
కేరళతో మెస్సీ ఫ్రెండ్లీ మ్యాచ్ వాయిదా
లియోనెల్ మెస్సీ మరియు ఆర్జెంటీనా జాతీయ ఫుట్బాల్ జట్టును చూడాలని కోరుకుంటున్న కేరళ అభిమానులు ఇంకా కొంతకాలం వేచివుండాల్సి ఉంది. కొచ్చిలో జరగాల్సిన ఫ్రెండ్లీ మ్యాచ్ వాయిదా పడింది. మొదట నవంబర్ 17న జవహర్లాల్ నెహ్రూ ఇంటర్నేషనల్ స్టేడియంలో షెడ్యూల్ చేసిన ఈ మ్యాచ్ తదుపరి ఇంటర్నేషనల్ విండోలో నిర్వహించబడనుందని అధికారులు తెలిపారు.
మ్యాచ్ స్పాన్సర్ ఆంటో ఆగస్టిన్ తన ఫేస్బుక్ పేజ్లో వాయిదా పడ్డ కారణంగా “ఫిఫా అనుమతిని అందుకునే ప్రక్రియలో ఆలస్యం” అని పేర్కొన్నారు. ఆర్జెంటీనా ఫుట్బాల్ అసోసియేషన్ (AFA)తో చర్చల తర్వాత మ్యాచ్ను మళ్లీ షెడ్యూల్ చేయాలని నిర్ణయం తీసుకున్నారు.
కేరళ క్రీడా మంత్రి వి. అబ్దురహీమ్మన్ పేర్కొన్నారు, ఈ ఆట పూర్తిగా ఫిఫా ఆమోదంపై ఆధారపడి ఉంది. “ఆర్జెంటీనా నవంబర్లో రెండు మ్యాచ్లు ప్లాన్ చేసుకుంది ఒకటి అంగోలా, మరొకటి కేరళ. అంగోలా మ్యాచ్ ఖరారు అయ్యింది, కానీ కేరళ మ్యాచ్ ఫిఫా క్లియరెన్స్ ఇంకా రావాల్సివుంది,” అని ఆయన చెప్పారు.
అబ్దురహీమ్మన్ మాట్లాడుతూ , “మ్యాచ్కు సంబంధించిన అన్ని అవసరమైన డాక్యుమెంట్లను ఫిఫాకు గత శుక్రవారం సమర్పించాము. ఫిఫా ఆమోదం వెంటనే వస్తే, ప్రస్తుత విండోలో మ్యాచ్ జరగవచ్చు. లేకపోతే, తదుపరి ఇంటర్నేషనల్ విండోలో నిర్వహించబడుతుంది.”
కొచ్చి స్టేడియం సిద్ధమైందని ఆయన చెప్పారు. “ఫైర్ మరియు సేఫ్టీ ఆడిట్లు పూర్తయ్యాయి, ఇన్స్పెక్షన్లు జరుగాయి, కేవలం ఫిఫా ఆమోదమే మిగిలింది. ప్రస్తుత హలోజెన్ లైటింగ్ కూడా అప్గ్రేడ్ అవుతోంది,”. తిరువనంతపురం స్టేడియం గట్టి ఫీల్డ్ పరిస్థితుల కారణంగా తిరస్కరించబడిందని తెలిపారు.
మెస్సీ గురించి మంత్రి మాట్లాడుతూ, స్టార్ ఫుట్బాల్లర్ కేరళలో ఒంటరిగా వస్తే సరిపోదు, పూర్తి ఆర్జెంటీనా జట్టుకి ఆతిథ్యం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. “ మెస్సీ రోడ్షో స్థానిక క్రీడా రంగానికి అంత ప్రభావం చూపదు”అని అన్నారు.
స్థానిక ఆందోళనలు, ఫిఫా కు పంపిన ఇమెయిళ్లు కొంచెం ఆలస్యం మయ్యాయని మంత్రి చెప్పారు, అయినప్పటికీ AFA ప్రతినిధులు స్టేడియం సౌకర్యాలతో సంతృప్తి వ్యక్తం చేశారు.
ఆర్జెంటీనా జట్టు అత్యున్నత అంతర్జాతీయ జట్టుతో ఈ ఫ్రెండ్లీ మ్యాచ్లో ఆడే అవకాశం ఉంది, ఇది కేరళ అభిమానులను ఎంతో ఉత్సాహపరిచింది. నిర్వాహకులు ఫిఫా ఆమోదం అందిన వెంటనే కొత్త తేదీని ప్రకటిస్తామని హామీ ఇచ్చారు.
