Let's talk: editor@tmv.in
ఎర్త్ అవర్ సందర్భంగా రాష్ట్ర సచివాలయంలో నిలిచిపోయిన విద్యుత్ దీపాలు

ఎర్త్ అవర్ సందర్భంగా రాష్ట్ర సచివాలయంలో నిలిచిపోయిన విద్యుత్ దీపాలు

Gaddamidi Naveen
29 మార్చి, 2026

పర్యావరణ పరిరక్షణ, విద్యుత్ పొదుపుపై అవగాహన కల్పించే అంతర్జాతీయ ఉద్యమం 'ఎర్త్ అవర్ 2026' లో భాగంగా తెలంగాణ రాష్ట్ర సచివాలయం శనివారం రాత్రి భాగస్వామ్యమైంది. ఈ సందర్భంగా సచివాలయంలోని విద్యుత్ దీపాలను గంట సేపు పూర్తిగా ఆపివేసి పర్యావరణం పట్ల తమ నిబద్ధతను చాటుకున్నారు.

నిన్న‌ రాత్రి 8:30 గంటల నుంచి 9:30 గంటల వరకు సచివాలయ ప్రధాన భవనంతో పాటు, దాని పరిధిలోని అన్ని కార్యాలయ బ్లాకులు, గదులు, హాళ్లలో లైట్లను పూర్తిగా ఆపివేశారు. విద్యుత్ వినియోగాన్ని తగ్గించడం ద్వారా ప్రకృతి సమతుల్యతను కాపాడవచ్చు అనే సందేశాన్ని ప్రభుత్వం ఈ చర్య ద్వారా బలంగా వినిపించింది. సుస్థిరత, విద్యుత్ శక్తి సంరక్షణ పట్ల ప్రభుత్వానికి ఉన్న పట్టుదలకు ఇది నిదర్శనంగా నిలిచింది.

గివ్ఆన్ అవర్ ఫ‌ర్ఎర్త్ అనే నినాదంతో ప్రపంచవ్యాప్తంగా సాగుతున్న ఈ గ్లోబల్ ఇనిషియేటివ్, పర్యావరణాన్ని రక్షించే దిశగా సామూహిక చర్యలను ప్రేరేపించడం లక్ష్యంగా పెట్టుకుంది. బాధ్యతాయుతమైన జీవనశైలి, పర్యావరణ సమతుల్యత యొక్క ప్రాముఖ్యతను గుర్తు చేస్తూ ఈ ప్రచారం నిన్న‌ ప్రపంచవ్యాప్తంగా నిర్వహించబడింది. చిన్న మార్పుతోనే భూగోళాన్ని గ్లోబల్ వార్మింగ్ నుంచి కాపాడుకోవచ్చని ఈ ఎర్త్ అవర్ మనకు గుర్తు చేస్తోంది.

ఎర్త్ అవర్ సందర్భంగా రాష్ట్ర సచివాలయంలో నిలిచిపోయిన విద్యుత్ దీపాలు - Tholi Paluku