Let's talk: editor@tmv.in
ఉప ఎన్నిక వచ్చినా .. గెలిచేది నేనే: కడియం శ్రీహరి

ఉప ఎన్నిక వచ్చినా .. గెలిచేది నేనే: కడియం శ్రీహరి

Gaddamidi Naveen
23 నవంబర్, 2025

బీఆర్‌ఎస్‌ పార్టీ ఫిర్యాదు మేరకు, అధికార కాంగ్రెస్‌లోకి మారారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న స్టేషన్‌ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే కడియం శ్రీహరికి తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తాజాగా నోటీసులు జారీ చేశారు.స్పీకర్ శ్రీహరి నుంచి నేడు సమాధానం తెలుప‌ల‌ని కోరగా, ఎమ్మెల్యే మరింత సమయం కోరుతూ సమాధానం సమర్పణను వాయిదా వేసారు. శ్రీహరి సహా 10 మంది బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా డిస్క్వాలిఫికేషన్ పిటిషన్లు దాఖలైనాయి.నియోజకవర్గ అభివృద్ధి కోసమే కాంగ్రెస్‌తో కలిసి పనిచేస్తున్నాను కడియం శ్రీహరి భయపడడు. ఉప ఎన్నికలు వచ్చిన పక్షంలో కచ్చితంగా మళ్లీ పోటీ చేస్తా. ప్రజలు ఆశీర్వదిస్తారన్న నమ్మకం నాకు ఉంది అని కడియం అన్నారు.

నవంబర్ 17న సుప్రీంకోర్టు, 10 బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలపై డిస్క్వాలిఫికేషన్ పిటిషన్‌లను తీర్చడంలో స్పీకర్ వైపున పూర్వపు ఆదేశాలు పాటించకపోవడం వలన ధిక్కార నోటీసులు జారీ చేసింది. జూలై 31న చీఫ్ జస్టిస్ బి. ఆర్. గవాయి నేతృత్వంలోని బెంచ్,10 మంది ఎమ్మెల్యేల డిస్క్వాలిఫికేషన్ విషయంలో మూడు నెలల్లో తీరును నిర్ణయించమని స్పీకర్‌ను ధర్మాసనం ఆదేశించింది.

స్పీకర్ కార్యాలయం తరఫున వాదించిన న్యాయవాదులు, అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకోవడానికి మరో ఎనిమిది వారాల గడువు కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌పై కూడా ధర్మాసనం నోటీసు జారీ చేసింది.ఇప్పటివరకు నాలుగు పిటిషన్ల వినతులు పూర్తి కాగా, మూడు కేసుల్లో సాక్ష్యాల నమోదు ముగిసింది అని స్పీకర్ తరఫున ఒక న్యాయవాది తెలిపారు. బెంచ్, నాలుగు వారాల తర్వాత మరల విచారణను నిర్వహించమని నవంబర్ 17న నిర్ణయించింది.

అంతేకాక, ఎమ్మెల్యే కడియం శ్రీహరి కుమార్తె కడియం కావ్య 2024 లోక్‌సభ ఎన్నికల్లో వరంగల్ నుంచి కాంగ్రెస్ లోక్‌సభ సభ్యురాలిగా ఎన్నికయ్యారు.