
డబ్ల్యూపీజీటీలో అదరగొట్టిన యువ గాల్ఫర్
గాల్ఫర్ జారా ఆనంద్ బుధవారం రెండు అండర్ 70 స్కోరుతో, రోజుని బెస్ట్ రౌండ్గా నమోదు చేసి, పార్ కంటే తక్కువ స్కోర్లతో, మహిళల ప్రొఫెషనల్ గాల్ఫ్ టూర్ (డబ్ల్యూపీజీటీ) 13వ లీగ్లో ఒక షాట్తో ఆధిక్యతను సాధించింది. ఈ ఏడాది చివర్లో అమెరికా యూనివర్సిటీలోని గాల్ఫ్ స్కాలర్షిప్తో చేరబోయే జారా, రెండు రౌండ్లలో మొత్తం ఈవెన్ పార్ను, 144 స్కోరుతో ముందంజలో నిలబడింది. ఆ రోజు ఆమెకి ఐదు బర్డీలు, మూడు బోగేలు ఉన్నాయి.
ఈ రౌండ్తో జారా మొదటి రౌండ్ లీడర్ లావణ్య జాడన్ను 73-72 స్కోరుతో అదిగమించి ముందంజలో నిలబడింది. లావణ్యకు మూడు బర్డీలు రాగా, వాటిలో రెండు మొదటి మూడు హోల్స్లోనే బోగేలన్నీ బ్యాక్ నైన్లో వచ్చాయి.
ఎక్స్పర్ట్ ప్లేయర్ అమన్ దీప్ డ్రాల్, గతంలో ఇండియన్ ఓపెన్లో రన్నరప్గా నిలిచంది. మొదటి రౌండ్ 74, రెండో రౌండ్ 73ను జోడించి మూడు ఓవర్లలో 147 స్కోరుతో మూడో స్థానంలో నిలబడింది. ఇక అస్తా మాడన్ 75-74తో నాల్గవ స్థానాన్ని సాధించింది. అమన్ దీప్ ముందు నైన్లో రెండు బర్డీలు, మూడు బోగేలుతో సరిపెట్టుకుంది.
అస్తా మాడన్ మొదటి హోల్లో ఒక బర్డీ, డబుల్ బోగేతో మొదలు పెట్టి, తదుపరి 16 హోల్స్లో మూడు బోగెలు, 17 హోల్స్లో మూడు బర్డీలు చేసి మిగతావి పార్లతో సరిపెట్టుకుంది. ఇక ఆ తర్వాత యువ గాల్ఫర్స్ అనన్యా సూద్ , కృతి చౌహాన్ 76-74తో ఆరు ఓవర్లలో 150 స్స్కోరుతో ఐదవ స్థానంలో టై గా నిలిచారు.
ఈ సీజన్లో నాలుగు విజయాలు సాధించిన వాణీ కపూర్, తన ఫార్మ్ను కనుగొనడంలో మొదటి రౌండ్ 75, రెండో రౌండ్ 76 స్కోర్ను సాధించి, ఆపొనెంట్ జహాన్వీ వాలియాతో 76-75 స్కోరుతో టై గా ఏడవ స్థానంలో నిలిచారు. గౌరికా బిష్ణోయ్ 77-75తో, మన్నాట్ బ్రార్ 76-76తో, లవణ్య గుప్తా 75-77తో టై గా పదవ స్థానంలో నిలచారు. ఇక ఫైనల్ కట్కు వచ్చేసరికి మొత్తాన్ని 164 స్కోర్గా నిర్ణయించడం జరిగింది, చివరికి 31 మంది ప్లేయర్లు కట్ దిశకు చేరారు.
