
ఇండిగో విమానంలో సాంకేతిక లోపం
Pinjari Chand
15 సెప్టెంబర్, 2025
ఆర్టీసీ బస్సుల కంటే అధ్వానంగా మారాయి విమానాలు. ఎప్పుడు ఏదో ఓ కారణంతో నిలిచిపోతుంటాయి. ఇటీవల తిరువనంతపురం నుంచి ఢిల్లీకి బయల్దేరిన విమానంలో సాంకేతిక సమస్యలు రావడంతో ప్రయాణికులు భయబ్రాంతులకు గురయ్యారు. దీంతో అధికారులు చెన్నైలో విమానాన్ని నిలిపివేశారు. అయితే తాజాగా లక్నో నుంచి ఢిల్లికి వెలుతున్న సమయంలో ఇండిగో విమానంలో రన్ వే నుంచి టేకాఫ్ అవుతుండగా సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో ఫైలట్ చాకచక్యంగా వ్యవహరించి విమానాన్ని పక్కకు నిలిపివేశారు. దీంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఈ విమానంలో సమాజ్ వాది ఎంపీ డింపుల్ యాదవ్ తో సహ 151 మంది ప్రయాణికులు ఉన్నారు. ఎవరికీ ఇబ్బంది లేకుండా మరో విమానంలో వారి గమ్యస్థానాలకు పంపుతామని విమానాశ్రయ అధికారులు తెలిపారు. ప్రయాణికులు, వారి కుటుంబ సభ్యులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసానిచ్చారు.
