Let's talk: editor@tmv.in
అస్సాంలో ప్రపంచకప్​ జరగడం గర్వంగా ఉంది

అస్సాంలో ప్రపంచకప్​ జరగడం గర్వంగా ఉంది

Pinjari Chand
30 సెప్టెంబర్, 2025

మహిళల ప్రపంచకప్​ ప్రారంభ మ్యాచ్ ను అస్సాంలో నిర్వహిస్తుండడం గర్వంగా ఉందని సోమవారం అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ అన్నారు. అయితే దుర్గా పూజలు ఉన్నందున, ముందే నిర్ణయించుకున్న కార్యక్రమాల వలన ఈ మ్యాచ్​ కు హాజరుకాలేకపోతున్నానని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచకప్ గౌహతిలో ప్రారంభం కానుండడం మాకు సంతోషాన్ని కలిగిస్తుంది. మాకెంతో గర్వకారణంగా ఉందన్నారు. అయితే ఐసీసీ మహిళల ప్రపంచకప్​ సెప్టెంబర్ నుంచి నవంబర్ 2 వరకు ఇండియా, శ్రీలంక వేదికగా జరగనున్నాయి.

ముఖ్యమంత్రి శర్మ గౌహతిలోని పండల్‌లో దుర్గా పూజకు హాజరయ్యారు. అక్కడ ఆయన జలుక్‌బరి నియోజకవర్గంలోని ధరాపూర్‌లో ఇటీవల మరణించిన సింగర్​ జుబీన్ గార్గ్ చిత్రపటానికి నివాళులర్పించి తన పూజ మండపాల సందర్శనను ప్రారంభించారు. ఈ నవరాత్రి కాలంలో జలుక్‌బరి నియోజకవర్గంలో మొత్తం 29 పూజల్లో పాల్గొననున్నారు. సోమవారం నవరాత్రిలో ఏడవ రోజు కావడంతో వేడుకలు ఉత్సాహంగా సాగుతున్నాయి. అలంకరణలతో మండపాలు కొత్త శోభను సంతరించుకున్నాయి. పూజ మండపాలన్నీ భక్తులతో నిండిపోయాయి.

జుబిన్​ మరణం వెనుక కుట్ర

ప్రముఖ గాయకుడు జుబీన్ మరణం వెనుక కుట్ర ఉందని సీఎం ఆరోపించారు. ఇది ప్రమాదవశాత్తు జరిగిన మరణం కాదని, దీని వెనుక ఎవరున్న కఠినంగా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ ఘటనపై చాలా లోతుగా ప్రత్యేక దర్యాప్తు జరుగుతుందన్నారు. సెప్టెంబర్​ 19 న సింగపూర్​ లో అనుమానస్పదంగా ఈతకొడుతూ ఆయన మరణించిన సంగతి తెలిసిందే. జుబిన్​ కు న్యాయం చేస్తామన్నారు.

అస్సాంలో ప్రపంచకప్​ జరగడం గర్వంగా ఉంది - Tholi Paluku