
దక్షిణ కొరియాలో సంచలనం సైబర్ ముఠా నాయకుడికి జీవితఖైదు
దక్షిణ కొరియాను కుదిపేసిన ఘోర సైబర్ లైంగిక దోపిడీ కేసులో ప్రధాన నిందితుడు కిమ్ నాక్–వాన్ (33)కు సియోల్ సెంట్రల్ జిల్లా కోర్టు జీవిత ఖైదు విధించింది. సుమారు నాలుగేళ్ల పాటు సాగిన ఈ దారుణ ఘటనలో 261 మంది మహిళలు ఉన్నారు. వీరిలో మైనర్లు కూడా లైంగికంగా దోపిడీకి గురయ్యారు. దీంతో ఈ కేసు కొరియా వ్యాప్తంగా సంచలనం రేకేత్తించింది. ఈ సందర్భంగా కోర్టు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ ఈ నేరస్థుడిని సమాజం నుంచి శాశ్వతంగా బహిష్కరించాల్సిందే అని వ్యాఖ్యానించింది. కేసులో నిందితులుగా ఉన్న మిగతా 10 మందికి రెండేళ్ల నుంచి నాలుగేళ్ల వరకు జైలు శిక్షలు పడగా, వారిలో ఐదుగురు మైనర్లే ఉండటం ఆందోళన కలిగించే విషయంగా ఉంది.
బ్లాక్మెయిల్ కోసం టెలిగ్రామ్ ముఠా
కోర్టు వెల్లడించిన వివరాల ప్రకారం 2020 ఆగస్ట్ నుంచి నాక్వాన్ టెలిగ్రామ్ యాప్లో పిరమిడ్ తరహా బ్లాక్మెయిల్ నెట్వర్క్ను నడిపాడు. సోషల్ మీడియాలో సెక్సువల్ కంటెంట్ పెట్టిన మహిళలను, అలాగే డీప్ఫేక్ వీడియోలు షేర్ చేసే చాట్ రూమ్లలో ప్రవేశించాలనుకున్న పురుషులను టార్గెట్ చేశాడు. వాటిని బయటపెడతామని బెదిరించి కొత్త బాధితులను రప్పించమని ఒత్తిడి చేసేవాడు.ఇలా పిరమిడ్ తరహ నెట్వర్క్ ను సృష్టించాడు.
14 మంది మైనర్లపై అత్యాచారం
ఈ ఘటనలో మరింత దారుణ విషయమేమంటే 14 మంది మైనర్లపై కూడా అత్యాచారం జరగడం. నాక్వాన్ తన దుష్ట కార్యకలాపాల్లో భాగంగా 16 మందిపై అత్యాచారం, శారీరకంగా దాడులు చేశాడు. వారిలో 14 మంది మైనర్లే ఉండడం గమనర్హం. 13 కేసుల్లో తను లైంగిక దాడులు చేసిన వీడియోలను కూడా రికార్డ్ చేశాడు. అదేవిధంగా మొత్తం 1,700కు పైగా లైంగిక దోపిడీకి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సృష్టించాడు. వీటిలో 260 చిత్రాలను ఆన్లైన్లో విస్తృతం చేసి బాధితులను మరింతగా బెదిరించాడు. కొంతమంది బాధితుల కుటుంబ సభ్యులు, సహోద్యోగులు కూడా బ్లాక్మెయిల్కు గురయ్యారు.
ఫోటోలు బయటకు వస్తాయనే భయంతో
తమ ఫోటోలు ఆన్ లైన్ లో బయటకు వస్తాయనే భయంతోనే సహ నిందితులు ఇతర మైనర్లను బలవంతంగా రప్పించారని కోర్టు వివరించింది. బాధితులలో ఎక్కువ మంది పిల్లలు, యుక్తవయస్కులు, నేరాల ఫలితంగా వారు తీవ్ర శారీరక, మానసిక బాధను అనుభవించినట్లు కనిపిస్తోందని కోర్టు ఒక ప్రకటనలో తెలిపింది.
‘డిజిటల్ క్రైమ్స్ – శాశ్వత నష్టం’
డిజిటల్ లైంగిక నేరాలు డిజిటల్ ప్రదేశంలో బాధితులకు శాశ్వత గాయాలను మిగులుస్తాయి. లైంగిక దోపిడీకి సంబంధించిన వివరాలు పంపిణీ చేసిన తర్వాత, వాటిని పూర్తిగా తొలగించడం చాలా కష్టం, ఆ నష్టం నుంచి కోలుకోవడం ఆచరణాత్మకంగా అసాధ్యం.
ఐదేళ్లలో రెండో అతిపెద్ద కేసు
జనవరిలో కిమ్ అరెస్టు తర్వాత అతని నేరాలు బయటపడటం, డిజిటల్ టెక్నాలజీల వల్ల లైంగిక హింస ప్రమాదం పెరుగుతుండటం పట్ల ప్రజల్లో దిగ్భ్రాంతి, ఆందోళనను రేకెత్తించింది. మైనర్లతో సహా డజన్ల కొద్దీ మహిళలను లైంగిక అసభ్యకరమైన వీడియోలను చిత్రీకరించమని బ్లాక్మెయిల్ చేసి ఇతరులకు విక్రయించాడనే ఆరోపణలపై చో జు-బిన్కు అదే కోర్టు 40 సంవత్సరాల జైలు శిక్ష విధించిన దాదాపు ఐదు సంవత్సరాల తర్వాత సోమవారం తీర్పు వెలువడింది.
