Let's talk: editor@tmv.in
ప్రవక్త పై ప్రేమను చూపాల్సిన అవసరం లేదు

ప్రవక్త పై ప్రేమను చూపాల్సిన అవసరం లేదు

Pinjari Chand
29 సెప్టెంబర్, 2025

ప్రవక్త పై ప్రేమను ప్రత్యేకంగా చూపించాల్సిన అవసరం లేదని, మసీదులలో నమాజ్​ తరువాత మిగతా ఏ కార్యక్రమాన్ని నిర్వహించవద్దని కాంగ్రెస్​ ఎంపీ ఇమ్రాన్​ మసూద్​ ముస్లిం సమాజాన్ని కోరారు. ప్రస్తుతం ‘ఐ లవ్​ ముహమ్మద్’ పేరుతో కొంతమంది మత విద్వేషాలు రెచ్చగొడతున్నారని వాపోయారు. ఉత్తరప్రదేశ్‌లోని బరేలీలో వెలువెత్తిన నిరసనల వల్ల సమాజం విచ్చిన్నమవుతుందని సూచించారు. ఇస్లామిక్​ పండితులు ఈ నిరసనలపై ఆలోచించాలని, మసీదుల్లో నమాజులు తప్పా మిగతావి చేయడాన్ని ఆపమని అభ్యర్థించారు.

తప్పుదారి పట్టకండి

ఈ సందర్భంగా ముస్లిం సమాజాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడారు. కొన్ని గ్రూపులు ప్రజలను రెచ్చగొడుతున్నాయి. నాటకమాడుతున్నాయి. ద్వేషాన్ని వ్యాప్తి చేస్తున్నాయి. ప్రజలు బయటకు ఎందుకొస్తున్నారు. ఈ విద్వేషాల వ్యాప్తి వెనుక కుట్రలు జరుగుతున్నాయని హెచ్చరించారు. దయచేసి తప్పుదారి పట్టకండి. ఈ పని సరైంది కాదు. పోలీసులు మిమ్మల్ని కొట్టినప్పుడు జాలిపడరు. కాల్చినప్పుడు బాధపడరని తెలిపారు. నమాజ్​ తరువాత ప్రవక్త ముహమ్మద్​ పై ప్రేమ చూపించాల్సిన అవసరం లేదని, మీరు ముస్లిం అయినప్పుడే ముహమ్మద్​ పై ప్రేమ ఉందని ఆర్థం అన్నారు. అయినా ప్రవక్త పై ప్రేమలేని ముస్లిం లేడు. ఆయనపై ప్రేమ లేకుండా ఎప్పటికీ ముస్లిం కాలేడని గుర్తు చేశారు. ప్రవక్త పై ప్రేమ అంటే ఆయన సూచించిన మార్గంలో నడవడమని ఎంపీ మసూద్​ అన్నారు. ప్రవక్తను ప్రేమించడం అంటే నిరసనలు తెలపడం కాదని, ఇది సరైన పద్ధతి కాదన్నారు. ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత ధార్మిక వేత్తలపై ఉందని గుర్తు చేశారు. మసీదుల్లో నమాజులు మాత్రమే చదవాలని ఈ సందర్భంగా మరోసారి వివరించారు.