Let's talk: editor@tmv.in
చంద్రాయణగుట్టలో ఆటోలో ఇద్దరు యువకుల మృతదేహాలు కలకలం

చంద్రాయణగుట్టలో ఆటోలో ఇద్దరు యువకుల మృతదేహాలు కలకలం

Gaddamidi Naveen
4 డిసెంబర్, 2025

హైద‌రాబాద్ నగరంలో బుధవారం తెల్లవారుజామున షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. చంద్రాయణగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని రెహ్మాన్ హోటల్ సమీపంలో ఆగి ఉన్న ఒక ప్రయాణీకుల ఆటోలో ఇద్దరు యువకుల మృతదేహాలు కనిపించాయి.మృతదేహాలను గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో, వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రాథమిక సమాచారం ప్రకారం, ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదన‌ స్థితిలో కనిపించారని, ఆ తర్వాత వారు మరణించినట్లు ప్రకటించామని పోలీసులు తెలిపారు. మేము కేసు నమోదు చేసి, ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నాము, అని చంద్రాయణగుట్ట పోలీసు అధికారి తెలిపారు. మరణానికి గల కారణాలు, అనేక‌ వివరాలు తెలియాల్సి ఉంది.

ఇలాంటిదే మరో విషాద ఘటన గత అక్టోబర్‌లో హైదరాబాదులో చోటుచేసుకుంది. బేగంపేట్‌లోని శ్రీ సత్య టిఫిన్ అండ్ మీల్స్ సెంటర్ ఎదురుగా, ఇంపీరియల్ హౌస్ అపార్ట్‌మెంట్స్ సమీపంలో ఓ మహిళ మృతదేహం కనుగొనబడి నగరాన్ని షాక్‌కు గురిచేసింది. లిసాగా గుర్తించిన ఆ మహిళ వయస్సు సుమారు 30–35 సంవత్సరాలు. ఆమె ముఖం, శరీరంపై గాయాలుండటంతో పోలీసులు హత్య కోణంలో దర్యాప్తు ప్రారంభించారు.

గురువారం ఉదయం 7.20 గంటల సమయంలో అక్కడి టీ స్టాల్ యజమాని పొటమచెట్టి పాండు ఈ విషయం పోలీసులకు తెలియజేశారు. ఘటనాస్థలిలో ఒక క్వార్టర్ మద్యం బాటిల్, కొన్ని ఆహార పదార్థాలు కూడా లభించాయి. తెలియని వ్యక్తులు లిసాను హత్య చేసి వదిలేసి ఉండవచ్చని పాండు అనుమానం వ్యక్తం చేశాడు.ఈ మేరకు భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 103(1) కింద పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేసి, క్లూస్ టీమ్‌తో కలిసి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. పంజాగుట్ట ఇన్‌స్పెక్టర్ ఎం. రామకృష్ణ నేతృత్వంలో దర్యాప్తు కొనసాగుతోంది.ఇరు సంఘటనలపై పోలీసులు కీలక ఆధారాలను సేకరిస్తూ, పూర్తి వివరాలు వెలుగులోకి తేవడానికి దర్యాప్తును వేగవంతం చేశామని పోలీసులు తెలిపారు.

చంద్రాయణగుట్టలో ఆటోలో ఇద్దరు యువకుల మృతదేహాలు కలకలం - Tholi Paluku