
ప్రజలను మూర్ఖులనుకుంటున్నారా?
ఆసియా కప్పై బీజేపీ నాటకాలు ఆడుతుందని, పదిహేను రోజుల క్రితం సీరిస్ ప్రారంభంలో పాకిస్థాన్ మంత్రి మొహిసిన్ నఖ్వీతో కరచాలనం చేసి,నవ్వతూ ఫోటోలు దిగిన క్రికెటర్లు ఇప్పడెందుకు జాతీయవాద డ్రామాలు ఆడుతున్నారు. ప్రజలను మూర్ఖులుగా భావిస్తున్నారా? అని శివసేన(యూబీటీ) ఎంపీ సంజయ్రౌత్ ప్రశ్నించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన బీజేపీ, ఇండియన్ టీం పై తీవ్రమైన ఆరోపణలు చేశారు. నిజమైన దేశభక్తులు నిన్నటి మ్యాచ్ ను చూడలేదని, నకిలీ బీజేపీ దేశభక్తుల గురించి నాకు తెలియదని బీజేపీ నాయకులకు చురకలంటించారు. టోర్నమెంట్ కు ముందు ఇండియన్ కప్టెన్ సూర్యకుమార్యాదవ్ పీసీబీ(పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ) చీఫ్తో కరచాలనం చేశారని అందుకు సంబంధించిన ఓ వీడియోను ఈ సందర్భంగా ఎంపీ సంజయ్ రౌత్ ఎక్స్లో షేర్ చేశారు. ఇప్పడు ట్రోఫీ తీసుకోలేదు. షేక్ హ్యండ్ చేయలేదని డ్రామాలు ఎందుకు ఆడుతున్నారు. అంతర్జాతీయ మీడియా ముందు ఎందుకు కలరింగ్ ఇస్తున్నారు. నిజంగా మీలో దేశభక్తి ఉంటే మ్యాచ్లు ఎందుకు ఆడారు. దేశభక్తి మీ రక్తంలో ఉంటే పాకిస్థాన్ తో ఎందుకు తలపడ్డారని దుయ్యబట్టారు. ఇకనైనా మీ నాటకాలకు తెరదింపండన్నారు. పహాల్గాం ఉగ్రదాడిలో మరణించిన ప్రజలను, అమరులైన సైనికులను అవమానించకూడదని భావిస్తే ఈ టోర్నమెంట్లో పాల్గొనే వారే కాదన్నారు.
ఐసీసీ చైర్మన్ జై షా ఏం చేస్తున్నారు
కేంద్ర హోంమంత్రి అమిత్షా కుమారుడైన జైషా ఐసీసీ చైర్మన్గా ఉన్నారు. పహాల్గాం దాడికి బదులుగా ఆసియాకప్ టోర్నీ నుంచి పాకిస్థాన్ను ఎందుకు బహిష్కరించలేదని మహారాష్ట్ర కాంగ్రెస్ అధికార ప్రతినిధి అతుల్ లోండే పాటిల్ ప్రశ్నించారు. ఈ మ్యాచ్లు ఐసీసీ నిర్వహించిందని అమిత్షా అంటున్నారు. అక్కడ అధ్యక్షుడిగా ఉన్నది తన కోడుకే కదా ఎందుకు పాకిస్థాన్ను తొలగించలేదన్నారు. ఆపరేషన్ సింధూర్ ముగిసిందా? లేకుంటే క్రికెట్ మ్యాచ్ గెలవగానే ఆపరేషన్ లో భాగమని చెబుతారా? ఇరు దేశాల మధ్య సంబంధాలను కొనసాగించడానికి మ్యాచ్లు ఆడారా? లేక డబ్బు కోసమే ఇదంతా డ్రామాలు జరుగుతున్నాయా అని తీవ్ర వ్యాఖ్యలు చేయడంతో ఆసియాకప్ వివాదం రాజకీయరంగు పులుముకుంది.
