Let's talk: editor@tmv.in
ఊర్వశి, మిమిచక్రవర్తిలకు ఈడీ నోటీసులు

ఊర్వశి, మిమిచక్రవర్తిలకు ఈడీ నోటీసులు

Pinjari Chand
15 సెప్టెంబర్, 2025

ఆన్​ లైన్​ బెట్టింగ్​ యాప్​ ల ప్రమోషన్ చేసినందుకు మాజీ ఎంపీ మిమి చక్రవర్తికి, సినీనటి ఊర్వశి రౌతేలాకు ఈడీ నోటీసులు జారీ చేసింది. ఇప్పటికే యాప్​ విషయాల్లో ఈడీ దూకుడు మీదుంది. ప్రమోషన్​ చేసిన నటీ,నటులను విచారించింది. తాజాగా మిమి చక్రవర్తిని ఈ నెల 15న , ఊర్వశిని 16న ఢిల్లీలోని కార్యాలయంలో జరిగే విచారణకు హాజరు కావాలని

ఆదేశించింది. వీరు ప్రముఖ బెట్టింగ్​ యాప్​ 1ఎక్స్​ బెట్టింగ్​ కు ప్రచారం చేసినట్లు అధికారులు భావిస్తున్నారు. అయితే ఆర్థిక లావాదేవీలు, ప్రచారాల్లో వీరి పాత్ర ఎంతో రాబట్టడానికే విచారణకు పిలిచినట్లు తెలుస్తోంది. అయితే ఇదే కేసులో శిఖర్​ ధవన్, హర్భజన్​ సింగ్​, రైనా, యువరాజ్ సింగ్​ లను ఈడీ విచారించింది. టాలీవుడ్​ లోనూ రానా, ప్రకాశ్​ రాజ్​, మంచులక్ష్మీ, విజయ్​ దేవరకొండలను కూడా ఇదే యాప్​ ప్రమోషన్​ లో విచారించారు.

ఊర్వశి, మిమిచక్రవర్తిలకు ఈడీ నోటీసులు - Tholi Paluku