Let's talk: editor@tmv.in
తేజస్వీ యాదవ్ పర్యటనలో భద్రతాలోపం

తేజస్వీ యాదవ్ పర్యటనలో భద్రతాలోపం

Pinjari Chand
15 సెప్టెంబర్, 2025

ఆర్జేడీ నాయకుడు తేజస్వీయాదవ్​ కు అనుకోని సంఘటన ఎదురైంది. హెలికాప్టర్​ ఎక్కేందుకు సిద్ధమయ్యే సమయంలో ఓ యువకుడు దూసుకొచ్చి ఆయనను కలిశారు. కలిసిందే కాకుండా కాళ్లపై పడ్డాడు. దీంతో ఆయన ఒక్కసారిగా షాక్​ కు లొనయ్యారు. అధికారులు అప్రమత్తమై ఆ యువకుడిని బయటకి పంపించేశారు.

సెక్యూరిటీని దాటుకుని

తేజస్వీ యాదవ్​ ముజఫర్​ పూర్​ జిల్లాలోని కాంతి పాఠశాలలో శనివారం రాత్రి బీఆర్​ అంబేద్కర్​ విగ్రహావిష్కరణకు హాజరయ్యారు. ఆదివారం తిరిగి బయలుదేరే సమయంలో హెలికాప్టర్​ దగ్గర భారీగా భద్రత ఉన్నప్పటికీ ఓ యువకుడు దూసుకు రావడంతో అధికారుల్లో కలకలం రేగింది. దీంతో వెంటనే అధికారులు అప్రమత్తమై ఆ యువకుడిని ఆదుపులోకి తీసుకున్నారు. షరీపుల్​ ఇస్లాంగా అతడిని గుర్తించారు. అయితే ఈ సంఘటనకు సంబంధించిన ఓ వీడియో సోషల్​ మీడియాలో వైరల్​ అవుతోంది. అయితే ఈ ఘటనక సంబంధించి భిన్నమైన అభిప్రాయాలు వస్తున్నాయి. ఇది తీవ్రమైన భద్రతా లోపమని, అధికారులు అలర్ట్​ గా ఉండాలని కొందరు నెటిజన్లు విమర్శించారు. మరికొందరు ఇది తేజస్వీపై ఉన్న అభిమానానికి నిదర్శనమని కొనియాడారు. అయితే ఇలా జరగడం ఇదే మొదటి సారి కాదు. ఓట్​ అధికార్​ యాత్రలోనూ ఈ విధంగా జరిగింది.

తేజస్వీ యాదవ్ పర్యటనలో భద్రతాలోపం - Tholi Paluku