
ఆర్ఈప్లస్ ఆవిష్కరించిన 5.01 ఎంఎడబ్ల్యూహెచ్ లిక్విడ్ కూల్డ్ బ్యాటరీ
భారతదేశ శుభ్ర శక్తి విప్లవంలో మరో కీలక మైలురాయి నెలకొంది. పుణే కేంద్రంగా ఉన్న ఆర్ఈప్లస్ ఇంజిటెక్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ, న్యూఢిల్లీలో జరుగుతున్న రిన్యూవబుల్ ఎనర్జీ ఇండియా (ఆర్ఈఐ) ఎక్స్పో 2025 లో దేశంలోనే అభివృద్ధి చేసిన 5.01 మెగావాట్ గంటల సామర్థ్యంతో కూడిన లిక్విడ్ కూల్డ్ బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ (బిఈఎస్ఎస్) ఆర్ఈ 5కె ను ఆవిష్కరించింది.
ఇది భారతదేశంలోనే రూపకల్పన, తయారీ చేసిన మొదటి లిక్విడ్ కూల్డ్ బిఈఎస్ఎస్ కంటైనర్గా నిలిచింది. విద్యుత్ గ్రిడ్ స్థాయిలో శక్తి నిల్వ, పారిశ్రామిక అవసరాలు, పునరుత్పాదక శక్తి సమైక్యతకు ఇది ఒక అత్యాధునిక పరిష్కారం అవుతుంది. పుణేలోని ఆర్ఈప్లస్1 జీడబ్ల్యూహెచ్ తయారీ కేంద్రంలో అభివృద్ధి చేసిన ఈ వ్యవస్థ, ఇంజినీరింగ్ నాణ్యత, భద్రత, విశ్వసనీయత లో కొత్త ప్రమాణాలు సృష్టించింది.
ఆర్ఈ 5కెలో తెలివైన లిక్విడ్ కూలింగ్ సాంకేతికత, ద్వంద్వ దశల అగ్నిమాపక వ్యవస్థ, తుప్పు నిరోధక డిజైన్ వంటి ఆధునిక సదుపాయాలు ఉన్నాయి. ఇది 55°C వరకు ఉష్ణోగ్రతలో స్థిరంగా పనిచేయగలదు. అలాగే 20 సంవత్సరాల సర్వీస్ లైఫ్, 10,000 చక్రాల డిజైన్ కలిగిన దీర్ఘాయువు సెల్స్ ఉపయోగించడం దీని ప్రధాన ప్రత్యేకత. అంతర్జాతీయ భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా రూపొందించిన ఈ బ్యాటరీ వ్యవస్థ, మైక్రోగ్రిడ్లు, ఆఫ్ గ్రిడ్ ప్రాజెక్టులు, పరిశ్రమల బ్యాకప్ పవర్ అవసరాలకు సమర్థంగా ఉపయోగపడుతుంది.
ఆవిష్కరణ సందర్భంగా ఆర్ఈప్లస్ ఇంజిటెక్ మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ హిరణ్ ప్రవీణ్ షా మాట్లాడుతూ, ‘భారత్ స్థితిస్థాపక శక్తి భవిష్యత్తుకు అడుగులు వేస్తున్న సమయంలో, ఆర్ఈ 5కె ఆవిష్కరణ ఆవిష్కరణ, ఇంజినీరింగ్, వాస్తవ అన్వయాల సమ్మేళనాన్ని ప్రతిబింబిస్తుంది. ఈ ప్రాజెక్ట్ ద్వారా ‘ఆత్మనిర్భర్ భారత్’ మిషన్కు మేము గర్వంగా తోడ్పడుతున్నాం” అని తెలిపారు.
ఎల్ఎన్జే భిల్వారా గ్రూప్ వైస్ చైర్మన్ రిజు ఝున్ఝున్వాలా మాట్లాడుతూ, భద్రత, విశ్వసనీయత, పనితీరు ప్రతి ప్రాజెక్ట్లో రూపకల్పన దశ నుంచే భాగం కావాలి. రిన్యూవబుల్ ఎనర్జీ ఇండియా ఎక్స్పోలో ఈ మైలురాయిని సాధించడం గర్వకారణం అని అన్నారు. ఆర్ఈ 5కె ఆవిష్కరణ, భారతదేశం పెద్ద ఎత్తున శక్తి నిల్వ సాంకేతికతలో స్వదేశీ సామర్థ్యాలను బలోపేతం చేస్తూ, పునరుత్పాదక శక్తి మార్గంలో దేశాన్ని ముందుకు తీసుకెళ్లడంలో ఆర్ఈప్లస్ ఇంజిటెక్ కట్టుబాటును మరోసారి రుజువు చేసింది.
