ఏఐ అసాధ్యాలను సుసాధ్యం చేసుంది - మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల
కృత్రిమ మేధస్సులో వస్తున్న విప్లవాత్మక పురోగతితో ప్రపంచం ఒక కొత్త శకంలోకి అడుగుపెడుతోందని, ఈ కారణంగా అసాద్యం అనుకున్నవి సాధ్యమవుతున్నాయి. ఏఐ దాని పరిధిని విస్తరిస్తోందని మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల తెలిపారు.
డిసెంబర్ 12 (శుక్రవారం) ముంబైలో జరిగిన 'మైక్రోసాఫ్ట్ ఏఐ టూర్' లో మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల ముఖ్య ప్రసంగం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ,
పునఃసృష్టికి అవకాశం:
ఏఐ కస్టమర్ అనుభవం మెరుగుపరచడం నుండి ఉద్యోగుల ఉత్పాదకత పెంచడం, మొత్తం కార్యాచరణ సామర్థ్యాన్ని మెరుగుపరచడం వరకు సాంకేతికత ఇప్పుడు ప్రభుత్వాలు, సంస్థలు వ్యక్తులు తమ కార్యకలాపాలను పూర్తిగా పునర్నిర్మించుకోవడానికి అనుమతిస్తుందని సత్య నాదెళ్ల అన్నారు. “అసాధ్యం అనుకున్నవి సాధ్యమయ్యే దాని సరిహద్దు మారుతోంది. ఊహించనివి ఎన్నో నిజమవుతున్నాయి. సాంకేతికత గురించి మనం మాట్లాడినప్పుడు, అది మన రాష్ట్రంలో అయినా, మన సంస్థలో అయినా, మన జీవితంలో అయినా మనం ఇప్పుడు ఏమి చేయగలమో పునర్నిర్మించుకోవడానికి ఇది అనుమతిస్తుంది," అని ఆయన పేర్కొన్నారు.
ఫార్మాస్యూటికల్స్ వంటి అత్యంత నియంత్రిత పరిశ్రమలతో సహా అన్ని రంగాలలో ఏఐ ఆవిష్కరణలకు ఎలా ప్రేరణ ఇస్తోందో ఆయన వివరించారు. ఉదాహరణకు, డ్రగ్ కంపెనీలు ఇప్పుడు క్లినికల్ ట్రయల్స్ ను వేగవంతం చేయగలవా, కొత్త ఔషధాలను మార్కెట్లోకి త్వరగా తీసుకురాగలవా అని అన్వేషిస్తున్నాయి.
'నేర్చుకోవడం-మరచిపోవడం' అవసరం:
ఈ కొత్త దశలోకి ప్రవేశించడానికి, గతం పద్ధతులపై ఆధారపడకుండా కొత్త విధానాలను స్వీకరించాలని ఆయన అన్నారు. ప్రస్తుత సాంకేతిక ప్రపంచంలో పాత పద్ధతులు ఫలించకపోవచ్చు కాబట్టి, ప్రతి ఒక్కరూ 'నేర్చుకోవడంతో పాటు మరచిపోవాల్సిన' అవసరాన్ని ఆయన బలంగా చెప్పారు.
ఏఏఏ వ్యవస్థలను నిర్మించడం అనేది సాంప్రదాయ సాఫ్ట్వేర్ నిర్మాణానికి భిన్నంగా ఉంటుందని నాదెళ్ల వివరించారు. సాంప్రదాయ పద్ధతిలో ఒక వివరణాత్మక స్పెసిఫికేషన్తో మొదలుపెడతారు, కానీ ఏఐ అభివృద్ధి ఫలితాన్ని నిర్వచించడంతో మొదలవుతుంది.
"మీరు స్పెసిఫికేషన్తో ప్రారంభించరు. మీరు నిజానికి పరీక్షతో ప్రారంభిస్తారు," అని ఆయన అన్నారు. ఈ పద్ధతిలో, డెవలపర్లు మొదట ఫలితాన్ని కొలవడానికి మూల్యాంకనాలు సృష్టించి, ఆపై ఆ మోడల్ను నిరంతరం మెరుగుపరుస్తారు. ఇది సాంప్రదాయ 'ఎడమ నుండి కుడి' సాఫ్ట్వేర్ నిర్మాణ పద్ధతికి విరుద్ధంగా, కావలసిన ప్రభావంతో ప్రారంభించి, వెనుకకు పనిచేస్తుంది. ఈ కొత్త సరిహద్దుకు అనుగుణంగా మారాలంటే ప్రతి ఒక్కరూ కొత్త నైపుణ్యాలను నేర్చుకోవాలని, ఆధునిక టూల్ చైన్ ను ఉపయోగించాలని నాదెళ్ల ఉద్ఘాటించారు. ఏఐ ని ఒక అమూర్త భావనగా కాకుండా, సంస్థలు తమ డేటా, సాధనాలు వర్క్ఫ్లోలను ఏకీకృతం చేసి, రోజువారీ అభ్యాసంలో భాగం చేయాలని ఆయన సూచించారు.
ముంబైలో జరిగిన ఈ మైక్రోసాఫ్ట్ ఏఐ టూర్లో మహారాష్ట్ర ప్రభుత్వం ఓ కొత్త ఏఐ ఆవిష్కరణ చేసింది. అదేమిటంటే మహాక్రైమ్ఓఎస్ ఏఐ. ఈ ఏఐ-ఆధారిత వ్యవస్థ, మహాక్రైమ్ఓఎస్ ఏఐను మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్యనాదెళ్ల, ముఖ్య మంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తో కలిసి ఆవిష్కరించారు. ఇది భారతదేశంలో డిజిటల్ పోలీసింగ్ ప్రయత్నాలలో ఒక ముఖ్యమైన ముందడుగు. సైబర్ క్రైమ్ దర్యాప్తును వేగవంతం చేయడానికి కృత్రిమ మేధస్సు (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్-ఏఐ) ఆధారిత ప్లాట్ఫారమ్ను ఉపయోగించిన మొట్టమొదటి భారతీయ రాష్ట్రంగా మహారాష్ట్ర నిలిచింది.
