
ఏపీలో గూగుల్ 15 బిలియన్ డాలర్ల పెట్టుబడి: పీఎం
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గురువారం ఆంధ్రప్రదేశ్లో గూగుల్ 15 బిలియన్ డాలర్ల (సుమారు ₹1.25 లక్షల కోట్లు) పెట్టుబడిని స్వాగతిస్తూ, ఇది రాష్ట్రం డిజిటల్ భవిష్యత్తుకు కీలక మైలురాయిగా నిలుస్తుందన్నారు. గూగుల్ విశాఖపట్నంలో భారతదేశపు తొలి కృత్రిమ మేధస్సు (ఏఐ) హబ్ను నెలకొల్పనున్నట్లు ప్రకటించింది. ఈ ప్రాజెక్టు ద్వారా విశాఖపట్నం అంతర్జాతీయ స్థాయిలో ఏఐ, కనెక్టివిటీ కేంద్రంగా మారబోతోందని ప్రధాని వివరించారు.
ఈ ప్రాజెక్ట్ విశాఖపట్నాన్ని ఏఐ, కనెక్టివిటీ హబ్గా నిలబెడుతుంది. ఇది భారతదేశానికే కాక ప్రపంచానికీ ఉపయోగపడుతుంది. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అభినందనలు తెలియజేస్తూ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దూరదృష్టిని నేను ప్రశంసిస్తున్నానని మోదీ అన్నారు.
గూగుల్ సీఈఓ సుందర్ పిచైతో జరిగిన సంభాషణలో, ఇది అమెరికా వెలుపల గూగుల్ పెడుతున్న అతి పెద్ద పెట్టుబడిగా పేర్కొన్నారని తెలిపారు. ఈ హబ్లో 1 గిగావాట్ సామర్థ్యం కలిగిన అత్యాధునిక డేటా సెంటర్ క్యాంపస్ ఏర్పాటవుతుంది. మొత్తం ప్రాజెక్ట్ పునరుత్పాదక శక్తి తో నడుస్తుంది. విశాఖను గూగుల్ గ్లోబల్ నెట్వర్క్కి అనుసంధానించే అంతర్జాతీయ సముద్ర కేబుల్ వ్యవస్థ కూడా నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా పది వేల సంఖ్యలో ప్రత్యక్ష ఉద్యోగాలు సృష్టించబడతాయి. ఆరోగ్యం, వ్యవసాయం, లాజిస్టిక్స్ వంటి పలు రంగాల్లో ఇది విప్లవాత్మక మార్పులు తీసుకురానుంది.
