాసంలో బీహార్ వాసులు అత్యంత వైభవంగా నిర్వహించుకునే పండుగ ఛఠ్ పూజ సంబురాలు ఉన్నాయి. దీంతో పెద్ద ఎత్తున భక్తులు ఆలయాలకు వస్తుంటారు. దీంతో అక్కడ భద్రతా చర్యలు చేపట్టడం కష్టంగా మారే అవకాశం ఉంది.
మీడియా సంస్థల అంచనాలు
ఇటీవల కొన్ని జాతీయ మీడియా సంస్థలు అక్టోబర్లో మూడు విడతల్లో ఎన్నికలుంటాయని పేర్కొంది. మరో సంస్థ నవంబర్ 5–15 మధ్య ఎన్నికల నిర్వహణ ఉంటుందని తేల్చాయి. మరో సంస్థ రెండు విడతల్లో ఉంటాయని జోస్యం చెప్పింది. అయితే వాటిపై ఓ ప్రణాళిక ప్రకారం వార్తలు రాయడం మంచిదే కానీ ఇలా ప్రజలను అయోమయానికి గురి చేస్తుండడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో ఆర్థిక కార్యాకలపాల నిర్వహణ కష్టంగా మారింది. అయితే ఇటువంటి ఊహజనితమైన వార్తలను విశ్వసించరాదని ఎలక్షన్ కమిషన్ ప్రకటించే తేదీలే మనం చూసుకోవాలని తెలిపారు.
