
ఇండిగో విమానాల రద్దుతో ప్రయాణికుల రద్దీ: అందుబాటులో ప్రత్యేక రైళ్లు
ఇండిగో విమానాల రద్దు వల్ల హైదరాబాద్లో ఏర్పడిన భారీ గందరగోళాన్ని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే (ఎస్సీఆర్) ప్రయాణికుల రద్దీని తగ్గించేందుకు ప్రత్యేక రైళ్లను నడపాలని ప్రకటించింది. శనివారం ఇండిగో భారీ స్థాయిలో విమానాలను రద్దు చేయడంతో రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పొడవాటి క్యూలు, సమాచారం లభించకపోవడం, విమాన రద్దులపై స్పష్టత లేకపోవడం వంటి సమస్యలు చోటుచేసుకున్నాయి.
చెన్నై, ముంబై, షాలిమార్కు ప్రత్యేక రైళ్లు
ఈ నేపథ్యంలో, అదనపు రద్దీ కారణంగా ఇరుక్కుపోయిన ప్రయాణికుల కోసం చెన్నై, ముంబై, షాలిమార్ (కోల్కతా) మార్గాల్లో నాలుగు ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు ఎస్సీఆర్ ఒక ప్రకటనలో తెలిపింది. ప్రత్యేక రైళ్లు శనివారం నుంచే బయలుదేరనున్నాయని, ప్రయాణికులు వీటిని వినియోగించుకోవాలని సూచించింది.
144 విమానాలు రద్దు
విమానాశ్రయ వర్గాల సమాచారం ప్రకారం, శనివారం రోజున ఒక్క హైదరాబాద్ నుంచే సుమారు 74 ఇండిగో అవుట్బౌండ్ ఫ్లైట్లు రద్దు కానున్నాయని. అలాగే 70 ఇంటికమింగ్ ఫ్లైట్లు కూడా రద్దు కావచ్చని అంచనా. ఈ అనూహ్య నిర్ణయం కారణంగా ప్రయాణికులు ఒక్కసారిగా కంగారు చెంది, ఇండిగో కౌంటర్ల వద్ద భారీగా చేరి వివరణ కోరారు. డిజియాత్రా ప్రక్రియ పూర్తి చేసి, విమాన సమయం ముందుకు మార్చినట్లు సందేశం వచ్చినా, విమానాశ్రయానికి చేరుకున్న తర్వాత మాత్రమే విమానం రద్దు అయిన విషయం వెల్లడైందని, ఈ వ్యవహారం పూర్తిగా అవ్యవస్థితమైందని మాజీ రక్షణ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి తరుణ్ సింఘా 'ఎక్స్'లో పోస్ట్ చేశారు.
మౌనంగా ఉంటే పని జరగదు. అరవకపోతే స్పందించరు. గంటపాటు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారు. చివరికి ఒక ప్రయాణికుడు మైక్లో అరిచిన తర్వాతే ఇండిగో సిబ్బంది అక్కడికి వచ్చారు, అని మరో నెటిజన్ వ్యాఖ్యానించారు. ఇప్పటికే శుక్రవారం దేశవ్యాప్తంగా వెయ్యికి పైగా విమానాలను రద్దు చేసిన ఇండిగోపై ప్రయాణికుల ఆగ్రహం మరింత పెరిగింది. ఈ పరిణామాలపై స్పందించిన ఇండిగో సీఈఓ పీటర్ ఎల్బర్స్ వీడియో సందేశంలో క్షమాపణలు తెలిపారు. శనివారం విమాన రద్దులు వేల సంఖ్యలో కాకపోయినా, వెయ్యికి తక్కువగానే ఉంటాయని ఆయన పేర్కొన్నారు.
ప్రయాణికులకు రిఫండ్ ఇచ్చేలా చర్యలు తీసుకుంటాం: కేంద్ర మంత్రి పెమ్మసాని
ఇండిగో విమానాల రద్దులు, ఆలస్యాలతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలో, పౌర విమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రయాణికుల పక్షాన దృఢంగా వ్యవహరించారు అని పరిస్థితిని పర్యవేక్షించేందుకు మంత్రిత్వ శాఖలో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి, నిరంతరంగా పరిస్థితిని గమనించారు అని. ఈ అంతరాయాల కారణాలపై దర్యాప్తును ప్రారంభించి, విమానాశ్రయాలు, ఎయిర్లైన్స్తో సమన్వయం చేసి చిన్నారులు, తల్లులు, వృద్ధులు, దివ్యాంగులకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించారని ఆయన 'ఎక్స్'లో పేర్కొన్నారు. అంతేకాకుండా, ప్రభావిత ప్రయాణికులందరికీ రీఫండ్లు, ఫీజు మినహాయింపులు అందేలా చర్యలు తీసుకున్నామని. సకాలంలో జోక్యం చేసుకుని ప్రయాణికులకు కలిగిన అసౌకర్యాన్ని ఉపశమనం చేయడానికి ఆయన నిర్ణయాత్మక చర్యలు తీసుకున్నారని ఆయన తెలిపారు.
