
కోటి సంతకాల ఉద్యమం విజయవంతమన్న జగన్ సేన
ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రారంభించిన ఒక కోటి సంతకాల ఉద్యమం అత్యంత విజయవంతమైందని చరిత్రాత్మకంగా నిలిచిందని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. రాష్ట్రవ్యాప్తంగా 26 జిల్లా కేంద్రాల్లో నిర్వహించిన భారీ ర్యాలీలు, అందులో ప్రజల సంతకాల ప్రదర్శన ఇవన్నీ చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని టీడీపీ కూటమి ప్రభుత్వ పాలనను, విధానాలను ప్రజలు ఎంత తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారో స్పష్టంగా చాటుతున్నాయి. ఇది కేవలం ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేసిన ఉద్యమం మాత్రమే కాదు. చంద్రబాబు నాయుడుగారి ప్రజావ్యతిరేక విధానాలపై ప్రజలు ఇచ్చిన ఘనమైన తీర్పు. ప్రజాప్రయోజనాలను ఫణంగా పెడుతూ, వారికి ద్రోహం చేస్తూ ఆయన తీసుకున్న నిర్ణయాలను ఖండిస్తూ, ఒక కోటికి పైగా పౌరులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సంతకాలు చేశారని ఆ పార్టీ అధినేత జగన్ తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు..
సమాజంలోని అన్ని వర్గాల ప్రజలు ఈ ఉద్యమంలో పాల్గొని సంతకాలు చేశారు. ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణ ద్వారా అందుబాటులో ఉన్న వైద్య విద్యను, ప్రజారోగ్య వ్యవస్థను నాశనం చేస్తారనే ప్రజల ఆందోళనే ఈ ఉద్యమానికి ప్రధాన ప్రేరణగా నిలిచిందన్నారు. సేకరించిన ఒక కోటి సంతకాల పత్రాలు ప్రస్తుతం తాడేపల్లిలోని వైయస్సార్సీపీ కేంద్ర కార్యాలయానికి చేరుతున్నాయి. అక్కడి నుంచి డిసెంబర్ 18న గౌరవ గవర్నర్గారికి అధికారికంగా సమర్పిస్తాం. తద్వారా ప్రజల గొంతు రాష్ట్రంలోని అత్యున్నత రాజ్యాంగాధికారికి చేరి, అనంతరం అది న్యాయస్థానాల తలుపులు తడుతుందన్నారు.
ఈ ఉద్యమానికి అండగా నిలిచిన ప్రతి వైయస్సార్సీపీ నాయకుడు, పార్టీ కార్యకర్తలు, అలాగే స్వచ్ఛందంగా సంతకాలు చేసిన ప్రతి పౌరుడికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఉద్యమంలో మీ భాగస్వామ్యం ద్వారా ప్రజా ఆస్తులను ప్రైవేట్కు అప్పగించాలన్న కూటమి ప్రభుత్వ కుట్ర బట్టబయలైందని పేర్కొన్నారు.
ఈ ఉద్యమం ద్వారా చంద్రబాబు నాయుడు పాలనపై ప్రజలు తమ ఆగ్రహాన్ని తెలియజేశారు. ప్రజల సొమ్ముతో నిర్మించిన ప్రభుత్వ వైద్య కళాశాలలను అమ్మేయాలన్న ఆయన ప్రయత్నాన్ని, ఆయన నిర్ణయాలను, ఆయన పాలనను ఒక కోటి మంది ప్రజలు తిరస్కరించారు. ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణపై తీసుకున్న ఈ ప్రజావ్యతిరేక నిర్ణయాన్ని చంద్రబాబు నాయుడు తక్షణమే వెనక్కి తీసుకోవాలని గట్టిగా డిమాండ్ చేస్తున్నాను. ప్రజారోగ్య వ్యవస్థను, అందుబాటులో ఉన్న వైద్య విద్యను దోచుకునే ఈ పట్టపగలు దోపిడీకి వెంటనే తెరపడాలని జగన్ అన్నారు.
జగన్ మోహన్ రెడ్డి పిలుపు మేరకు జరిగిన కార్యక్రమంలో కోటీ నాలుగు లక్షల సంతకాలు సేకరించాం. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై జరిగిన ఈ ప్రజాభిప్రాయ సేకరణలో ఓటు వేసినట్టే ప్రజలు తీర్పు ఇచ్చారు. క్రెడిట్ చోర్ చంద్రబాబు కావాలంటే మెడికల్ కాలేజీల నిర్మాణం తానే చేసినట్టు క్రెడిట్ తీసుకోవచ్చు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ చేసి పేద ప్రజల ఉసురు తీసుకోవద్దు అని చంద్రబాబుకు చెబుతున్నామని వైయస్ఆర్ సీపీ స్టేట్ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు.
ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేటుకు అప్పజెప్పి, పెద్ద స్కాములు చేయాలని చంద్రబాబు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేలా ప్రజా మద్దతు కూడగడుతూ వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారు చేపట్టిన కోటి సంతకాల సేకరణ పూర్తి అయింది. జగన్ మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ఈ కోటి సంతకాలను గవర్నర్ గారికి సమర్పించి ప్రభుత్వంపై ప్రజలకున్న వ్యతిరేకతను తెలియజేయబోతున్నాం. ప్రతిపక్షాలు, ప్రజలు, మేధావులు ఎంతమంది చెప్పినా ప్రభుత్వం దున్నపోతు మీద వాన పడ్డట్టు ప్రవర్తిస్తోందని మాజీ మంత్రిగుడివాడ అమర్నాథ్ అన్నారు..
ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రజలు పెట్టిన కోటి సంతకాలు చంద్రబాబు ప్రభుత్వ పతనానికి పునాది రాళ్లు. జగన్ గారి మీద ఈర్ష, ద్వేషంతోనే చంద్రబాబు ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేటుకు అప్పజెప్తున్నాడు. ప్రైవేటీకరించటమే తన హక్కు అన్నట్టుగా చంద్రబాబు ప్రవర్తిస్తున్నాడు. ప్రజల వ్యతిరేకతను అర్థం చేసుకొని చంద్రబాబు ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి అని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోందని ఆ పార్టీ నేత గోరంట్ల మాధవ్ అన్నారు.
కాగా మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలనే డిమాండ్ తో ఈ మేరకు ప్రజల నుంచి సేకరించిన కోటి సంతకాలను డిసెంబర్ 18న(ఈ రోజు) గవర్నర్ గారికి సమర్పించనున్న వైయస్ జగన్
