Let's talk: editor@tmv.in
"క్యా సే క్యా హో గయా": భారత్-యూఎస్ సంబంధాలపై జైరాం రమేష్ విమర్శలు

"క్యా సే క్యా హో గయా": భారత్-యూఎస్ సంబంధాలపై జైరాం రమేష్ విమర్శలు

Dantu Vijaya Lakshmi Prasanna
7 డిసెంబర్, 2025

కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జైరాం రమేష్ ఇటీవల విడుదలైన యూఎస్ 2025 జాతీయ భద్రతా వ్యూహం పత్రంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ, భారత్-యూఎస్ ప్రస్తుత సంబంధాలపై, ముఖ్యంగా ప్రధాని మోదీ, అధ్యక్షుడు ట్రంప్‌ల స్నేహంపై పరోక్ష విమర్శలు గుప్పించారు.

• యూఎస్ విడుదల చేసిన 33 పేజీల ఎన్ఎస్ఎస్ పత్రంలో, భారత్-పాకిస్తాన్‌ల మధ్య మే నెలలో తలెత్తిన ఉద్రిక్తతను అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ "పరిష్కరించారు" అని పదేపదే (పరిచయంలో, 8వ పేజీలో) పేర్కొన్నారు.

ఏప్రిల్ 22న పహల్‌గామ్‌లో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయిన అనంతరం ప్రతీకారంగా చేపట్టిన ఆపరేషన్ సింధూర్‌ను అనుసరించి మే నెలలో జరిగిన ఉద్రిక్తత తర్వాత భారత్-పాకిస్తాన్‌ల మధ్య ట్రంప్ మధ్యవర్తిత్వం వహించారని యూఎస్ యొక్క 2025 నేషనల్ సెక్యూరిటీ స్ట్రాటజీ పేర్కొనడంపై, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, రాజ్యసభ ఎంపీ అయిన జైరాం రమేష్ భారత్-యూఎస్ సంబంధాల ప్రస్తుత స్థితిపై మాట్లాడారు. ట్రంప్ ఇలాంటి క్లెయిమ్ చేయడంపై జైరాం రమేష్ పరోక్షంగా అసంతృప్తి వ్యక్తం చేశారు.

ఆయన ఎక్స్‌లో చేసిన ఒక పోస్ట్‌లో, వైట్‌హౌస్ గురువారం విడుదల చేసిన 33 పేజీల పత్రం, దాని పరిచయంలో, మళ్లీ 8వ పేజీలో ట్రంప్ భారత్ పాకిస్తాన్‌ల మధ్య మే నెలలో పెరిగిన ఉద్రిక్తతతో సహా "ఎనిమిది భగ్గుమంటున్న ఘర్షణలను ట్రంప్ పరిష్కరించారు" అని పునరుద్ఘాటించిందని కాంగ్రెస్ నాయకుడు పేర్కొన్నారు.

ట్రంప్ మొదటి పదవీకాలంలో వచ్చిన 2017 వ్యూహాత్మక పత్రంతో పోలిస్తే,ఇప్పుడు విడుదలచేసిన పత్రం పూర్తి భిన్నం గా ఉంది అన్నారు. పాకిస్తాన్‌పై యూఎస్ వైఖరిలో వచ్చిన మార్పును ఆయన మరింతగా ప్రస్తావించారు. 2025 వ్యూహంలో వాషింగ్టన్ భాగస్వాములను లక్ష్యంగా చేసుకునే మిలిటెంట్లకు పాకిస్తాన్ మద్దతు ఇస్తోందనే యూఎస్ విమర్శలు, బలమైన ఉగ్రవాద వ్యతిరేక చర్యల కోసం చేసిన పిలుపు, ఇస్లామాబాద్ తన అణు ఆయుధాలను బాధ్యతాయుతంగా నిర్వహించాలని చేసిన విజ్ఞప్తులు వంటి ప్రస్తావనలు ఇప్పుడు విడుదలచేసిన పత్రం లో లేవని ఆయన ఎత్తి చూపారు.

జై రా౦ రమేష్ తన పోస్ట్ లో "యూఎస్ఏ 33 పేజీల నేషనల్ సెక్యూరిటీ స్ట్రాటజీని వైట్‌హౌస్ ఇప్పుడే విడుదల చేసింది. ఈ పత్రానికి తన పరిచయంలో, అధ్యక్షుడు ట్రంప్ 'భారత్, పాకిస్తాన్‌ల మధ్య రగులుతున్న ఘర్షణను పరిష్కరించినట్లు' చేసిన తన వాదనను పునరుద్ఘాటించారు. అదే వాదన 8వ పేజీలో కూడా పునరావృతమైంది. 2025 నేషనల్ సెక్యూరిటీ స్ట్రాటజీ పాకిస్తాన్‌పై యూఎస్ వైఖరిలో ఒక ముఖ్యమైన మార్పును కూడా సూచిస్తుంది. ఇది 2017 ట్రంప్ యుగం వ్యూహాత్మక పత్రాన్ని నిర్వచించిన స్పష్టమైన విమర్శలను నివారించింది. అది బహిరంగంగా పాకిస్తాన్‌ను యూఎస్ భాగస్వాములను లక్ష్యంగా చేసుకునే మిలిటెంట్లకు మద్దతు ఇస్తోందని నిందించింది. బలమైన ఉగ్రవాద వ్యతిరేక చర్యను డిమాండ్ చేసింది. ఇస్లామాబాద్ తన అణు ఆయుధాలను బాధ్యతాయుతంగా నిర్వహించాలని ఒత్తిడి చేసింది. కొత్త వ్యూహం అలాంటి ప్రస్తావనలను విస్మరించింది," అని పేర్కొన్నారు.

పీఎం మోడీ, ట్రంప్‌ల మధ్య సంబంధాలపై వ్యంగ్యంగా స్పందిస్తూ, తన పోస్ట్‌ను "క్యా సే క్యా హో గయా బేవఫా తేరే దోస్తి మే" (ఓ నమ్మకద్రోహి, నీ స్నేహంలో ఏమి జరిగిందో చూడు) అంటూ ముగించారు.

ఇదిలా ఉండగా, ట్రంప్ పరిపాలన తన కొత్తగా విడుదల చేసిన నేషనల్ సెక్యూరిటీ స్ట్రాటజీలో ఒక సానుకూల అంశం ఏమిటంటే, ట్రంప్ పరిపాలన భారతదేశాన్ని కీలక భాగస్వామిగా గుర్తించింది. ఆర్థిక, సాంకేతిక, రక్షణ రంగాలలో న్యూఢిల్లీతో సహకారాన్ని పెంచడానికి వాషింగ్టన్ ఆసక్తి చూపింది.

వైట్‌హౌస్ విడుదల చేసిన వ్యూహాత్మక పత్రం భారతదేశంతో మెరుగైన వాణిజ్య సంబంధాల కోసం స్పష్టంగా పిలుపునిస్తుంది. ఆస్ట్రేలియా, జపాన్, యునైటెడ్‌ స్టేట్స్‌తో పాటు క్వాడ్రిలేటరల్ సెక్యూరిటీ డైలాగ్‌లో నిరంతర సహకారం ద్వారా "ఇండో-పసిఫిక్ భద్రతకు దోహదపడాలని" న్యూఢిల్లీని ప్రోత్సహిస్తుంది .