Let's talk: editor@tmv.in
ఏపిలో త్వరలో ప్రజలకు అందుబాటులోకి అవేర్ యాప్

ఏపిలో త్వరలో ప్రజలకు అందుబాటులోకి అవేర్ యాప్

Dantu Vijaya Lakshmi Prasanna
26 నవంబర్, 2025

వివిధ ప్రభుత్వ శాఖలు అందించే పౌర సేవలు మరింత మెరుగ్గా అందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులకు దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలు సమర్ధంగా ప్రజల్లోకి వెళ్లాలని సూచనలు జారీ చేశారు. సోమవారం సచివాలయంలోని రియల్ టైమ్ గవర్నెన్స్ కేంద్రంలో వివిధ అంశాలపై ముఖ్యమంత్రి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రజామోదం మేరకే మున్సిపాలిటీలు, కార్పోరేషన్లలో పనులు చేపట్టేలా చూడాలని, అటు గ్రామీణ ప్రాంతాల్లోనూ గ్రామ సభల అనుమతి లేకుండా పనులు చేపట్టవద్దని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఉపాధి హామీ పనులకూ ఇదే నిబంధన వర్తించేలా చూడాలని స్పష్టం చేశారు.

మంత్రులు, ప్రజా ప్రతినిధులు క్షేత్రస్థాయిలో పర్యటించి సమర్ధంగా వివిధ అంశాలను ప్రజల ముందు ఉంచాలని సీఎం సూచించారు. ప్రభుత్వ విభాగాలు సాంకేతికతను మరింతగా అందిపుచ్చుకోవటంతో పాటు సామర్ధ్యాలను పెంచుకోవాలని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. సుపరిపాలన లాంటి మోడల్ ఆఫ్ గవర్నెన్సు ద్వారానే ప్రజల్లో సంతృప్త స్థాయి పెరుగుతుందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. క్షేత్రస్థాయిలో ప్రజలకు మంచి సేవలు అందించటం ద్వారానే దీనిని సాధించవచ్చని అన్నారు. ప్రభుత్వ పథకాల అమలు, పౌరసేవలకు సంబంధించి ప్రతీ అంశంలోనూ జవాబుదారీతనం అనేది కీలకమైన అంశంగా పరిగణించాలని సీఎం స్పష్టం చేశారు. దీనికి సంబంధించి 175 నియోజకవర్గాల్లోనూ కెపాసిటీ బిల్డింగ్ కూడా జరగాలని అన్నారు. ప్రజల్లో సానుకూలత పెరిగేలా సూక్ష్మ స్థాయి వరకూ విశ్లేషణ జరగాలని అన్నారు. ఇటీవల రాష్ట్రంలో ఉత్పన్నమైన మొక్క జొన్న, పత్తి, అరటి పంటల్లో సమస్యను పరిష్కరించి రైతులకు గిట్టుబాటు ధర దక్కేలా చేస్తున్నామని అన్నారు. ప్రభుత్వ శాఖలు ఆర్ధిక, ఆర్థికేతర అంశాలను ప్రాధాన్యతా క్రమంలో పనులు పూర్తి చేయాలని తద్వారా ప్రజల్లో సానుకూల ధోరణి పెరిగేందుకు వీలుగా కార్యాచరణ ఉండాలని స్పష్టం చేశారు. నిరంతరం డేటా ఆధారిత నిర్ణయాలు తీసుకునేలా ప్రణాళికలు ఉండాలని సూచించారు. పౌర సేవల్ని అందించటంలో నిర్లక్ష్యంగా ఉన్నవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి హెచ్చరించారు.

త్వరలో ప్రజలకు అందుబాటులోకి అవేర్ యాప్

వాతావరణ హెచ్చరికలు సహా 42 అంశాల్లో నిరంతర సమాచారం కోసం అవేర్ యాప్ ను ప్రజల వినియోగం కోసం విడుదల చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. అన్ని ప్రభుత్వ శాఖలూ డేటా లేక్ కు అనుసంధానం కావాలని సూచనలు జారీ చేశారు. రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాల్లో బ్యాండ్ విడ్త్ కనెక్టివిటీని పెంచాలని స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా సంక్షేమ హాస్టళ్లలోని తాగు నీరు, పరిశుభ్రత తదితర అంశాలపై పర్యవేక్షణ జరగాలని సూచించారు. దీనిపై ఓ యాప్ రూపోందించి రోజువారీగా తనిఖీ చేస్తున్నామని అధికారులు సీఎంకు వివరించారు. తిరుమలలో టీటీడీ భక్తులకు అందించే సేవలు, క్రౌడ్ మేనేజ్మెంట్, సెక్యూరిటీ లాంటి అంశాలను అధ్యయనం చేసి ఇతర దేవాలయాల్లో అమలు చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. కాలుష్య నియంత్రణ మండలితో కలిసి ఎయిర్ క్వాలిటీ సెన్సార్లు ఏర్పాటు చేసి ఆ వివరాలను కూడా ప్రజలకు అందించాలని పేర్కొన్నారు. సుపరిపాలనా అంశాలపై డిసెంబరులో ఎమ్మెల్యేలు, ఎంపీలతో వర్క్ షాప్ నిర్వహించనున్నట్టు సీఎం స్పష్టం చేశారు. అధికారుల్లోనూ పాలనా సామర్ధ్యాలు పెరిగేలా శిక్షణా కార్యక్రమాలు నిర్వహించాలని సీఎం సూచించారు.

'అవేర్' అనేది ఒక సమగ్ర వేదిక, ఇది ఆంధ్రప్రదేశ్ యొక్క రియల్-టైమ్ గవర్నెన్స్ ఫ్రేమ్‌వర్క్ కోసం రూపొందించబడిన ఉమా౦గ్, అధునాతన మౌసం వ్యవస్థను పోలి ఉంటుంది.

అవేర్ యాప్‌కు సమానమైన ఇతర మొబైల్ అప్లికేషన్లు

ఇది పౌర సేవలకు సంబంధించిన 42 విభాగాల సమాచారాన్ని అందించే బహుళ శాఖల కేంద్రంగా, వాతావరణ అంచనా, ముందస్తు హెచ్చరికల కోసం నిజ సమయ పాలన ప్రత్యేక వేదికగా పనిచేస్తుంది.

దీని ఆధారంగా, భారతదేశంలో ఇలాంటి ఇతర యాప్‌లను రెండు ప్రధాన విభాగాలుగా వర్గీకరించవచ్చు

1.అన్నీ ఒకేచోట ఉండే పౌర సేవలు, పరిపాలనా యాప్‌లు

2. ప్రత్యేక ముందస్తు హెచ్చరికలు/వాతావరణ యాప్‌లు.

అన్నీ ఒకేచోట ఉండే పౌర సేవలు, పరిపాలనా యాప్‌లు

ఈ యాప్‌లను ప్రధానంగా భారత ప్రభుత్వం ప్రారంభించింది. ఇవి 'అవేర్' అందించే బహుళ విభాగాల డేటా మాదిరిగానే అనేక సేవలను కేంద్రీకరించే లక్ష్యంతో రూపొందించబడ్డాయి.

ఉదాహరణకు,

ఉమా౦గ్:

మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఏర్పాటుచేసిన ఉమా౦గ్ యాప్. దీని ప్రధాన ఉద్దేశ్యం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుండి ఫిర్యాదుల నమోదు, యుటిలిటీ బిల్లులు, పీఎఫ్/ఈపీఎఫ్‌ఓ సేవలు, ఆరోగ్యం, విద్య, భారత వాతావరణ శాఖ వాతావరణ నివేదికల వంటి వెయ్యికి పైగా ప్రభుత్వ సేవలను ఒకే వేదికపై అందిస్తుంది.

మై జి ఓవి :

భారత ప్రభుత్వం ఏర్పాటుచేసిన మై జి ఓవి యాప్. ఇది విధాన రూపకల్పన కార్యక్రమాల అమలుకు సంబంధించిన సూచనలు, చర్చా వేదికలు, పోల్స్ ,పనుల కోసం ఒక వేదికను అందించడం ద్వారా పాలనలో పౌరుల భాగస్వామ్యాన్ని సులభతరం చేసే ప్రయత్నం.

పౌర సేవల పోర్టల్స్ యాప్:

వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు (ఉదాహరణకు: ఆంధ్రప్రదేశ్/తెలంగాణ) ఏర్పాటుచేసినవి. ఇవి పౌరులకు (G2C) ,వ్యాపారాలకు (G2B) సేవలను అందించడానికి రాష్ట్ర స్థాయిలో సింగిల్-ఎంట్రీ పోర్టల్‌లు (మరియు మొబైల్ యాప్‌లు), సర్టిఫికెట్లు (జననం, ఆదాయం, కులం), భూ రికార్డులు, లైసెన్సులు, యుటిలిటీ చెల్లింపుల కోసం దీన్ని ప్రవేశపెట్టారు.

ప్రత్యేక ముందస్తు హెచ్చరికలు మరియు సమాచార యాప్‌లు

'అవేర్' యొక్క ప్రధాన విధిలో వాతావరణ అంచనా, వరదల హెచ్చరికలు, మెరుపు హెచ్చరికలు ఉన్నాయి. ఈ యాప్‌లు విపత్తు సంసిద్ధత కోసం ఇలాంటి ప్రత్యేక విధులను అందిస్తాయి.

మౌసం:

భారత వాతావరణ శాఖ ఏర్పాటుచేసింది. ఇది భారతదేశం అంతటా గమనించిన వాతావరణం, అంచనాలు, రాడార్ చిత్రాలు, రాబోయే వాతావరణ సంఘటనల (వర్షం, ఉష్ణోగ్రత, తుఫానులు మొదలైనవి) గురించి ముందస్తు హెచ్చరికలు జారీ చేస్తుంది. ఇలాగే దామిని, సచేత్ వంటి యాప్ లు అనుబాటులో వున్నాయి.

'అవేర్' అనేది ఒక సమగ్ర వేదిక, ఇది ఆంధ్రప్రదేశ్ యొక్క రియల్-టైమ్ గవర్నెన్స్ ఫ్రేమ్‌వర్క్ కోసం రూపొందించబడిన ఉమా౦గ్ , అధునాతన మౌసం వ్యవస్థను పోలి ఉంటుంది.