Let's talk: editor@tmv.in
ఐపీఎస్ పూరణ్‌కుమార్ ఆత్మహత్యపై: సీఎం స్పందన

ఐపీఎస్ పూరణ్‌కుమార్ ఆత్మహత్యపై: సీఎం స్పందన

Gaddamidi Naveen
12 అక్టోబర్, 2025

హర్యానాలో సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి వై పూరణ్‌కుమార్‌ ఆత్మహత్యపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విచారం వ్యక్తం చేశారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్టాడుతూ జాతి పేరుతో జరుగుతున్న దాడులు దారుణమ‌న్నారు. ఉదాహరణగా ఈ బలవంతపు మరణం అని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ సీఎంవో ‘ఎక్స్‌’ (మాజీ ట్విట్టర్‌)లో చేసిన పోస్టులో, ఒక ఏడీజీపీ స్థాయి అధికారి కూడా జాతి ఆధారిత వేధింపులకు గురై ప్రాణాలు కోల్పోవాల్సి వస్తే, సామాన్య ప్రజల దుస్థితి ఎంత దయనీయమో అర్థం అవుతుందని రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు.

ఇలాంటి అసహనకర ఘటనలు సమాజంలో ద్వేషాన్ని పెంచుతాయని, అణగారిన వర్గాలపై ద్వేష భావన విషాన్ని నింపుతుందని సీఎం ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విధమైన సంఘటనలు ప్రజల్లో రాజ్యాంగం, సమానత్వం, న్యాయం మీద నమ్మకాన్ని దెబ్బతీస్తాయని ఆయన పేర్కొన్నారు. అణగారిన వర్గాలపై దాడులను అందరూ తీవ్రంగా ఖండించాలని రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు.

ఈ ఘటన కేవలం ఒక ఐపీఎస్‌ అధికారి మీద దాడి మాత్రమే కాదు, మొత్తం దేశంపైనే దెబ్బ అని పరిగణించాలి. దీనిని అత్యంత సీరియస్‌గా తీసుకోవాలని ఆయన అన్నారు. రేవంత్‌రెడ్డి‌‌‌‌‌‌‌‌ ‌‌పూరణ్‌కుమార్‌ కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేశారు. వై పూరణ్‌కుమార్‌ (52), 2001 బ్యాచ్‌ భారత పోలీసు సేవా అధికారి, మంగళవారం చండీగఢ్‌లోని సెక్టార్‌ 11లోని తన నివాసంలో తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారు.

ఐపీఎస్ చివరి నోట్‌లో ఎనిమిది మంది సీనియర్‌ పోలీసు అధికారులపై "జాతి ఆధారిత వివక్ష, లక్ష్యపూర్వక మానసిక వేధింపులు, ప్రజల ముందు అవమానాలు, దారుణ హింస" చేసినట్లు సమాచారం.