Let's talk: editor@tmv.in
తెలంగాణ సచివాలయంపై నో ఫ్లై జోన్

తెలంగాణ సచివాలయంపై నో ఫ్లై జోన్

Gaddamidi Naveen
20 సెప్టెంబర్, 2025

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్‌లోని సచివాలయ పరిసర ప్రాంతాలను నో ఫ్లై జోన్‌గా ప్రకటించింది. ఈ నిర్ణయం ప్రధానంగా భద్రతా కారణాల దృష్ట్యా తీసుకున్న చర్యగా పేర్కొంది. ముఖ్యంగా ముఖ్యమంత్రి, మంత్రులు, ఉన్నతాధికారులు పనిచేసే ప్రదేశంగా సచివాలయం కీలకమైన పరిపాలనా కేంద్రం కావడం వల్ల డ్రోన్ల‌కు అనుమ‌తిలేదు. ఈ మేర‌కు ఆర్ అండ్ బీ శాఖ తాజాగా ఉత్త‌ర్వులు జారీచేసింది. దీంతో స‌చివాల‌యం చుట్టూ డ్రోన్ల ఎగ‌ర‌వేత పూర్తిగా నిషేధం కానుంది.

నో ఫ్లై జోన్ అనేది ఒక ప్రాంతం పైభాగంలో ఎటువంటి విమానాలు లేదా ఎయిర్ క్రాఫ్ట్‌లు ప్రయాణించరాని ప్రాంతంగా గుర్తించబడుతుంది. రాష్ట్రంలో బ‌తుకమ్మ పండ‌గ వేడుక‌ల సంద‌ర్భంగా భ‌ద్ర‌తా చర్యలను న‌గ‌రంలో కట్టుదిట్టంగా చేసేందుకు ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రజలు కూడా ఈ నిర్ణయానికి సహకరించడం అవసరం. ఇందుకోసం ప్ర‌త్యేకంగా ‘నో ఫ్లై జోన్ ఫర్ డ్రోన్స్’ అనే సైన్ బోర్డులు ఏర్పాటు చేయాల‌ని సంబంధిత అధికారుల‌కు ఆదేశాలు జారీ చేశారు.

తెలంగాణ సచివాలయంపై నో ఫ్లై జోన్ - Tholi Paluku