
కుక్కలు... బాబోయ్
అయ్యా బాబోయ్ ఒకే రోజు దాదాపు 67 మందిని కుక్కలు కరిచాయి. దీంతో బాధితులు దవాఖానకు వరుస కట్టారు. అందరికీ వ్యాక్సిన్లు ఇచ్చారు. దీంతో అక్కడ ఉన్న కుక్కలకు రేబిస్ వ్యాక్సిన్లు ఇస్తున్నారు. అయితే ఈ సంఘటన ఎక్కడ జరిగిందంటే మహారాష్ట్రలోని థానే జిల్లాలోని కల్యాణ్, దొంబివాలిలో జరిగాయి. అక్కడ వీధి కుక్కలు ఎక్కువగా ఉండడంతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. ఒకేరోజు వివిధ ప్రాంతాల్లో అంతమందిని కరవడంతో బయట తిరగాలంటేనే భయపడుతున్నారు. అయితే ప్రతినెల వేయికి పైగా కుక్కలకు రేబిస్ వ్యాక్సిన్లు వేస్తున్నట్లు కేడీఎంసీ వివరించింది.
ఇంతకు ముందు కూడా కుక్క కాటు కేసులు వచ్చేవని అయితే ఒకేరోజు ఇన్ని కేసులు రావడం మొదటిసారని మున్సిపల్ కార్పోరేషన్ ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ దీపా తెలిపారు. బాధితులందరికీ ఇంజక్షన్లు సకాలంలో ఇచ్చామన్నారు. అలాగే విధికుక్కలకు కూడా వ్యాక్సిన్లు ఇస్తున్నామని చెప్పారు. కుక్క కాటు వల్ల జరిగే ప్రమాదాలపై కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నమన్నారు. భవిష్యత్ లో డాగ్ సెంటర్ ను ప్రారంభించే ప్లాన్ ఉందన్నారు. ప్రతినెలా సుమారు 1100 కుక్కలకు స్టెరిలైజేషన్ చేస్తున్నామన్నారు. ఈ ఘటనల వల్ల ప్రభుత్వ, ప్రైవేట్ దవాఖానల్లో ఫుల్ రష్ ఏర్పడింది. బాధితులు చికిత్స కోసం ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నారు.
