
నేషనల్ పారా స్విమ్మింగ్ ఛాంపియన్షిప్స్లో హిమాన్షు నందాల్ హ్యాట్రిక్ గోల్డ్
భారతదేశ పారా స్విమ్మింగ్ స్టార్ హిమాన్షు నందాల్, నవంబర్ 15 నుండి 18 వరకు హైదరాబాద్లో జరిగిన నేషనల్ పారా స్విమ్మింగ్ ఛాంపియన్షిప్స్లో ఆధిపత్యం ప్రదర్శించాడు. ఆయన ఎస్11 కేటగిరీలో (100 శాతం దృష్టి లోపం) మూడు బంగారు పతకాలు గెలుచుకోవడంతో పాటు, తన అసాధారణమైన ఆల్-రౌండ్ ప్రదర్శనకు గాను ప్రతిష్టాత్మక 'బెస్ట్ స్విమ్మర్ అవార్డు'ను కూడా దక్కించుకున్నాడు.
మూడు ఈవెంట్లలో స్వర్ణ పతకాలు
సాంకేతికంగా సవాలుతో కూడిన మూడు ఈవెంట్లలో హిమాన్షు అసాధారణ వేగం, క్రమశిక్షణ, నియంత్రణను ప్రదర్శించాడు. 50 మీ ఫ్రీస్టైల్ ఈవెంట్ ను 30.22 సెకన్లలో పూర్తి చేసి బంగారు పతకాన్ని గెలుచుకున్నాడు. 100 మీ బ్రెస్ట్స్ట్రోక్ ఈవెంట్ లో ఈత కొలను అంచును 1:23.78 వద్ద తాకి, మరో అద్భుత విజయాన్ని అందుకున్నాడు. 100 మీ బ్యాక్స్ట్రోక్ ఈవెంట్ లో సుమారు 1:14.00 సమయాన్ని నమోదు చేసి, నిర్ణయాత్మక విజయంతో తన గోల్డెన్ హ్యాట్రిక్ను పూర్తి చేశాడు.
హిమాన్షు నేపథ్యం
2004 మే 25న హర్యానాలోని రోహ్తక్లో జన్మించిన హిమాన్షు, ఆప్టిక్ నర్వ్ వైఫల్యం కారణంగా పుట్టుకతోనే దృష్టి లోపం కలిగి ఉన్నాడు. క్రీడా నేపథ్యం ఉన్న కుటుంబం నుండి వచ్చిన హిమాన్షు, జాతీయ స్థాయి జూడో నుండి 2021లో పారా స్విమ్మింగ్కు మారారు. అప్పటి నుండి అతడు అనేక జాతీయ రికార్డులను నెలకొల్పాడు. హాంగ్జౌలో జరిగిన 4వ ఆసియా పారా గేమ్స్లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించాడు. పారిస్ 2024 పారాలింపిక్స్కు కనీస అర్హత స్కోరు సాధించిన మొదటి భారతీయ అంధ ఈతగాడిగా నిలిచాడు. అంతేకాక 2025 ప్రపంచ పారా స్విమ్మింగ్ ఛాంపియన్షిప్స్లో రెండు ఫైనల్స్కు చేరుకున్నాడు. హైదరాబాద్లో హిమాన్షు ప్రదర్శన, భవిష్యత్తులో దేశానికి పతకాలు సాధించగల అత్యంత ఆశాజనకమైన పారా అథ్లెట్గా అతడి స్థానాన్ని మరింత పటిష్టం చేసింది.
